Thursday, December 15, 2022

గోదాదేవి అసలు కథ 🚩*🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.

*గోదాదేవి అసలు కథ 🚩*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడు తూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్ప మాలలని అర్పిస్తూ ఉండే వాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తడనె ఆయనకు బిరుదు దక్కింది.ఆయనను విష్ణు భక్తు లైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియా ళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందిం చారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెనుసాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావిం చి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు *‘కోదై’* అంటే - పూలమాల అన్నపేరు తో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చే సరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసి నా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్ప టి గోపికలనీ , తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందిం చే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తు ని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కని పించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అప చారం కాదు కదా , ఎంతో ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మన సులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒక ప్పుడు గోపికలు చేసిన కాత్యా యని వ్రతాన్ని మొదలు పెట్టిం ది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలి పేందుకు , వారికి వ్రత విధానా లను తెలియచేసేందుకు , తన లో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 కీర్తనలు పాశురాలు గా మలిచి శ్రీ కృష్ణుని ఎన్నో విధాలు గా వర్ణిస్తూ పాడింది మన గోదాదేవి. అవే ధనుర్మా సంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లో నూ వినిపించే తిరుప్పావై గాధ
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదా దేవిని శ్రీరంగానికి తీసుకురమ్మ నీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయా న్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుం డా పోయాయి. వెంటనే గోదాదే వినీ , విల్లిపుత్తూరులోని ప్రజ లనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయం లోకి తీసుకువెళ్లారు. పెళ్లికూ తురిగా గర్భగుడిలోకి ప్రవేశిం చిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి , విష్ణుమూ ర్తితో కళ్యాణం జరుపుతారు మన శ్రీ వైష్ణవ ఆచార్యులు
🌷🌷🌹🌹💐💐🪷🪷🙏🏻

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...