Wednesday, January 25, 2023

మంత్ర మహిమ* 🌹🌹🌹🌹🌹 *ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి. రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం,


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*మంత్ర మహిమ*              🌹🌹🌹🌹🌹                      *ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి. రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇవి మనల్ని పతనం చేస్తాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. గురూపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. పాటలు, భజనలు కావలసినన్ని ఉన్నాయి. చేసుకోండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి. హాయిగా పాడుకోండి. రామ, శివ, శంభో అని నామం చేసుకోండి. తప్పులేదు. కానీ మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం బయటికి అంటాం, భజనలు చేస్తాం, ఎలుగెత్తి పలుకుతాం అంటే మహాపాపం. శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా వాడాలి. Hi Voltage Electricityని జాగ్రత్తగా వాడుతున్నామా? లేదా? ఉపయుక్తమైనది, మంచిది, గొప్పది అని తీగను పట్టుకుంటే ఏమౌతుందో అదే అవుతుంది ఇవన్నీ చేస్తే. శాస్త్ర ప్రమాణములున్నాయి దీనికి. ఒకమందు ప్రిస్కిప్షన్ లేనిది పుచ్చుకోకూడదని డాక్టర్లు చెప్తారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటుంది. ఏ జబ్బుకి యేమందో లిస్ట్ దొరుకుతుంది. నచ్చిన మందు వేసుకుంటే యే డాక్టర్ ఒప్పుకుంటాడో చెప్పండి. జబ్బు, మందు తెలిసినప్పటికీ వాడకూడదు. వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుడు కూడా ఇద్దరు డయాబెటిక్ పేషేంట్స్ కి ఒకే మందు వ్రాయడు. ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రిమివ్వడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు.
అయితే కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. నమశ్శివాయ, శివాయ నమః కూడా పంచాక్షరే. ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః - భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్మే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.
న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!
సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము*.        🙏🙏🙏
(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసం నుంచి )

*మంచిమాట *ఒక మనిషి తన మనసు లోని మాటను నిర్మొహమాటం లేకుండా చెప్పగలిగినపుడు నిజమైన వ్వక్తి అంతే కాని ఎదుటి వ్వక్తిని నమ్మించడానికి పొగడ్తలతో ముచ్చెడుతున్నాడు అంటే మోసం చేస్తున్నాడు అని అర్ధం కొందరు ఏమి తెలియకపోయినా తెలిసినట్లు అన్ని తెలిసినట్లు నటిస్తువుంటారు మిత్రులారా ఇలాంటి వాళ్ళ గురించి చాలాజగ్రత్త

💐💐💐🚩🚩🚩🙏🏻🙏🏻
       *మంచిమాట *
ఒక మనిషి తన మనసు లోని మాటను నిర్మొహమాటం లేకుండా చెప్పగలిగినపుడు నిజమైన వ్వక్తి అంతే కాని ఎదుటి వ్వక్తిని నమ్మించడానికి పొగడ్తలతో ముచ్చెడుతున్నాడు అంటే మోసం చేస్తున్నాడు అని అర్ధం కొందరు ఏమి తెలియకపోయినా తెలిసినట్లు అన్ని తెలిసినట్లు నటిస్తువుంటారు మిత్రులారా ఇలాంటి వాళ్ళ గురించి చాలాజగ్రత్త

నేటి బంధాల్లో బలమెంత?**********************ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారినిఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.- ఓ భర్త ఆవేదన

🌹🌹🌹🌹🌹🌹🙏🏻🚩

నేటి బంధాల్లో బలమెంత?
**********************

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన 

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.

స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.

ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం

వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.

అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం

.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.

అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!. ఆలోచించండి .....

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

*పుణ్యకాలం ప్రారంభం*

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణా యనమ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణమ'ని అంటారు.

దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం చెబుతోంది.

1. సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు బియ్యాన్నీ, రేగుపండ్లను పెట్టి ఇళ్ళను అలంకరించుకుంటారు.

2. సంక్రాంతి పండుగనాడు నానావిధాలైన కూర అన్నింటిని కలిపి వండుతారు. ఆ రోజు బ్రాహ్మణులకు కూర గాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు.

3. నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం జపిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఉత్సాహభరితమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి.

4. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పూర్వజుల మొక్కు బడులూ, ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలూ తీర్చాలి.

5. నువ్వుపప్పు, బెల్లం కలిపి, 'లడ్డూ'లు తయారు చేసి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచిత మైన భావాలు పోయి, అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.

6. సంక్రాంతి శీతకాలంలో వస్తుంది. కాబట్టి ఈనాడు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.

మాఘమాసం మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది.

కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.

ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.
అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.

అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.
అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

*మానవుడు తాను అనుభవిస్తున్న పాప పుణ్యాలకు, జన్మకు కర్మకు జన్మ జన్మలకు సంబంధాన్ని ధర్మశాస్త్రాల ఆధారంగా వివరణ ఇవ్వండి.*భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి.

*మానవుడు తాను అనుభవిస్తున్న పాప పుణ్యాలకు, జన్మకు కర్మకు జన్మ జన్మలకు సంబంధాన్ని ధర్మశాస్త్రాల ఆధారంగా వివరణ ఇవ్వండి.*

భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి. 

భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలను తెలియచేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచిచేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని. అంతేకాదు... ఆ పని చేయడానికి మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసులాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి. 

మన జన్మకు, కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ మూడు విధాలు. సంచిత కర్మ, ప్రారబ్ధకర్మ, ఆగామి కర్మ. 

వెనుక జన్మలలో చేసుకున్నది సంచితం. సంచితంలో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకుని, వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది. ఆగామి. 

అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. ఎలాగంటే నేరస్థుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు, ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్షపడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది. 

అలా జన్మజన్మలకు పేరుకపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాం. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారబ్ధాన్ని సుఖంగా అనుభవించే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కర్మసిద్ధాంతం మూలసూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. 

అందుకే ఆ భగవానుడిపై భారంవేసి, అన్నీ మంచి పనులు చేసి లోకహితం చేకూర్చడానికి మనం పాటుపడాలి. ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తపపడాలి. మరొక్కసారి మన వల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.

శ్రీపంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భావ రోజు పుట్టినరోజు. మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పుట్టినరోజు గా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం.

శ్రీ గురుభ్యోనమః 🙏🏻.

ప్ర: శ్రీపంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భావ రోజు పుట్టినరోజు

జ: మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పుట్టినరోజు గా ఆరాధించడం అనేది మనకు పురాణాలలో, ఇతర శాస్త్రాలలో కనబడుతున్న అంశం. 
ఈ మాఘశుద్ధ పంచిమి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది. ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవీభాగవతం, బ్రహ్మవైవర్తపురాణం ప్రస్తావిస్తున్న అంశములు. పరమపురుషుని వదనం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైన పరమేశ్వరుడు, విరాట్పురుషుడు.... ఆయన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడిటి స్వరూపమే సరస్వతి. 'వాగ్బుద్ధిజ్ఞానాధిష్ఠాత్రి'. మనం కూడా ఏదైనా పని చేయాలంటే మన నుండి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి. 

మనకు ఒక పని చేయడానికి మన వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో.... ఈ విశాలమైన విశ్వం సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా ఒక జ్ఞానము, వాక్కు, బుద్ధి ఉన్నాయి. ఆ బుద్ధి, జ్ఞానరూపంలో ఏ శక్తి ఉన్నదో దానిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం. 

ఆ సరస్వతి ఈ మాఘశుద్ధ పంచమినాడు విరాట్పురుషుని నుండి ఆవిర్భవించింది - అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం. అందుకే ఈ రోజున సరస్వతీదేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోకమానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది. కాబట్టి ఈ రోజున సరస్వతీ ఆవిర్భావదినంగా ప్రతివారూ - అందునా విద్యార్థులు, పెద్దవారు అందరూ - కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.
తెల్లని కలువలు తో లేదా మంచి సుమాలతో పూజ చేసి పాయసాన్నము నివేదించాలి.

పిల్లలతో తప్పక ఆచరింప చేయవలసిన పూజల లో ఈ సరస్వతి పూజ విశేషమైనది.

పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి 🙏🏻 సేకరణ...

Tuesday, January 3, 2023

#ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది.

💐💐💐💐🚩🚩🚩🚩
#ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.
ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.
ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.
వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.
★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.
★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.
★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.
★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.
★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.
★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.
★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.
★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.
★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.
★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.
★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.
★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.
★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.
★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.
★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.
★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.
★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.
★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.
★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.
బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.
మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.
జై శ్రీరామ్, జై హింద్.
-*** సేకరణ*****

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...