Sunday, February 16, 2020

శ్రీమద్భగవద్గీతఏడవ అధ్యాయంవిజ్ఞానయోగంశ్రీ భగవానువాచ:మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః |అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు

శ్రీమద్భగవద్గీత

ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం

శ్రీ భగవానువాచ:

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు || 1

శ్రీ భగవానుడు: అర్జునా! మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి, ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా, సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను.

జ్ఞానం తే௨హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే || 2

బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు (స్వానుభవంతో) సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమీ వుండదు.

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 3

ఎన్నో వేలమందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు.

భూమిరాపో௨నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || 4

నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం.

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || 5

అర్జునా! ఇప్పుడు చెప్పింది అపరప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో.

ఏతద్యోనీని భుతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || 6

నా ఈ రెండు ప్రకృతులనుంచే సమస్త భూతాలూ పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వజగత్తూ ఆవిర్భవించడానికీ, అంతం కావడానికీ కారణం నేనే.

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || 7

ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను.

రసో௨హమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 8

కౌంతేయా! నేనే నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నరులలో పురుషకారంగా వున్నాను.

పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 9

నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే.

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || 10

పార్థా ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధీ, తేజోవంతులలోని తేజస్సూ నేనే.

బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామో௨స్మి భరతర్షభ || 11

బలవంతులలోని ఆశ, అనురాగం లేని బలాన్ని నేను. ప్రాణులలోని ధర్మవిరుద్ధం కాని కామాన్నీ నేనే.

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి || 12

సాత్త్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను; నాలో అవి వున్నాయి.

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ || 13

ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || 14

త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || 15

పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలోపడి వివేకం కోల్పోయినవాళ్ళు, రాక్షసభావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు.

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో௨ర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || 16

అర్జునా ! నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు—ఆపదలో వున్నవాడు, ఆత్మతత్త్వం తెలుసుకో గోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు.

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినో௨త్యర్థమహం స చ మమ ప్రియః || 17

ఈ నలుగురిలో నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేనూ, నాకు అతనూ ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం.

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ || 18

వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు.

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || 19

అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివర జగత్తు సర్వమూ వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు.

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా || 20

తమ తమ పూర్వ జన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను, వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు.

యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 21

ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను.

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ || 22

అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు.

అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 23

మందబుద్ధులైన ఈ మానవులు పొందే ఫలితాలు అశాశ్వతాలు. దేవతలను అర్చించేవాళ్ళు దేవతలనే పొందుతారు; నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు.

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 24

అవివేకులు శాశ్వతం, సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవమాత్రుడిగా తలుస్తారు.

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢో௨యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 25

యోగమాయచేత కప్పబడివున్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది.

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 26

అర్జునా ! భూతభవిష్యద్వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరు నాకు తెలుసు. అయితే నేను ఏ ఒక్కడికీ తెలియను.

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప || 27

పరంతపా ! సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగ ద్వేషాలమూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 28

పుణ్యకర్మలు చేసి సకలపాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖరూపమైన మోహాలనుంచి విముక్తులై గట్టిపట్టుదలతో నన్ను భజిస్తారు.

జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ || 29

ముసలితనం, మృత్యువులనుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించేవాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మస్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలుగుతారు.

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలే௨పి చ మాం తే విదుర్యుక్తచేతసః || 30

అధిభూతమూ, అధిదైవమూ, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలిసినవాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరచిపోరు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "విజ్ఞానయోగం" అనే ఏడవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment

In 1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh

In  1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh and asked how much ...