Friday, December 30, 2022

*అనుకరణ ఒక శాపం*ఇతరులను అనుకరించకండి. మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి పాఠమిది. అనుకరణ నాగరికత కాదు.


*అనుకరణ ఒక శాపం*

ఇతరులను అనుకరించకండి. మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి పాఠమిది. అనుకరణ నాగరికత కాదు. 

మీరు ఒక రాజు వేషం వేసుకోవచ్చు. అంత మాత్రాన మీరు రాజునా? సింహపు చర్మం కప్పు కొన్న గాడిద సింహం కాగలదా? అనుకరణ ఎన్నడూ వృద్ధి అనిపించుకోజాలదు. 

అది నరునిలో చూపెట్టే పతన సూచనే! మానవుడు, తననుతాను ద్వేషించుకోవడం ప్రారంభించాడంటే, వానికి చివరి దెబ్బ తగిలినట్లే! 

తన పూర్వులను గూర్చి సిగ్గుపడటం ఆరంభిస్తే అంత్య కాలం మూడినట్లే! ఇతరుల నుండి మంచినంతా నేర్చుకోండి! మీకు స్వాభావికమైన మార్గంలో దాన్ని జీర్ణం చేసుకోండి. 

అంతేగానీ పరుల వేషం మాత్రం వేయకండి  ముసుగు ముసుగే
అప్పటి కైనా  ముసుగు తొలిగిపోతుంది నిజం  బయటకు వస్తుంది ఇది సత్యం
ఎల్ల కాలం  మోసం సాగదు పైన దేవుడు వున్నాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త 🙏🏻🚩

Thursday, December 15, 2022

ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో *మాసానాం మార్గశీర్షోహం* అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది.

🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*-:ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం, మార్గశిర మాస విశిష్టత:-*
                           
ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో *మాసానాం మార్గశీర్షోహం* అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలు అవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరు చెప్తూ ఉంటారు.

పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం , జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం .... మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , 

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి .**శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు.**ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.*

*మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి .*

*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు.*

*ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.*

*పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎన్నో ప్రదేశాల్లో ఆశ్రమ శాఖలు నిర్మించి, భక్త కోటిని అనుగ్రహించారు. వాటిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవతగా ప్రతిష్ఠ చేసిన క్షేత్రాల్లో మనకు దగ్గరలో గల క్షేత్రం బాదంపూడి . ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం కు దగ్గరలో గల మహా మహిమాన్విత క్షేత్రం అని చెప్పవచ్చు.* 

*ఇక్కడ ఒక సర్పం కూడా దేవాలయ ప్రాంగణంలో అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది.*

*పూజ్య శ్రీ అప్పాజీ వారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని బాల రూపంలో ప్రతిష్ఠ చేసారు . ఆనాటి నుండి ఆ బాల సుబ్రహ్మణ్య స్వామి వారు నమ్మి కొలిచిన భక్తులకు ఎన్నో వరాలను అనుగ్రహిస్తున్నాడు.*

*సంతానము, ఆరోగ్యము, వివాహము, ఋణ సంబంధ విషయాలలో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడ స్వామి వారిని దర్శించి పూజలు చేయడం వల్ల వారికి ఇబ్బందులు తొలగి మంచి జరుగుతుంది . ఎంతో మంది కి సంతానాన్ని అనుగ్రహించాడు ఆ బాల సుబ్రహ్మణ్య స్వామి వారు.* 

*ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అబ్బాయికి ఈ క్షేత్రం లో స్వామిని దర్శించి, మొక్కుకున్న తరువాతనే సంతానం కలిగిందని స్వయంగా చాగంటి వారే అందరికీ చెప్పి ఈ క్షేత్రములో స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.*

 *సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో షష్ఠి రోజున కావడి సేవ, అంటే స్వామి వారి అభిషేకంలో వాడే ద్రవ్యాలను కావడితో భుజంపై ధరించి, దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి.*

*ఆ తరువాత జరిగే ఏకాదశ రుద్రాభిషేకం లో స్వామి వారిని దర్శించి, సుబ్రహ్మణ్య హోమంలో పాల్గొని దేవాలయం లో ఉన్నంత సేపు సుబ్రహ్మణ్య స్వామి వారి నామాన్ని జపిస్తూ ఉండాలి.*

*ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలో పాల్గొని స్వామిని సేవించిన భక్తుల కష్టాలను తొలగించి శుభాలను అనుగ్రహిస్తారు శ్రీ బాదంపూడి బాల సుబ్రహ్మణ్య స్వామి వారు.*

*కాబట్టి అవకాశం కుదిరిన వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బాదంపూడి శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించండి .*

*ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి కలిసి రావడం.*

దేవాలయం చుట్టూ భక్తి పూర్వకంగా ప్రదక్షిణలు అంతరార్ధం*దేవాలయం చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ నిశ్శబ్దంగా ప్రార్ధన చేయమని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. (ప్రదక్షిణం గుడి చుట్టూ ఎడమవైపు నుండి కుడి వైపుకు తిరుగుతూ చేస్తారు.)

💐💐💐💐💐💐🌷🌷🌹🌹🪷🪷🌺🌺🚩🚩
దేవాలయం చుట్టూ భక్తి పూర్వకంగా ప్రదక్షిణలు అంతరార్ధం*

దేవాలయం చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ నిశ్శబ్దంగా ప్రార్ధన చేయమని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. (ప్రదక్షిణం గుడి చుట్టూ ఎడమవైపు నుండి కుడి వైపుకు తిరుగుతూ చేస్తారు.)

గత కాలంలో దేవాలయాలు విశాలమైన స్థలంలో నిర్మించే వారు. పాదరక్షలు లేకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం చక్కని వ్యాయామంగా ఉంటుంది. ఇలా ఉదయం మరియు సాయంత్రం దేవాలయాన్ని సందర్శించినప్పుడల్లా ప్రదక్షిణ చేస్తుండటం వల్ల సూర్యోదయ మరియు అస్తమయ కిరణాలు భక్తునికి విటమిన్లను అందించి ఆరోగ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. 

భక్తి పూర్వకమైన ప్రదక్షిణలు, దేవతా విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారాలు, మోకాళ్ళపై మోకరిల్లడం మొదలగునటువంటివి శరీరానికి, కీళ్ళకు మరియు కండరాలకు చక్కని వ్యాయామాన్ని కలిగిస్తుంది.

ఎడమనుండి కుడివైపు ప్రదక్షిణము చేయడం అనేది మెదడుకు అనుకూలంగా పనిచేస్తుంది. ఒకవేళ కుడి నుండి ఎడమకు తిరిగినట్టయితే అందుకు మెదడు ఆ ప్రభావాన్ని తట్టుకోలేదు. అలాంటప్పుడు మనకు అనుకూలంగా అనిపించదు. 

ఈ విషయాన్ని సైన్స్ కూడా నిర్ధారించింది. దైవశాస్త్రం ప్రకారం ప్రదక్షిణం వల్ల భక్తుడి పాపాలు ఈ జన్మవే కాక గత జన్మలవి కూడా తొలగిపోతాయి. అందుకే మరి భక్తితో ప్రదక్షిణలు చేద్దాం!

ధనుర్మాసం*ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం. సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉంటాడు.


🌻🌻🪷🪷🌺🌺🌸🌸💐💐🌹🌹🌷🌷🚩🙏🏻
                                           
*ధనుర్మాసం*

ధనుర్మాసం వైష్ణవులకు దివ్యమాసం. సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉంటాడు. 

చాంద్ర మాన రీత్యా మహావిష్ణువుకు ఎంతో ప్రియమైన మార్గశిరం, పుష్యమాసాల నడుమ ధనుర్మాసం ఉంటుంది. 

ఇది దక్షిణాయనంలో చిట్ట చివరి మాసం. 

దేవతలకు తెల్లవారుజాము కాలం ప్రారంభమవుతూ ఉండే ఈ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శ్రీకృష్ణుని వివిధ నైవేద్యాలతో పూజిస్తుంటారు. 

ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలతో, ముంగిట ముగ్గులతో స్వామిని తమ లోగిళ్లలోకి స్వాగతిస్తారు.ఇదే ధనుర్మాస  విశేషం 🚩🌷🌷🌷🌹🌹🪷🪷🌻🌻🙏🏻

గోదాదేవి అసలు కథ 🚩*🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.

*గోదాదేవి అసలు కథ 🚩*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్ప మాలలని అర్పిస్తూ ఉండే వాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తడనె ఆయనకు బిరుదు దక్కింది.ఆయనను విష్ణు భక్తు లైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియా ళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందిం చారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెనుసాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావిం చి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు *‘కోదై’* అంటే - పూలమాల అన్నపేరు తో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చే సరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసి నా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్ప టి గోపికలనీ , తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందిం చే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తు ని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కని పించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అప చారం కాదు కదా , ఎంతో ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మన సులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒక ప్పుడు గోపికలు చేసిన కాత్యా యని వ్రతాన్ని మొదలు పెట్టిం ది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలి పేందుకు , వారికి వ్రత విధానా లను తెలియచేసేందుకు , తన లో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 కీర్తనలు పాశురాలు గా మలిచి శ్రీ కృష్ణుని ఎన్నో విధాలు గా వర్ణిస్తూ పాడింది మన గోదాదేవి. అవే ధనుర్మా సంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లో నూ వినిపించే తిరుప్పావై గాధ
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదా దేవిని శ్రీరంగానికి తీసుకురమ్మ నీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయా న్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుం డా పోయాయి. వెంటనే గోదాదే వినీ , విల్లిపుత్తూరులోని ప్రజ లనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయం లోకి తీసుకువెళ్లారు. పెళ్లికూ తురిగా గర్భగుడిలోకి ప్రవేశిం చిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి , విష్ణుమూ ర్తితో కళ్యాణం జరుపుతారు మన శ్రీ వైష్ణవ ఆచార్యులు
🌷🌷🌹🌹💐💐🪷🪷🙏🏻

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...