Sunday, February 16, 2020

మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి............!!సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు.

మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి............!!

సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు.
ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం
ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము.
కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు,
ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం
సూక్ష్మంగ తెలుసుకొందాము.
పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.

సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు.
గడప..లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం,
గడప మీద కాలు వేయడం,
గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.
పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.
అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం.
కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు,
విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు
ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

చెడిపోయిన గడియారాలు,
విరిగిపోయిన అద్దాలు,
చిరిగి, వాడని వస్త్రాలు
ఇంట్లో అస్సలు ఉండకూడదు.

ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం,
నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం
వంటివి చేయకూడదు.

ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో,
ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో,
ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

అబద్ధాలు చెప్పేవాళ్ళు,
ఇరు సంధ్యలలో భుజించేవారు,
నిద్రించే వారు,
బద్దకస్తులు ఎక్కడ ఉంటారో,
అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

అతిగా మాట్లాడే వారు,
గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు,
జూదరులు, అతి నిద్రాలోలురు,
అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట
లక్ష్మి దేవి ఉండలేదు.

ప్రతి శుక్రవారం తలస్నానం చేసి,
ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి,
లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు..!
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః..!!

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...