Sunday, August 29, 2021

Excellent information about Bhagwan Shri Krishna1) Krishna was born *5252 years ago* 2) Date of *Birth* : *18 th July,3228 B.C*3) Month : *Shravan*4) Day : *Ashtami*5) Nakshatra : *Rohini*

Excellent information about Bhagwan Shri Krishna

1) Krishna was born *5252 years  ago* 
2) Date of *Birth* : *18 th July,3228 B.C*
3) Month : *Shravan*
4) Day :  *Ashtami*
5) Nakshatra : *Rohini*
6) Day : *Wednesday*
7) Time : *00:00 A.M.*
8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*
9) Date of *Death* : *18th February 3102BC.*
10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 
11) He died *36 years after the Kurukshetra* war.
12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  
12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*
13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*

14) Krishna  is worshipped as:
(a)Krishna *Kanhaiyya* : *Mathura*
(b) *Jagannath*:- In *Odisha*
(c) *Vithoba*:- In *Maharashtra*
(d) *Srinath*:  In *Rajasthan*
(e) *Dwarakadheesh*: In *Gujarat*
(f) *Ranchhod*: In *Gujarat*
(g) *Krishna* : *Udupi in Karnataka*
h) *Guruvayurappan in Kerala*

15) *Bilological Father*: *Vasudeva*
16) *Biological Mother*: *Devaki*
17) *Adopted Father*:- *Nanda*
18) *Adopted Mother*: *Yashoda*
19 *Elder Brother*: *Balaram*
20) *Sister*: *Subhadra*
21) *Birth Place*: *Mathura*
22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*
23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 
(i) *Chanoora* ; the Wrestler
(ii) *Kansa* ; his maternal uncle
(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 
24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 
25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.
26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*
27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of  10 years and 8 months at Mathura.He then released  his biological mother and father. 
28) He *never returned to Vrindavan ever again.*
29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.*
30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*
31) He *rebuilt Dwaraka*. 
32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 
33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta*;  who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 
34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 
35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.

36) He *saved Draupadi from embarrassment.*

37) He *stood by his cousins during their exile.*
38) He stood by them and *made them win the Kurushetra war.*

39) He *saw his cherished city, Dwaraka washed away.* 
40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 
41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 
42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*

43)  He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*

44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻

*Jai  Shri Krishna*

Saturday, August 28, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -20 వ చివరిభాగం 💥గరుడపురాణం_అసలు_రహస్యం..!🙏 వ్యాసభగవానుడు మనకు అందించిన 18 మహా పురాణాలలో ఒకటైన 'గరుడ పురాణంలో' 28 రకాల నరకాలున్నాయి.

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -20 వ చివరిభాగం 

 💥గరుడపురాణం_అసలు_రహస్యం..!

🙏 వ్యాసభగవానుడు మనకు అందించిన 18 మహా పురాణాలలో ఒకటైన 'గరుడ పురాణంలో' 28 రకాల నరకాలున్నాయి.

⭕ మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని మన పెద్దలంతా బలంగా కోరుకున్నారు. రాముడైనా, యముడైనా వారి సంకల్పం సామాజిక సంక్షేమమే! మన పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.

⭕ మనం చేసే పాపాలను బట్టి యముడు ఆయా నరకాలకు మనను పంపుతుంటాడట. "అపరిచితుడు" సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు, ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పులు చేయాలంటే కాస్త భయం కలిగిందని చెప్పవచ్చు.

👉 అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం‌. మన తప్పులు సరిచేసుకుందాం.

🔥 1.తమిశ్రం:- ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసే ఇదో చిమ్మచీకటి నరక కూపం.

🔥 2. అంధతమిశ్రం:-  ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.

🔥 3. రౌరవం:-  రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.

🔥 4. మహారౌరవం:- న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.

🔥 5. కుంభీపాకం:-  వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.

🔥 6.కాలసూత్రం:-  ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది...

🔥 7. అసితపత్రవనం:-  విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.

🔥 8.సూకరముఖం:- అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.

🔥 9. అంధకూపం:- చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.

🔥 10. తప్తమూర్తి:-  ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

🔥 11: క్రిమిభోజనం:-  ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.

🔥 12. శాల్మలి:-  దీన్నే 'తప్తశాల్మలి' అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.

🔥 13. వజ్రకంటకశాలి:-  జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.

🔥 14. వైతరణి:-  అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.

🔥 15. పూయోదకం:-  వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.

🔥 16. ప్రాణరోధం:-  కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.

🔥 17. వైశాసనం:-  పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.

🔥 18. లాలభక్షణం:- అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరుచు వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది.

🔥 19. సారమేయాదానం:-  ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్న సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.

🔥 20. అవీచి:- నీటిబొట్టులేని నరకం ఇది.

Thursday, August 26, 2021

🌹 శ్రీ గరుత్మంతుడి కథ -18 వ భాగం 💥విష్ణు_మహిమధర్మరాజుకి ఉపదేశిస్తున్న మునులునారాయణుడు " వినతా పుత్రా ! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు.

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కథ -18 వ భాగం 

 💥విష్ణు_మహిమ

ధర్మరాజుకి ఉపదేశిస్తున్న మునులు
నారాయణుడు " వినతా పుత్రా ! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు. అఖిలభూతములు నా యందు జన్మించి, నాయందు పెరిగి, నా యందే నశిస్తాయి. అఖిలభూతములు నాయందు ఉంటాయి. నేను అఖిల భూతములందు ఉంటాను. నన్ను తెలుసు కోవాలంటే జీవాత్మను పరమాత్మ వైపు మళ్ళించాలి. కామమును, అహంకారమును, కోపమును, జడత్వమును వదిలి పెట్టాలి. ఇతరుల నుండి ఏదీ గ్రహించకూడదు. అహింసను అవలంబించి మనసును నిర్మలంగా ఉంచుకుని నిత్య తృప్తులై ఉండాలి. అలాంటి వారికి నేను దర్శనం ఇస్తాను. సాంఖ్యయోగము అవలంబించినప్పటికి బాహ్యముతో సంబంధబాంధవ్యాలు తెంచుకోలేని వారికి నిశ్చయబుద్ధి లేని వారికి నేను కనిపించను. అధికమోహములో పడి కొట్టుకుంటూ పూజలు, వ్రతములు, ఉపవాసములు ఆడంబరముగా చేసే వారికి నేను కనిపించను. ఏకాంతమనస్కులు నన్ను దర్శించగలరు. రజ, తమోగుణులకు కాక కేవలం సత్వగుణము కలవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ  అని నాలుగు విధములుగా విభజింపబడి ప్రాణులందు ఆత్మ, బుద్ధి, అహంకారము, మానస్సు అనే నాలుగు విధములుగా ప్రవర్తిస్తుంటాను. ఇది నా స్థూల రూపము. నీవు కూడా నన్ను తెలుసుకుని నాయందు భక్తితో సదా నన్ను ధ్యానిస్తూ నా నిజస్వరూపమును తెలుసుకో " అని నారాయణుడు నాకు తెలియజేసాడు. నారాయణుడు నాకు చెప్పినది నేను మీకు చెప్పాను " అని సుపర్ణుడు మునులకు సిద్ధులకు చెప్పినది విని వారు ఆనంద పరవశులై " మహానుభావా ! నీ వలన మేము విష్ణుతత్వము విని ధన్యులమైయ్యాము. ఈ కథ అత్యంత పుణ్యదాయకమై విన్న వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ కథ విన్న బ్రాహ్మణులకు వేదవిద్య అలవడుతుంది. క్షత్రియులకు జర్వత్రా విజయము లభిస్తుంది. వైశ్యులకు సంపద అభివృద్ధి చెందుతుంది. శూద్రులకు సకల శుభములు చేకూరుతాయి. సర్వజనులు ఇహపరసౌఖ్యాలను పొందుతారు. అని పొగిడారు. ధర్మనందనా ! ఈ కథ పూర్వము బ్రహ్మదేవుడు వసువులకు చెప్పగా వసువులు మా తల్లి గంగాదేవికి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు నీకు చెప్పాను. ధర్మనందనా ! మనసులో చేసే సకలవిధ సంకల్పములను విడిచి పెట్టి ఆత్మను అగ్నియందు ప్రతిష్ఠించి బాహ్యసంబధములు విడిచి ధ్యానమగ్నుడవై విష్ణువును ధ్యానించి మోక్షమును సాధించు. ఇలా చేసిన వారికి మోక్షము సులువుగా లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

🦅🦅🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -17 వ భాగం 💥గరుత్మంతుడు_కశ్యపుడునేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు.

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -17 వ భాగం 

💥గరుత్మంతుడు_కశ్యపుడు
నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శనమిచ్చాడు. నేను ఆయనను దర్శించవలెనన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగసమాధిలో ఉండి తపమాచరించాను. ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వరూపము చూపి " కశ్యపా ! నీలో ఇంకా కోరికలు చావలేదు. మనసులో కోరికలు పెట్టుకుని నన్ను చూడడం జరగని పని. నీ వు నిస్సంగుడవైనప్పుడు నన్ను దర్శించగలవు " అన్నాడు. అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబరధారి శంఖు చక్ర గధా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.
గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట

🌹తపస్సుచేసుకొంటున్న_శివుడు
నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు. నేను ఆయనను అనుసరించాను. అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు. నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాంఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించ లేదు. " ఈ దిక్కుకు రా " అన్న శబ్ధము వినిపించింది. నేను దిక్కు తోచక అటువై వెళ్ళాను. క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. అక్కడ సూర్యుడు  పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతము వినవస్తుంది. తామర కొలనులు ఉన్నాయి. అందమైన మగవారు ఆడవారు నారాయణ మూర్తిని పూజిస్తుండగా ఆయన అలా వెళుతుండగా నేను ఆయనను అనుసరించాను. నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామీ అని అరిచాను. ఆయన వాత్సల్యంతో " వినతాకుమారా ! నేను నిన్ను మరచిపోతానా ! నా వెంట రా ! నీవు నన్ను చూడలేదని బాధపడకు. మమతలు, అహంకారం మనసున రానీక నిశ్చల మనసుతో ఏకాగ్రచిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద కలిగిన భక్తిప్రత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరము మాత్రమే చూడగలుగుతున్నావు " అని స్వామి నాతో అన్నాడు. అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది. నేని తిరిగి స్వామిని అనుసరించాను. నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను. అక్కడ స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇటురా ! అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను. అక్కడ తెల్లటి హంసలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది. అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను. ఆయన నాకు కనిపించ లేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేధ ఘోషలు వినవచ్చాయి. అప్పుడు కొన్ని వందల గరుడపక్షులు నన్ను చుట్టుముట్టగా నేను భయ భ్రాంతుడనయ్యాను. నేను అచ్యుతా, శివా, సహస్రాక్షా, వేదమయా, అనాది నిధనా, త్రిభువనైక నాధా, త్రినైనా, గోవిందా, పద్మనాభా, హరా, కృపా విధేయా  అని పెద్దగా స్వామిని స్తోత్రం చేసాను. అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై " వినతా పుత్రా ! భయపడకు " అని నా భుజం తట్టాడు. నేను కళ్ళు తెరిచి చూడగా బదరికాశ్రమంలో ఉన్నాను. అది చూసి ఆశ్చర్యచకితుడనై ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకుని పులకించిపోయాను. అప్పుడు నాముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుడిని చూసి స్వామి ముందు మోకరిల్లి " మహానుభావా ! నేను నీ పాదసేవకుడను అయితే, నేను నీ దయకు పాత్రుడనైతే, నేను వినడానికి అర్హుడనైతే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాను.

🦅🦅🦅🦅🦅🦅🦅



卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *గురువారం, ఆగష్టు 26, 2021* 🌟
       *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
     *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
      *శ్రావణ మాసం - బహుళ పక్షం*
తిధి   :  *చవితి* సా5.18
             తదుపరి పంచమి    
వారం  : *గురువారం* (బృహస్పతివాసరే) 
నక్షత్రం : *రేవతి* రా11.40
               తదుపరి అశ్విని
యోగం : *శూలం* ఉ7.35
               తదుపరి గండం
కరణం  :  *బాలువ* సా5.18
                తదుపరి కౌలువ
వర్జ్యం  :  *ఉ10.54 - 12.36* 
దుర్ముహూర్తం : *ఉ9.57 - 10.47* &
                       *మ2.57 - 3.47*
అమృతకాలం:  *రా9.06 - 10.48* 
రాహుకాలం   :  *మ1.30 - 3.00* 
యమగండం/కేతుకాలం: *ఉ6.00 - 7.30*
సూర్యరాశి: *సింహం* || చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.47* || సూర్యాస్తమయం: *6.18*

        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*
 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*

Monday, August 23, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -1 వ భాగం 💥పరిచయంగరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు..

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -1 వ భాగం 

💥పరిచయం

గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు..

🦅గరుత్మంతుని_జననం:

(గరుడారూఢుడైన విష్ణువు, వ్యావహారిక 6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. లలాట తోరణం పై చెక్కినది. వేంగి చాళుక్యుల నాటిది. పెదవేగి గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.)

కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.

దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు...

సేకరణ

🦅🌹🦅🌹🦅🌹🦅


卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *మంగళవారం, ఆగష్టు 10, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
          *శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి   :  *విదియ* సా6.13
             తదుపరి తదియ    
వారం  : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *మఖ* ఉ10.58
              తదుపరి పుబ్బ 
యోగం : *పరిఘము* రా10.29
               తదుపరి శివం 
కరణం  :  *బాలువ* ఉ6.38
                తదుపరి *కౌలువ* సా6.13
              ఆ తదుపరి తైతుల 
వర్జ్యం   :  *సా6.54 - 8.30* 
దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.07* &
                       *రా10.57 - 11.42*
అమృతకాలం:  *ఉ8.32 - 10.39* &
                        *తె4.27నుండి*
రాహుకాలం   :  *మ3.00 - 4.30* 
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.44* || సూర్యాస్తమయం: *6.28*
      👉 *మంగళగౌరీ వ్రతము*

        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*

 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*


🌷🌷 శ్రావణమాసం పరమ పవిత్రం🌷🌷

శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. 

 ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి.

సనాతన ధర్మంలో  చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.

శివారాధనకు ఎంతో విశిష్టత..

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.

సోమవారాల్లో శివుడి ప్రీత్యా ర్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.

మంగళ గౌరీ వ్రతం..

శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

వరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి.  ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..

శ్రవణ మాసంలోని విశిష్టతలు..

శక్ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.

శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.

కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. 

ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

జై శ్రీమన్నారాయణ🙏

🌷🌷🌷🌷🌷🌷🌷

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -6 వ భాగం 🌹దానములు_ధర్మములు:దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -6 వ భాగం 

🌹దానములు_ధర్మములు:

దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.

సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.

దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి
 గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల ని ఇస్తుంది ....

🦅🦅🦅🦅🦅🦅🦅


卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *ఆదివారం, ఆగష్టు 15, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
          *శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి   :  *సప్తమి* ఉ9.51
             తదుపరి అష్టమి  
వారం  : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *స్వాతి* ఉ6.46
              తదుపరి *విశాఖ* తె5.09
యోగం : *శుక్లం* ఉ10.21
               తదుపరి బ్రహ్మం 
కరణం  :  *వణిజ* ఉ9.51
                తదుపరి *విష్ఠి* రా8.39
            ఆ తదుపరి బవ
వర్జ్యం   :  *ఉ11.59 - 1.28* 
దుర్ముహూర్తం : *సా4.42 - 5.32* 
అమృతకాలం:  *రా8.56 - 10.26* 
రాహుకాలం   :  *సా4.30 - 6.00* 
సయమగండం/కేతుకాలం: *మ12.00 - 1.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.45* || సూర్యాస్తమయం: *6.24*
👉 🇮🇳 *భారత స్వాతంత్య్ర దినోత్సవం* 🇮🇳
     *స్వాతంత్య్ర దినోత్సవ  శుభాకాంక్షలు*
        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*
 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*

🥀 *కర్మ సిద్ధాంతం* 🥀

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.
అది ఎవ్వరికీ అర్థంకాదు.

మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను" అనుభవించాలి. నిందిస్తే ప్రయోజనం లేదు.

రమణ మహాశయులు కాశీలో ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవాడు ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి, తన వెనుకనున్న కృష్ణా తో "కృష్ణా! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు కృష్ణకు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు.
ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు, మీదపడినది.కాలి వేలు చితికింది. రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు. కృష్ణ అప్పుడు గ్రహించాడు.

వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు.ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి, రమణ మహాశయులతో "మహారాజ్! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు?" అని ప్రశ్నించారుఅప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో "ఆలా జరగదు కృష్ణా! పక్కకి తప్పుకొంటే, ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. 

రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా! "అని అన్నారు.
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.
*హిందూ ధర్మచక్రం*

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -4 వ భాగం 🌹అనూరుని_శాపంకశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు.

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -4 వ భాగం 

🌹అనూరుని_శాపం

కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.

#వినత_కద్రువల_పందెం 

వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమథనములో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.

#సంతానానికి_కద్రువ_శాపం

కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో  మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.

తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.

🦅🦅🦅🦅🦅🦅🦅


卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *శుక్రవారం, ఆగష్టు 13, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
          *శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిధి   :  *పంచమి* మ2.10
             తదుపరి షష్ఠి   
వారం  : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం : *హస్త* ఉ9.23
              తదుపరి చిత్ర 
యోగం : *సాధ్యం* సా4.00
               తదుపరి శుభం  
కరణం  :  *బాలువ* మ2.10
                తదుపరి *కౌలువ* రా1.18
            ఆ తదుపరి తైతుల
వర్జ్యం   :  *సా5.06 - 6.39* 
దుర్ముహూర్తం : *ఉ8.32 - 9.22* &
                       *మ12.42 - 1.32*
అమృతకాలం:  *రా2.23 - 3.55* 
రాహుకాలం   :  *ఉ10.30 - 12.00* 
యమగండం/కేతుకాలం: *మ3.00 - 4.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.45* || సూర్యాస్తమయం: *6.26*
     👉   *గరుడ పంచమి*
             *శ్రీ కల్కి జయంతి*

        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*

 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏


✍️....నేటి చిట్టికథ


సూరదాసు శ్రీకృష్ణ భగవానుని భక్తుడు. ఆయన అంధుడు. ఒకసారి ఆయన యాత్రకై బయలుదేరి దారిలో ఒక నీరులేని బావిలో పడిపోయాడు. ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ "ఓ భగవంతుడా! నేను అంధుణ్ణి. నేను ఈ బావి నుండి బయట
పడలేకపోతున్నాను. నన్ను కాపాడు స్వామీ! నీవు ఒక్కడవే నన్ను రక్షించగలవు” అని కోరాడు. 

ఆయన మొర ఆలకించి శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా అక్కడికి విచ్చేసి సూరదాసును రక్షించారు. 

వారి సంభాషణను గుర్తుపట్టి సూరదాసు వచ్చినవారు శ్రీకృష్ణభగవాన్, రాధాదేవిగా గుర్తించాడు. ఆయన ఇలా ప్రార్థించాడు “భగవాన్! నేను నీ కంఠస్వరాన్ని మాత్రం వినగల్గుచున్నాను. గుడ్డివాణ్ణి కనుక దర్శించలేకపోతున్నాను” 

శ్రీ కృష్ణుడు సూరదాసుతో ఒక చమత్కారం చేశాడు. “రాధా! అతని దగ్గరకు వెళ్లకు. అలా వెళితే నీపాదాలు పట్టేస్తాడు” అని కృష్ణుడు రాధను హెచ్చరించాడు.

రాధ తెలివిగా సూరదాసు వెనుకవైపుగా వెళ్ళి వీపును స్పృశించింది.

సూరదాసు ఆమెను గుర్తించి “ఓహో! నీవు నా వెనుకకు వచ్చావా తల్లీ అంటూ ఆమె పాదాలు పట్టేశాడు. రాధాదేవి అతని చేతుల నుండి విడివడి దూరంగా వెళ్లింది. కాని, సూరదాసు చేతిలో ఆమె కాలిఅందెలు ఉండిపోయాయి. రాధాదేవి సూరదాసుతో “శ్రీకృష్ణునికి చాల ఇష్టమైన నాకాలి అందెలు నాకు ఇచ్చేశేయి” అని అన్నది.

అందుకు సూరదాసు “నేను గుడ్డివాణ్ణి కదమ్మా! అందెలు నీవే నని నాకు తెలిసేదెట్లా? నేను చూడ గలిగితే అవి నీ వని నాకు తెలుస్తుంది. అందుకు నాకు చూపు ప్రసాదించమని శ్రీకృష్ణుని కోరు” అని అన్నాడు.

రాధాదేవి విన్నపంతో శ్రీకృష్ణుడు సూరదాసుకు “చూపు” కలిగించాడు.

ఆయన రాధా కృష్ణులను దర్శించగలందులకు మహాదానందం చెందాడు.

శ్రీకృష్ణునికి సూరదాసు పట్ల అనుగ్రహం కలిగింది. “
నీవేదయిన వరం కోరుకో ఇస్తా” అని శ్రీకృష్ణుడన్నాడు.

సూరదాసు వినమ్రతతో “ఓ! మహానుభావా! నీ దివ్యమంగళ స్వరూపం చూచిన పిమ్మట నాకు ప్రపంచంలోని ఇతర వస్తువులేవీ చూడాలని లేదు. నన్ను తక్షణం అంధుణ్ణిగా చేసేయ్” అని ప్రార్థించాడు.

శ్రీకృష్ణపరమాత్మ పట్ల సూరదాసు భక్తి అలాంటిది.

🌷🌷🌷🌷🌷🌷🌷
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*

శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం 🌹మనం_తెలిసి_తెలియక_ చేసే_పాపాలు_ఏవి ....!

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -10 వ భాగం 

         🌹మనం_తెలిసి_తెలియక_ చేసే_పాపాలు_ఏవి ....! 

హరించే వారు, తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాసఘాతుకులు, విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించే వారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు, పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ, గురువులనూ, దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు,
ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి
చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే. తల్లి తండ్రులకు, గురువుకు, ఆచార్యులకు, పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు, పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు. గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ద్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది.

🦅🦅🦅🦅🦅🦅🦅

శ్రీ గరుత్మంతుడి కధ -11 వ భాగం 💥గరుత్మంతుడు_హన్మంతుడు

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -11 వ భాగం 

💥గరుత్మంతుడు_హన్మంతుడు

శ్రీ మహావిష్ణువు తన జెండాపై గరుత్మంతుని చిహ్నంగా వుంచుకున్నాడు. ఆయన వాహనం కూడా గరుత్మంతుడే. ఎందుకంటే గరుత్మంతుడు మహా బలశాలి. తల్లి ఇచ్చిన మాటకోసం, తనయుడు చేసిన త్యాగానికి ప్రతీకగా గరుత్మంతుడు నిలబడ్డాడు. తనకు చేసిన సహాయానికి నీకేమి కావాలో కోరుకోమంటే, నీ సేవే నాకు కావాలన్నాడు గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి తనతో ఎల్లప్పుడూ వుండే వాహనంగా, జెండాపై గుర్తుగా వుంచుకుంటానని గరుత్మంతునికి మాట ఇచ్చాడు.

హనుమంతుడు అర్జునుడి అహంకారాన్ని అణచివేయాలని, అతనికి పాఠం చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అర్జునుడు గ్రహించి, తనను క్షమించమని అడిగి తనకు కౌరవులతో పోరాడి గెలిచేలా సహకరించమని కోరతాడు. హనుమంతుడు అర్జునుడిని మెచ్చి, తనకు తోడుగా వుంటానని మాట ఇస్తాడు. అప్పటి నుంచి తన పతాకంపై కపిరాజును చిహ్నంగా పెట్టుకుంటాడు అర్జునుడు. అదే అతని విజయానికి సంకేతం.

అలా పతాకాల గుర్తుగా గరుడుడు, ఆంజనేయులు కీర్తి పొందారు. ఆ విధంగా ప్రసిద్ధులైనవారి ఇద్దరిని గురించి రాసాను.

గరుత్మంతుని, హనుమంతుని ధ్యానిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, నీతి, నిర్భయం, ధైర్యం కలుగుతాయి. మృత్యు భయం ఏమాత్రం ఉండదు. సర్వత్రా విజయం కలుగుతుంది. హనుమంతుని, గరుత్మంతుని కథలను వింటే చాలు.

సమస్త జనులకు గరుత్మంతుడు, హనుమంతుల కరుణాకటాక్షాలు కలగాలని అశిస్తూ . . .

🦅🦅🦅🦅🦅🦅🦅

శ్రీ గరుత్మంతుడి కధ -13 వ భాగం 💥వైతరణీ_నది

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -13 వ భాగం 

💥వైతరణీ_నది

వైతరణీ నది చూట్టూ గల నరకలోకం
వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నదిని  దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడింది.

🌹1_వర్ణన

ఈ నది అతి భయంకరమైనది, దీనిలో నుండి వెళ్లే సమయములో వచ్చే బాధకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్ని ఉండును.

వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.

హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట..

🌹2_దాటడానికి_మార్గాలు

ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గుండా రారు, ఇంకా చెప్పాలంటే యమ లోకానికే రారు.

🌹3_నది_దాటాక

ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము నకు చేరుకొందురు.

🌹అబద్ధమాడిన_వారు_నరకాన్ని_చవి_చూడాల్సిందే

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

🦅🦅🦅🦅🦅🦅🦅

శ్రీ గరుత్మంతుడి కధ -15 వ భాగం 💥వైష్ణవము

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -15 వ భాగం 

💥వైష్ణవము

ధర్మరాజు " పితామహా ! తమరు అంపశయ్య మీద ఉండి కూడా నేను అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. నేను ఎన్నో ధర్మసూక్ష్మాలు తమ ముఖతః విన్నాను. కాని అవి ఏవి జననము, మరణము వీటి వలన వచ్చే దుఃఖం తొలగించవు కదా ! ఎన్నో జన్మల నుండి ఎంతో మంది తల్లి తండ్రులకు పుడుతూ మరణిస్తూ ఈ సంసార చక్రంలో నేనిక తిరుగ లేను. పితామహా ! గర్భవాసముకు స్వర్గము నరకము ఉంటాయా చెప్పండి. ఈ చరాచర జగత్తు అసత్యము కనుక నేను ఈ జగత్తును విషతుల్యముగా చూస్తాను. నాకు ఈ రాజ్యము వద్దు సంసారము వద్దు. నాకు మోక్షకారకమైన వైష్ణవధర్మము ఉపదేశించండి. ఈ యుగములో వైష్ణవధర్మము కనిపించడం లేదని వ్యాసుడు  చెప్పాడు. కనుక నేను అది మీ నుండి తెలుసుకొనగోరుతున్నాను " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ఏమిటీ వెర్రి. 18 రోజులు యుద్ధము చేసి శత్రువులను జయించి రాజ్యము కైవశము చేసుకుని ఇలా మాట్లాడటము నీకే చెల్లింది. లేకున్న క్షత్రియులకు ఇది తగదు. నీవు మిధిలా నగరాధిపతి జనకుడిలా మాట్లాడుతున్నావు. నిర్యాణము అనునది శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దానిని ఇలా ఉంటుంది అని వర్ణింపజాలము. జీవుడికి అది అతీతము. ప్రకృతులు ఎన్నో ఉన్నా ఆకృతి ఒక్కటే . అదే అన్నింటికీ మూలము. ఆకృతి ఎన్నో జీవాత్మలుగా రూపాంతరము చెందినా అది ఎటువంటి వికారము చెందదు. అది తన స్వస్వరూపము మరువదు. సంసారము అనే మార్గము సుగమంగా కనిపిస్తుంది. మోక్షమార్గము కామము, క్రోధముతో కప్పబడి ఉంటుంది. కనుక కామము, క్రోధములను విడిచి సత్వగుణమును ఆశ్రయించి జీవితము గడపాలి దానినే వైష్ణవమని అంటారు. నీవుఈ ధర్మమును పాటించి సంసార భయమును వీడి మోక్షము సాధించు " అని భీష్ముడు చెప్పాడు.

🌹తత్వములు

ధర్మరాజు " పితామహా ! తత్వములు, అధ్యాత్మములు, అదిదైవతములు, అదిభూతములు అను వాటికి కర్త భర్త హర్త అయి సకల భూతములకు ఆధారభూతమైన పరమాత్మ గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వీరు కాక బ్రహ్మకు మరీచి, భృగువు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను ఆరుగురు కుమారులు ఉన్నారు. అందు సనత్సుజాతుడు బొటనవ్రేలి ప్రమాణంలో ఉండి అగ్ని మాదిరి మండుతుంటాడు. ఒక ప్రదేశాన నిలువక సదా లోకాలన్నీ చుట్టివస్తాడు. ఒక రోజు సనత్సుజాతునకు నారదుడు మేరుపర్వతము మీద కనిపించాడు. ఆయన చెప్పిన విషయము నేను నీకు చెప్తాను. విష్ణుమూర్తికి పదివేల సంవత్సరములు రాత్రి, పదివేల సంవత్సరాలు పగలు. ఇరవై వేల యుగములు ఒక రోజు. విష్ణువు రూపమును అవ్యక్తము అంటారు. విష్ణువు రాత్రు నిద్రించి పగలు సృష్టి ఆరంభిస్తాడు. సృష్టిచేయ సంకల్పించిన విష్ణువు శుక్లమును అండాకారములో జలములో విడిచిపెడతాడు. తరువాత తన నాభి నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయనను సృష్టికి కర్తగా నియమించాడు. తరువాత బ్రహ్మను అహంకారము ఆవహించింది. తరువాత మనసు, బుద్ధి, ఇంద్రియములు, పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి  అను పంచభూతములను సృష్టించాడు. పంచభూతములకు గుణముగా శబ్ధము, స్పర్శ, రూపము, రసము, గంధము  ఆవిర్భవించాయి. తరువాత దేవతలు, మునులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, నరులు, జంతువులు మొదలైన జీవజాతులు ఆవిర్భవించాయి. వీటన్నింటినీ అహంకారము ఆవహించింది. ఇవి అన్నీ అవ్యక్తమైన సంసారసాగరమున పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు. ఈ సృష్టి స్థితి లయములకు కారకుడైన విష్ణువు జీవరాసులకు శుభాశుభములు కలిగిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తుంటాడు. పంచభూతములు, పంచ గుణములు, మహాతత్వము, పది ఇంద్రియములు, అహంకారము, మనసు, బుద్ధి అను ౨౪ తత్వములు...

🌹అధ్యాత్మము_అదిభూతము_అధిదైవతములు

చెవి అధ్యాత్మము అయితే శబ్ధము అదిభూతము. దిక్కులు  అధిదైవతములు. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ  అదిభూతము, గాలి దానికి అదిదైవతము. కళ్ళు అధ్యాత్మము అయితే రూపము అది భూతము సూర్యుడు దానికి అదిదైవతము. నాలుక ఆధ్యాత్మము అయితే రుచి దానికి అదిభూతము నీరు దానికి అదిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన దానికి అదిభూతము భూమి దానికి అదిదైవతము. వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు. పాదములు, విసర్జకావయవము, జననేంద్రియము, చేతులు, నోరు కర్మేంద్రియములు అనునవి అధ్యాత్మికములు. పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక, విసర్జనము, ఆనందము, పని, మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనసు, బుద్ధి ఆధ్యాత్మకములు, వీటికి అభిమానము, సంకల్పము, నిశ్చయము అధిభూతములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవతములు. ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమౌతాయి. అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమౌతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా ఆధారం విష్ణువు.
పరమశివుడి అనుమతితో బ్రహ్మ జననమరణములు నిర్వహిస్తూ ఉంటాడు " అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు " అని చెప్పి భీష్ముడు " ధర్మజా ! ఈ సృష్టికంతకూ మూలము 25వ తత్వము అయిన పరమాత్మ. వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములలో నివసించే వాడు, విష్ణువు, అద్వయుడు, అసంగుడు. అతడే పరమాత్మ " అని భీష్ముడు పలికాడు..

🦅🦅🦅🦅🦅🦅🦅



卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐
🌟 *మంగళవారం, ఆగష్టు 24, 2021* 🌟
       *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
     *దక్షిణాయనం - వర్ష ఋతువు* 
      *శ్రావణ మాసం - బహుళ పక్షం*
తిధి   :  *విదియ* సా4.19
             తదుపరి తదియ     
వారం  : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా9.08
               తదుపరి ఉత్తరాభాద్ర 
యోగం : *సుకర్మ* రా9.07
               తదుపరి ధృతి   
కరణం  :  *గరజి* సా4.19
                తదుపరి *వణిజ* తె4.26
వర్జ్యం   :  *లేదు* 
దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.07* &
                       *రా10.53 - 11.39*
అమృతకాలం:  *మ12.58 - 2.36* 
రాహుకాలం   :  *మ3.00 - 4.30* 
యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *సింహం* || చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *5.47* || సూర్యాస్తమయం: *6.18*
        *_To Stay Safe Against COVID-19_*   
                    *Get Vaccinated*   
          😷  *Wear Mask Properly*  😷
              *Keep 6ft. Safe Distance* 
*Wash Hands Frequently with Soap/Sanitizer*
 *_సర్వేజనా సుఖినోభవంతు_* 
             *శుభమస్తు* 🙏
_______________________________  
           *_గోమాతను పూజించండి_*
           *_గోమాతను సంరక్షించండి_*

Friday, August 20, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -12 వ భాగం 💥వివిధ_గ్రంధాలలో_గరుత్మంతుని_ప్రస్తావనా

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -12 వ భాగం 

    💥వివిధ_గ్రంధాలలో_గరుత్మంతుని_ప్రస్తావనా

🌹వేదాలు
అధర్వణ వేదంలో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు విషదహారి అని చెప్పబడింది. గరుత్మంతుని స్వరూపం, అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు..

దక్షిణ పాదము స్వస్తికము, ఎడమపాదము కుంచితముగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్న, హరికి ఇష్టుడైన గరుత్మంతునికి నమస్కరించెదను. అతనికి అనంతుడు వామకటకము, వాసుకి యజ్ఞసూత్రము. తక్షకుడు  కటిసూత్రము, కర్కోటకుడు హారము. దక్షిణ కర్ణమున పద్ముడు, వామకర్ణమున మహాపద్ముడు, తలమీద శంఖుడు, భుజముల మధ్య గుళికుడు ఉన్నారు. అతడు నాగులచే సేవింపబడుచున్న కపిలాక్షుడు. నాగాభరణ భూషితుడు. బంగారు కాంతి కలవాడు. పొడవైన బాహువులు, పెద్ద మూపు, మోకాళ్ళనుండి బంగారు రంగు కలిగినవాడు. మొలపైన తెలుపు రంగు, కంఠము వరకు ఎరుపు రంగు, వంద చంద్రుల కఅంతిగల ముక్కు, కిరీటము ఉన్నవాడు. విష్ణువునకు వాహనుడు. గరుత్మంతుని పేరు తలచినంతనే సర్వవిషములు హరించిపోతాయి.

🌹పురాణాలు_రామాయణం

రామాయణం యుద్ధకాండలో నాగబంధవిమోచన అనే ఘట్టం ఉంది. ఈ భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు.

ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు. కొద్దిగా సృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి, తన ప్రతిజ్ఞలన్నీ మిధ్యలయ్యాయని వగచి, ప్రాయోపవేశానికి సిద్ధనయ్యాడు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు. వారు శక్తి వంచన లేకుండా మిత్ర కార్యం నిర్వహించారని, అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానిదని చెప్పాడు. వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు.

అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం  కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు..

🌹మహాభారతం

మహా భారతం ఆది పర్వములో సర్పయాగానికి ముందుగా వినత, కద్రువుల వృత్తాంతము, గరుత్మంతుని కథ చెప్పబడింది. భగవద్గీత విభూతి యోగము 30వ శ్లోకములో కృష్ణుడు తాను వైనతేయశ్చ పక్షిణామ్ - పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుని - అని తెలిపాడు..

🌹సంప్రదాయాలు 

గరుడారూఢుడైన విష్ణువు - బ్యాంగ్‌కాక్, థాయిలాండ్లో ఒక విగ్రహం
సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు ల బొమ్మలు చూపుతారు.

పండుకొనేముందు ఈ శ్లోకం పఠించే సంప్రదాయం ఉంది. ఇందులో గరుత్మంతుని స్మరణ కూడా ఉంది.

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః పఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి.

🦅🦅🦅🦅🦅🦅🦅

Saturday, August 7, 2021

🌑 *ఆషాఢ అమావాస్య!!**హిందూ ధర్మచక్రం* 🌑

🌑 *ఆషాఢ అమావాస్య!!*
*హిందూ ధర్మచక్రం* 🌑

🌚 ఆషాఢ మాసపు అమావాస్యను నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. 

🌚 పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రిక పేరు అచ్ఛోద. ఈమె నదీరూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యేళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". 

🌚అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృతర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. 

🌚అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలను కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుని వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతనమహారాజ పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీమతి శ్రీ విద్యగారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించబడినది. )

🌟 *ఆదివారం, ఆగష్టు 8, 2021* 🌟
        *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
      *దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు* 
      *ఆషాఢ మాసం -  బహుళ పక్షం*
తిధి   :  *అమావాస్య0* సా6.45
             తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి 
వారం  : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *పుష్యమి* ఉ9.46
              తదుపరి ఆశ్రేష 
యోగం : *వ్యతీపాతం* రా1.07
               తదుపరి వరీయాన్ 
కరణం  :  *చతుష్పాత్* ఉ6.36
                తదుపరి *నాగవ* సా6.45
              ఆ తదుపరి కింస్తుఘ్నం
వర్జ్యం   :  *రా11.00 - 12.40* 
దుర్ముహూర్తం : *సా4.46 - 5.37* &
                       *మ12.31 - 1.22*
అమృతకాలం:  *లేదు*
రాహుకాలం   :  *సా4.30 - 6.00* 
యమగండం/కేతుకాలం: *మ12.00 - 1.30*
సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.44* || సూర్యాస్తమయం: *6.28*
 👉 *సర్వ అమావాస్య*
  *పాతార్క యోగం*  *పుష్యార్క యోగం*

🙏సర్వే జనా *సుజనో* భవతూ!
సర్వ *సుజనా* సుఖినో భవతూ!!🙏
         🙏 *శుభమస్తు*  🙏
_______________________________   
                 *గోసేవ చేద్దాం*               
           *గోమాత ను పూజిద్దాం*                                                
        *గోవులను రక్షించు కుందాం*                                                                                                                                                                     🙏 *ఓం గౌమాత్రే నమః* 🙏

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...