Saturday, February 13, 2021

*గట్టిగా ధైర్యంగా బుద్ధి చెప్పండి*.................................................( పూర్తిగా చదవండి )మార్పు అనేది మనిషిలో వచ్చినంతగా ఇతర జీవులలో రాదు. తన నమ్మకాన్ని విశ్వాసాలను మనిషే మార్చుకోగలడు. ఈ రోజున వైదికమతాన్ని అవలంభించిన వ్యక్తి రేపు బ్రాహ్మణమతాన్ని అవలంభించవచ్చు.( బ్రాహ్మణ మతమంటే బ్రాహ్మణుల మతమనికాదు వైదికమతంలో ప్రధాన దేవుడు ఇంద్రుడు, ఆ తరువాత వరుణ, వాయుదేవతలు చెప్పుకోదగినవారు. బ్రాహ్మణమతంలో ఇంద్రుడి స్థానాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆక్రమించారు. )ఆ తరువాత మానవుడు బౌద్ధాన్నో, జైనంనో లేదా సనాతన ధర్మాన్నో అనుసరించవచ్చును. ఇలా మానవులు తమ విశ్వాసాలను నమ్మకాలను ఆచారాలను వ్యవహారాలను మార్చుకొనే సౌలభ్యం కల్పించుకొన్నాడు.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే !హిందూదేవతలు మాంసం తినేవారా ? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం.ఆ రోజులలో దేవతలేకాదు బ్రాహ్మణులు కూడా మాంసాహారం తినేవారు. అది వారి జీవనవిధానం, ఆహారపుటలవాటు కూడా.ఉదా॥ భీముడు ఏకచక్రపురంలో వున్నపుడు తనకు ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడు అతనికి పెట్టిన భోజనం, మూలసంస్కృత భారతంలోని ఆదిపర్వంలో ఎలావుందంటే.."పిశితోదన మాజ హ్రు రథా స్మైపురవాసిన:నఘృతం సోవదశం చ సూపైర్నానా విధైస్సహతదా2 శీత్వా భీమసేనో *మాంసాని* వివిధానిచ."బాగా వండిన అన్నంతోపాటుగా వివిధ రకాలైన భక్ష్యాలు, కూరలు, పెరుగు మొదలైన వాటితో పాటు రకరకాలైన మాంసపుకూరలు భీమసేనుడికి ఆ బ్రాహ్మణుడు పెట్టాడు.పిల్లలు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, మా పాపాయి తిన్న అన్నం జీర్ణమనే సామెత గురించి తెలుసుకొంటే త్రేతాయుగంలో బుుషులలో మాంసాహారం తప్పనిసరని తెలుసుకోవాలి.వాతాపి, ఇల్వలుడు అనే వారిద్దరు రాక్షసులు, అన్నదమ్ములు. వాతాపికి కామరూపవిద్య తెలుసు, ఇల్వలుడికి సంజీవని విద్య తెలుసు. ఇద్దరు నరమాంస భక్షణ చేయాలనుకొన్నప్పుడు, వాతాపి కామరూప విద్యతో మేకగా మారేవాడు. ఇల్వలుడు అరణ్యంలో వెళుతున్న బ్రాహ్మణులను తమ ఇంట శ్రాద్ధకర్మలు జరుగుతున్నాయి, భోక్తగా రమ్మని వారిని పిలిచేవాడు.ఆ రోజుల్లో భోక్తకు మాంసాహారం తప్పని సరిగా వడ్డించేవారు. మేకగా మారిన ఇల్వలుడిని వాతాపి వధించి వండి భోక్తకు వడ్డించేవాడు. భోక్త తిన్న తరువాత ఇల్వలుడు తన సంజీవని విద్యచే మరణించిన వాతాపిని బ్రతికించేవాడు.బ్రతికిన వాతాపి భోక్త కడుపు చీల్చుకొని బయటపడేవాడు. బ్రాహ్మణుడు మరణించేవాడు, ఆ నరమాంసాన్ని అన్నదమ్ములు తినేవారు.అగస్త్యమహర్షి ఆ అడవి మార్గంలో ఒక రోజు రావడం జరిగింది. ఎప్పటిలాగే ఇల్వలుడు అగస్త్య మహామునిని తన తండ్రి అబ్ధికంలో భోక్తగా రమ్మని పిలిచాడు. త్రికాలవేదైన ఆ మహామునికి వీరి దుర్మార్గం తెలిసింది. ఎప్పటిలాగే వాతాపి మేకగా మారడం, ఇల్వలుడు ఆ మేకను కోసి కూరగా వండి అగస్త్యునికి వడ్డించడం, తిన్న తరువాత అగస్త్యుడు కడుపు మీద చేయి వేసుకొని నిమురుకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే, కడుపులో వాతాపి జీర్ణమైపోయాడు.సంజీవని విద్య ప్రయోగించి ఇల్వలుడు ఓ వాతాపి బయటకు రా అన్నాడు. ఇంకెక్కడి వాతాపి.విషయం తెలుసుకొన్న ఇల్వలుడు కోపంతో తన భీకర రాక్షసరూపం పొంది అగస్త్యముని మీదకు మింగటానికి రాగా, ఆ మహాముని వాడిని కంటిచూపుతోనే భస్మం చేశాడు.పై కథనుబట్టి ఆ రోజులలో మాంసాహారమనేది సర్వజనసమ్మతమని, ఎవరిలోనూ నిషిద్ధం కాదని తెలుస్తోంది.వైదిక బ్రాహ్మణమతకాలాలలో యజ్ఞయాగాదులలో జంతుబలి తప్పనిసరి. జంతుబలి అనంతరం వాటిని రాజులు పురోహితులు వారి ఇతర పరివారం తినేవారు. ఇదే విషయాన్ని మహాకవి ఆరుద్రగారు వ్రాసిన సమగ్ర ఆంధ్రసాహిత్యం మొదటి భాగంలో ఎలా తెలియచేశారో చూద్దాం.''బుుగ్వేద ఆర్యులు గోమాంసాన్ని, గుర్రం మాంసాన్ని గోర్రెలను, మేకలను వాటితోపాటు తినేవారు.వాటిని ముందుగా యజ్ఞంలో దేవతలకు వాటిని సమర్పించి తరువాత హాయిగా తినేవారు.మహయజ్ఞాలలో ఏకకాలంలో 500 ఎద్దులు 500 గోవులు 500 దున్నలు 500 మేకలు 500 పొట్టేళ్ళను సేకరించి యూపస్తంభాలకు కట్టి వధించేవారు. రోజుకు అయిదునూర్ల లెక్కన జంతువులను వధించి తినేవారన్నమాట"సాక్ష్యాత్తు విష్ణువాహనమైన గరుడుడు తన తల్లికి జరిగిన అన్యానికి ప్రతీకారంగా నాగులను చంపితినడం మనకు తెలుసు కదా !యజ్ఞయాగాదులలోనూ, తన వంటశాలలోనూ రోజు కొన్ని వేల జంతువులు పక్షులు వధించబడటం చూచి మౌర్య అశోకుడు చలించిపోయాడు. అందుకే జీవహింస చేయరాదని, జంతువధ కూడదని అశోకుడు తన శాసనాలలో వ్రాయించి ప్రచారం చేశాడు.మరి హిందూమతంలో మాంసాహారం నిషేధం ఎలా జరిగింది. దేవతలు, బ్రాహ్మణులు మొదలైనవారు మాంసాహారులు కారని శుద్ధ శాకాహారులని ఎందుకు ప్రచారంలోనికి వచ్చింది. ఇలా మార్పురావటానికి కారణమేమిటి ?వైదికబ్రాహ్మణ మతాలలో విసృంఖల జంతుబలులను మూఢనమ్మకాలను వర్గవిబేధాలను నిరసిస్తూ పుట్టినవే జైనబౌద్ధమతాలు. నాటి సమాజంలో అసమానతలతో హెచ్చు తగ్గులతో బాధలుపడుతున్న సామాన్య ప్రజలు జైనబౌద్ధాలపట్ల అకర్షితులైనారు. జైనం, బుద్ధమతం ప్రజలలో వెళ్ళునూకుపోయింది. జైనబౌద్ధాలలోని దేవతారాధనకు ఆడంబరాలు, ఆర్భాటాలు అవసరంలేదని, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, జీవహింస చేయరాదనే నైతిక సూత్రాలు ప్రజలను ఆలోచింపచేశాయి.బౌద్ధజైనాల పట్ల సామాన్య ప్రజల ఆదరణను చూచి వైదిక బ్రాహ్మణమతాలు ఆలోచనలో పడ్డాయి. వైదిక బ్రాహ్మణ మతస్తులు తమమతాన్ని రక్షించుకోటానికి సంస్కరణల బాటను పట్టించారు. తమమతం కూడా జీవహింసకు వ్యతిరేకమేనని నైతికవిలువలతో కూడిన పూజావిధానాలు ఇక్కడ కూడా అనుసరణీయమని చెప్పారు.అందుకే తదనంతర కాలంలో సనాతన ధర్మంలో జంతుబలులు మాంసాహారం నిషేధించబడ్డాయి. ఇలాంటి సంస్కరణలలో భాగంగానేమూలభారతంలో మాంసాహారం తిన్న పాండవద్వితీయుడు భీమసేనుడు ఫక్తు శాకాహారాన్ని తిన్నట్లుగా నన్నయ భారతాంధ్రీకరణలో"పలుతెరంగుల పిండివంటలుబప్పుగూడును నేతికుండలుగుడంబులు దధి ప్రపూర్ణ ఘటంబులుం గొని వచ్చియిన్ "అంటూ వ్రాసి భీముడు శాకాహారిగా మార్చి పలురకాలైన పిండివంటలు, పప్పుకూడులు, నేతితో నింపిన బెల్లపుపూర్ణాలు పెరుగుమొదలైనవి తినిపించాడు.జైనబౌద్ధమతాల ప్రేరణతో మార్పులు దిద్దుకొన్న సనాతన ధర్మంలో ఇంకా మాంసాహారం ఉండిపోవటానికి అనేక కారణాలున్నాయి. జైనబౌద్ధమతాల పతనం తరువాత వచ్చిన రాజులందరూ వర్ణసంరక్షణ చేపట్టారు.వర్ణ సంకరాన్ని నిషేధించారు.కొందరు యజ్ఞ యాగాదులు మరలా మొదలుపెట్టారు. అటవికులు, మారుమూల ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేదు.ఈ సువిశాలదేశంలో ప్రజలందర జైనబౌద్ధమతాల పట్ల ఆకర్షితులు కాలేదు. వారందరూ మాంసాహరులే. ఇంకా విదేశీదండయాత్రల వలన ఈ సువిశాల హిందూదేశంలో స్థిరపడిన విదేశీయుల ప్రధానఆహారం మాంసమే. సమాజంలో సాంఘికజీవనంలో ఒకరికొకరు మమేకమై సంస్కృతి సాంప్రదాయాలకు ఆహారపుటలవాట్లకు, ఇంకా అనేక మార్పుకులోనైనారు.మాంసభక్షణ అనేది మనిషి పుట్టినప్పటి నుండేవుంది. పాతరాతి యుగానికంటే ముందుగా మానవుడు పచ్చి మాంసానినే భుజించాడు కదా !*ఎవరైనా హిందూదేవతలు కూడా మాంసభక్షకులేనని విమర్శిస్తే, ఇబ్బంది పడవద్దు, జంకవద్దు,అవును ఒకపుడు అది సాధ్యమైంది, ఇపుడు సంస్కరణలలో భాగంగా ఈ మార్పు అవసరమైందని గట్టిగా ధైర్యంగా బుద్ధిచెప్పండి.*

*గట్టిగా ధైర్యంగా బుద్ధి చెప్పండి*
.................................................
( పూర్తిగా చదవండి )

మార్పు అనేది మనిషిలో వచ్చినంతగా ఇతర జీవులలో రాదు. తన నమ్మకాన్ని విశ్వాసాలను మనిషే మార్చుకోగలడు. ఈ రోజున వైదికమతాన్ని  అవలంభించిన వ్యక్తి రేపు బ్రాహ్మణమతాన్ని అవలంభించవచ్చు.

( బ్రాహ్మణ మతమంటే బ్రాహ్మణుల మతమనికాదు వైదికమతంలో ప్రధాన దేవుడు ఇంద్రుడు, ఆ తరువాత వరుణ, వాయుదేవతలు చెప్పుకోదగినవారు. బ్రాహ్మణమతంలో ఇంద్రుడి స్థానాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆక్రమించారు. )

ఆ తరువాత మానవుడు బౌద్ధాన్నో, జైనంనో లేదా సనాతన ధర్మాన్నో అనుసరించవచ్చును. ఇలా మానవులు తమ విశ్వాసాలను నమ్మకాలను ఆచారాలను వ్యవహారాలను మార్చుకొనే సౌలభ్యం  కల్పించుకొన్నాడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే !

హిందూదేవతలు మాంసం తినేవారా ? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం.

ఆ రోజులలో దేవతలేకాదు బ్రాహ్మణులు కూడా మాంసాహారం తినేవారు. అది వారి జీవనవిధానం, ఆహారపుటలవాటు కూడా.

ఉదా॥ భీముడు  ఏకచక్రపురంలో వున్నపుడు తనకు ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడు అతనికి పెట్టిన భోజనం, మూలసంస్కృత భారతంలోని ఆదిపర్వంలో ఎలావుందంటే..

"పిశితోదన మాజ హ్రు రథా స్మైపురవాసిన:
నఘృతం సోవదశం చ సూపైర్నానా విధైస్సహ
తదా2 శీత్వా భీమసేనో *మాంసాని* వివిధానిచ."

బాగా వండిన అన్నంతోపాటుగా వివిధ రకాలైన భక్ష్యాలు, కూరలు, పెరుగు మొదలైన వాటితో పాటు రకరకాలైన మాంసపుకూరలు భీమసేనుడికి ఆ బ్రాహ్మణుడు పెట్టాడు.

పిల్లలు తిన్న ఆహారం జీర్ణం కావాలంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, మా పాపాయి తిన్న అన్నం జీర్ణమనే సామెత గురించి తెలుసుకొంటే త్రేతాయుగంలో బుుషులలో మాంసాహారం తప్పనిసరని తెలుసుకోవాలి.

వాతాపి, ఇల్వలుడు అనే వారిద్దరు రాక్షసులు, అన్నదమ్ములు. వాతాపికి కామరూపవిద్య తెలుసు, ఇల్వలుడికి  సంజీవని విద్య తెలుసు. ఇద్దరు నరమాంస భక్షణ చేయాలనుకొన్నప్పుడు, వాతాపి కామరూప విద్యతో మేకగా మారేవాడు. ఇల్వలుడు అరణ్యంలో వెళుతున్న బ్రాహ్మణులను తమ ఇంట శ్రాద్ధకర్మలు జరుగుతున్నాయి, భోక్తగా రమ్మని వారిని పిలిచేవాడు.

ఆ రోజుల్లో భోక్తకు మాంసాహారం తప్పని సరిగా వడ్డించేవారు. మేకగా మారిన ఇల్వలుడిని వాతాపి వధించి  వండి భోక్తకు వడ్డించేవాడు. భోక్త తిన్న తరువాత ఇల్వలుడు తన సంజీవని విద్యచే మరణించిన వాతాపిని బ్రతికించేవాడు.బ్రతికిన వాతాపి భోక్త కడుపు చీల్చుకొని బయటపడేవాడు. బ్రాహ్మణుడు మరణించేవాడు, ఆ నరమాంసాన్ని అన్నదమ్ములు తినేవారు.

అగస్త్యమహర్షి  ఆ అడవి మార్గంలో ఒక రోజు రావడం జరిగింది. ఎప్పటిలాగే ఇల్వలుడు అగస్త్య మహామునిని తన తండ్రి అబ్ధికంలో భోక్తగా రమ్మని పిలిచాడు. త్రికాలవేదైన ఆ మహామునికి వీరి దుర్మార్గం  తెలిసింది. ఎప్పటిలాగే వాతాపి మేకగా మారడం, ఇల్వలుడు ఆ మేకను కోసి కూరగా వండి అగస్త్యునికి వడ్డించడం, తిన్న తరువాత అగస్త్యుడు కడుపు మీద చేయి వేసుకొని నిమురుకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే, కడుపులో వాతాపి జీర్ణమైపోయాడు.

సంజీవని విద్య ప్రయోగించి ఇల్వలుడు ఓ వాతాపి బయటకు రా అన్నాడు. ఇంకెక్కడి వాతాపి.విషయం తెలుసుకొన్న ఇల్వలుడు కోపంతో తన భీకర రాక్షసరూపం పొంది అగస్త్యముని మీదకు మింగటానికి రాగా, ఆ మహాముని వాడిని కంటిచూపుతోనే భస్మం చేశాడు.

పై కథనుబట్టి ఆ రోజులలో మాంసాహారమనేది సర్వజనసమ్మతమని, ఎవరిలోనూ నిషిద్ధం కాదని తెలుస్తోంది.

వైదిక బ్రాహ్మణమతకాలాలలో యజ్ఞయాగాదులలో జంతుబలి తప్పనిసరి. జంతుబలి అనంతరం వాటిని రాజులు పురోహితులు వారి ఇతర పరివారం తినేవారు. ఇదే విషయాన్ని మహాకవి ఆరుద్రగారు వ్రాసిన సమగ్ర ఆంధ్రసాహిత్యం మొదటి భాగంలో ఎలా తెలియచేశారో చూద్దాం.

''బుుగ్వేద ఆర్యులు  గోమాంసాన్ని, గుర్రం మాంసాన్ని గోర్రెలను, మేకలను వాటితోపాటు తినేవారు.వాటిని ముందుగా యజ్ఞంలో దేవతలకు వాటిని సమర్పించి తరువాత  హాయిగా తినేవారు.

మహయజ్ఞాలలో ఏకకాలంలో 500 ఎద్దులు 500 గోవులు 500 దున్నలు 500 మేకలు 500 పొట్టేళ్ళను సేకరించి యూపస్తంభాలకు కట్టి వధించేవారు. రోజుకు అయిదునూర్ల లెక్కన జంతువులను వధించి తినేవారన్నమాట"

సాక్ష్యాత్తు విష్ణువాహనమైన గరుడుడు తన తల్లికి జరిగిన అన్యానికి ప్రతీకారంగా నాగులను చంపితినడం మనకు తెలుసు కదా !

యజ్ఞయాగాదులలోనూ, తన వంటశాలలోనూ రోజు కొన్ని వేల జంతువులు పక్షులు వధించబడటం చూచి మౌర్య అశోకుడు చలించిపోయాడు. అందుకే జీవహింస చేయరాదని, జంతువధ కూడదని అశోకుడు తన శాసనాలలో వ్రాయించి ప్రచారం చేశాడు.

మరి హిందూమతంలో మాంసాహారం నిషేధం ఎలా జరిగింది. దేవతలు, బ్రాహ్మణులు మొదలైనవారు  మాంసాహారులు కారని  శుద్ధ శాకాహారులని ఎందుకు ప్రచారంలోనికి వచ్చింది. ఇలా మార్పురావటానికి కారణమేమిటి ?

వైదికబ్రాహ్మణ మతాలలో విసృంఖల జంతుబలులను మూఢనమ్మకాలను వర్గవిబేధాలను నిరసిస్తూ పుట్టినవే జైనబౌద్ధమతాలు. 

నాటి సమాజంలో అసమానతలతో హెచ్చు తగ్గులతో బాధలుపడుతున్న  సామాన్య ప్రజలు జైనబౌద్ధాలపట్ల అకర్షితులైనారు. జైనం, బుద్ధమతం ప్రజలలో వెళ్ళునూకుపోయింది. 

జైనబౌద్ధాలలోని దేవతారాధనకు ఆడంబరాలు, ఆర్భాటాలు అవసరంలేదని, దొంగతనం చేయరాదు, అబద్ధాలు చెప్పరాదు, జీవహింస చేయరాదనే నైతిక సూత్రాలు ప్రజలను ఆలోచింపచేశాయి.

బౌద్ధజైనాల పట్ల సామాన్య ప్రజల  ఆదరణను చూచి వైదిక బ్రాహ్మణమతాలు ఆలోచనలో పడ్డాయి. వైదిక బ్రాహ్మణ మతస్తులు తమమతాన్ని  రక్షించుకోటానికి సంస్కరణల బాటను పట్టించారు. తమమతం కూడా జీవహింసకు వ్యతిరేకమేనని నైతికవిలువలతో కూడిన పూజావిధానాలు ఇక్కడ కూడా అనుసరణీయమని చెప్పారు.

అందుకే తదనంతర కాలంలో సనాతన ధర్మంలో జంతుబలులు మాంసాహారం నిషేధించబడ్డాయి. ఇలాంటి సంస్కరణలలో భాగంగానే

మూలభారతంలో మాంసాహారం తిన్న పాండవద్వితీయుడు భీమసేనుడు ఫక్తు శాకాహారాన్ని తిన్నట్లుగా  నన్నయ భారతాంధ్రీకరణలో

"పలుతెరంగుల పిండివంటలుబప్పుగూడును నేతికుం
డలుగుడంబులు దధి ప్రపూర్ణ ఘటంబులుం గొని వచ్చియిన్ "
అంటూ వ్రాసి భీముడు శాకాహారిగా మార్చి  పలురకాలైన పిండివంటలు, పప్పుకూడులు, నేతితో నింపిన బెల్లపుపూర్ణాలు పెరుగుమొదలైనవి తినిపించాడు.

జైనబౌద్ధమతాల ప్రేరణతో మార్పులు దిద్దుకొన్న సనాతన ధర్మంలో ఇంకా మాంసాహారం ఉండిపోవటానికి అనేక కారణాలున్నాయి. జైనబౌద్ధమతాల పతనం తరువాత వచ్చిన రాజులందరూ వర్ణసంరక్షణ చేపట్టారు.వర్ణ సంకరాన్ని నిషేధించారు.కొందరు యజ్ఞ యాగాదులు మరలా మొదలుపెట్టారు. అటవికులు, మారుమూల ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేదు.

ఈ సువిశాలదేశంలో ప్రజలందర జైనబౌద్ధమతాల పట్ల ఆకర్షితులు కాలేదు. వారందరూ మాంసాహరులే. ఇంకా విదేశీదండయాత్రల వలన ఈ సువిశాల హిందూదేశంలో స్థిరపడిన విదేశీయుల ప్రధానఆహారం మాంసమే. సమాజంలో సాంఘికజీవనంలో  ఒకరికొకరు మమేకమై సంస్కృతి సాంప్రదాయాలకు ఆహారపుటలవాట్లకు, ఇంకా అనేక మార్పుకులోనైనారు.

మాంసభక్షణ అనేది మనిషి పుట్టినప్పటి నుండేవుంది. పాతరాతి యుగానికంటే ముందుగా మానవుడు పచ్చి మాంసానినే భుజించాడు కదా !

*ఎవరైనా హిందూదేవతలు కూడా మాంసభక్షకులేనని విమర్శిస్తే,  ఇబ్బంది పడవద్దు, జంకవద్దు,అవును ఒకపుడు అది సాధ్యమైంది, ఇపుడు సంస్కరణలలో భాగంగా ఈ మార్పు అవసరమైందని గట్టిగా ధైర్యంగా బుద్ధిచెప్పండి.*

Friday, February 5, 2021

గ్రహాలు పరిహారాలురవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు.

గ్రహాలు పరిహారాలు

రవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన రాగి జావ,క్యారెట్,ధాన్యం, గోధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఎముకలకు అధిపతి రవి. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.

చంద్రుడు:-కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడధి దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముం దుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.

కుజుడు:-ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.

బుదుడు:-బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెసలు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు:- గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది. చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు:-శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని- వాత లక్షణం కలవాడు. చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది.

శనిగ్రహ దోష నివారణకు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంపిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు.

శనిగ్రహ దోష నివారణకు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.

ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.

పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.

ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః 
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||

🙏లక్ష్మీ పూజ (గడప పూజ).🙏ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం ,రెండు ఇంటి గడపకు పూజ చేయడం...

🙏లక్ష్మీ పూజ (గడప పూజ).🙏

ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం ,రెండు ఇంటి గడపకు పూజ చేయడం...

ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వార లక్ష్మి అని కూడా అంటారు.. ఈ గడపకు ,ఎర్రమన్ను,పసుపు ,కుంకుమ,పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ,ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయం గా ఆచరిస్తున్నారు... గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు.. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖసంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం..

🙏ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిస్కారం తెలుసుకుందాం..🙏

పెళ్లి కాని అమ్మాయిలు, ఎన్ని సంబంధాలు చూసిన కుదరక, జాతకం దగ్గర, కానుకల విషయంలో నే ఎదో ఒక ఆటంకం తో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు..16 రోజులు ఈ గడపకు పూజ చేయాలి..

పూజ విధానం:
1.ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి
2.మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి ,తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి, తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి,
3.గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి.
4.చిన్న పళ్లెం లో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవునైయి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి
5.ఇంకో పళ్లెం లో బెల్లం అటుకులు, తాంబూలం.. పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం..చదువుకుని హారతి ఇవ్వాలి... 
6. గడప దగ్గర పెట్టిన దీపం కి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి..
7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయిన పర్వాలేదు..
8. ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.

పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గం లకు పూజ చేసి, ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి... లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకు కు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయచ్చు..

ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్ట్ గొడవ ఇంటి పైన ఉన్నా.. ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తల ఇద్దరు కలసి కానీ, భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ, అష్టోత్తరం, మణిద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి .ఆ ఇంటి పైన ఉన్న సమస్య తీరిపోతుంది..
ఇదే విదంగా గడపకు పూజలు చేసి ఎన్ని సమస్యలు పరిష్కరించే వారు పూర్వీకులు..🙏🙏🙏

భగవంతుని దర్శనం కావాలంటే....?! 🍁🍁🍁🍁🍁భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ ,జపం, చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి????

భగవంతుని  దర్శనం  కావాలంటే....?! 

🍁🍁🍁🍁🍁

భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ ,జపం, చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి????
అని కొంతమంది అడుగుతూ ఉంటారు....

మరికొంతమంది దేవుడుంటే చూపించండి,దాని కోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం,చూపించగలరా అనికూడా ప్రశ్నిస్తుంటారు,


 ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం.


ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే
"దేవుడున్నాడా"అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు. 

దానికి రామకృష్ణ పరమహంస గారు "దేవుడు వున్నాడు" అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు,

దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో మీరు చూశారా ? అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు

అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో దేవుడిని చూశాను. చూస్తున్నాను. నిన్నెలా చూస్తున్నానో ఆయనను అలాగే చూస్తున్నాను. అన్నారు. 

దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏమిచేయాలి ? అని అడిగారు గురుదేవులను...

గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.

తర్వాత ప్రశాంతంగా వివేకానంద ను చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది,  అంటూ అడిగారు.

గురుదేవా మీరు నీటి తొట్టి లో నన్ను ముంచినప్పుడు "ఇంకొక్క క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయంవేసింది, ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది" అన్నారు వివేకానందులు. 

వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి, నీవు లేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది వివరించారు పరమగురువు.

అంత సాధన చేయాలి భగవద్దర్శనం కోసం కానీ మనమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా...

స్వామీ నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయంలో నాబుద్ధి అలా..అలా.. గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది,మరినువ్వు నాకు కనపడతావా, అంటే ఆయన నీకెలా కనపడతారు??

 నీకు భగవద్దర్శనం కావాలంటే ప్రతీ క్షణం ఆయన యందే నీ మనసు లగ్నం అయిఉండాలి
నువు బౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి .

అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతీ క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతిక్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది.

అందుకే వివేకానందులవారంటారొకచోట. ..

నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ..ఏవీ.. భగవంతుని దర్శింపజేయలేవు కేవలం ఆయన కరుణతప్ప అని 

కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ వుంటే .మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుండలేని ఆర్తి మనలో కలుగుతుంది.

 అప్పుడు లేగదూడ పిలుపువిన్న గోమాతలా పరుగుపరుగున ఆయనే వస్తాడు మనకేంటి తొందర ...


🌸జై శ్రీమన్నారాయణ🌸

🍁🍁🍁🍁...

ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి!? కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.

ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి!? కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.

ఒక ఊరి చివరిగా ఓ గురువుగారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.

మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి, దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన-ధర్మాలు చేసివుండరు.
 
అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.


నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు. అందులో మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండిఉండ వచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నువ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.

ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు‌. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.

ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.

ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా, సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

కాబట్టి ప్రియ ఆత్మీయులారా...    మీ ఒక చిన్న సహాయం,              మీ చేయూత ఎదుటి వారి జీవితాలలో దేదీప్యమానంగా వెలుగులను వెలిగించగలవు. అందుకే పెద్దలు అంటారు భగవంతుడు మనకిచ్చిన జీవితం... కలకానిదీ, విలువైనదీ! సర్వోత్తమమైనదీ! అలాంటి నీ జీవితాన్ని దుర్భరం చేసుకొంటూ మనం ఏడుస్తూ, ఇతరులను ఏడిపించక ప్రతిక్షణం మనం ఆనందంగా ఉంటూ, ఆ ఆనందాన్ని పదిమందికి అనేక రకాలుగా పంచుతూ, శారీరకంగా, మానసికంగా అందరికీ సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ...

పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితంజాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది. మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం, చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు. కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు.

పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితం

జాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది. మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం, చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు. కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు.

కూతురు సంతోషముగా, ఆరోగ్యముగా ఉంటే వాళ్ళ మనస్సు, ప్రవర్తన కూడా ఆహ్లాదముగా ఉంటాయి. ఒకవేళ కూతురుకు ఏమైనా బాగాలేక పోవడము, చికాకుగా ఉండడము జరిగితే ఆ రోజుకు జనం దుంప తెగిందే, ప్యూన్ దగ్గర నుండి కలెక్టర్ వరకూ అందరినీ తిట్టడమే. చాలా తొందరగా స్పందిస్తారు. ఎవ్వరినైనా, ఎందరినైనా దూరం చేసుకుంటారు. ఏదైనాభరిస్తారు, కానీ కూతురు కంట కన్నీరు మాత్రం భరించలేరు. అతలాకుతలం అయిపోతారు.

తండ్రిని, తల్లిని కాదని కూతురు ప్రేమ వివాహము చేసుకున్నావీరు సహించి ఊరుకుంటారు. శుక్ర గ్రహము జాతకములో అనుకూలముగా ఉంటే ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. వీళ్ళ అతి ప్రేమ వల్ల కూతురుకి పెళ్ళి చేసిన తరువాత వాళ్ళ కాపురములో ఏమైనా విభేథాలు వస్తే అల్లుడిని, కూతురుని కూర్చోబెట్టి సంసారం బాగు చేసే యత్నాలు చేయరు. కూతురుని ఇంటికి తెచ్చుకుంటారు. అల్లుడిని, అతని కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తారు. భార్యాభర్తలమథ్య విరోథము సమసి పోతుందని వీళ్ళు భావించరు. అల్లుడు కూతురుని తిట్టినా, కొట్టినా, కష్ట పెట్టినా అల్లుడి చరిత్ర వాస్తవాలు తెలుసుకోలేరు. తెలుసుకొనే ప్రయత్నాలు చేయరు. భార్యమాట బంథువుల మాట గడ్డిపోచ క్రింద తీసిపారేస్తారు.

భారత శిక్షాస్మృతిలో ఉన్నచట్టాలను ఉపయోగించి అల్లుడు, అతని కుటుంబ సభ్యులను వేథిస్తున్నారని కేసులు పెట్టి, లంచాలు ఇచ్చి వాళ్ళను ప్రాథమికముగా జైలులో పెట్టిస్తారు. రాజీచేయడానికి వచ్చిన పెద్దమనుషులకు గౌరవము తగ్గదు. చివరకు అల్లుడే ఇంటికి వచ్చి ప్రాథేయపడినా వీళ్ళు స్పందించరు. అల్లుడిని చెప్పుతో కొట్టడము, వీళ్ళ విషయములో సాథారణ అంశము. కూతురు సంసారాన్ని వీళ్ళ చేతులతో వీళ్ళే చెడగొడతారు. అమితమైన ప్రేమ వలన వాస్తవాలు, సామాజిక విషయాలు మరచిపోతారు.

మథ్యప్రదేశ్ లోని ఓ గౌరవనీయమైన కుటుంబ యాజమాని జిల్లా సెషన్స్ జడ్జి. ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేశాడు. అబ్బాయి కూడా మంచి ఉద్యోగములో స్థిర పడినవాడే. పెళ్ళి అయింది. అమ్మాయి అత్త వారింటికి వచ్చింది. ఓ రోజు అత్తగారు కోడల్ని వంట చేయమని చెప్పింది. నేనిక్కడకు వచ్చింది వంటల్ని చేయడానికి కాదు. నువ్వు చేసుకో ఆ వంటల పని అని సమాథానము చెప్పింది కోడలు. అత్తగారు ఏమనుకుందో ఏమో వంటతనే చేసింది.
వాళ్ళ అబ్బాయి రాగానే కోడలు మాట్లాడిన విషయాలు చెప్పింది. ఎందుకిలా చేశావని భార్యను అడిగాడు. పెద్దలను గౌరవించడం, ఇంటి పని చేసుకోవడము తప్పేంటని నిలదీశాడు. ఏదో ఇబ్బంది వచ్చి ఒక్కరోజు వంట చేయమంటే ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించాడు. అంతే ఆ అమ్మా యి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. అప్పటికప్పుడే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉన్నవీ, లేనివీ చెప్పింది. దాంతో అమ్మాయి తండ్రి రెచ్చిపోయాడు. అమ్మా నిన్ను ఇన్ని భాథలు పెట్టిన వాళ్ళను ఊరికే వదలను. వాళ్ళ అంతు తేలుస్తాను అని శపథంచేసి ఇంకేముంది అమ్మాయిని కట్నం కోసం వేథిస్తున్నారనీ, ఇందులో కుటుంబసభ్యులందరూ భాగస్వాములేనని కేసు పెట్టాడు. ఇంకేముంది.

శక్తివంతమైన చట్టం తనపని తాను చేసుకుపోసాగింది. గౌరవ ప్రదమైన కుటుంబం జైలు పాలైంది. అందరికీ న్యాయము చెప్పే మహానుభావుడు మంచివాడైన జడ్జీగారు కూడా రిమాండుకు తరలించబడ్డారు. ఈసంఘటనతో సంబంథములేని ఎక్కడో కాపురం చేసుకుంటున్న జడ్జీగారి కూతుళ్ళు కూడా జైలుకు తరలింపబడ్డారు. వాళ్ళ మంచితనము తెలిసిన వాళ్ళంతా కాల మహిమను చూచి నిర్ఘాంతపోయి ముక్కుమీద వేలేసుకున్నారు.

శుక్రుడు జాతకములో బాగా లేకపోతే భార్యవల్ల,స్త్రీల వల్ల అష్టకష్టాలు ఎదురవుతాయి.“ పూర్వజన్మకృతం పాపం కళత్ర రూపేణ భాథితం.” అనే సామెత నిజ జీవితములో అక్షరాలా వర్తిస్తుంది.

నవవిధ భక్తి మార్గం అంటే.. ? "భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు.

#నవవిధ భక్తి మార్గం అంటే.. ? 
"భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం  విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు. 

* మొదటిది శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి. 
* రెండోది కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి.
* మూడోది స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి.
* నాలుగోది  పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి.
* అయిదవది అర్చనం అంటే పూజించడం. 
* ఆరోది వందనమంటే నమస్కారం.
* ఏడోది దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి.
* ఎనిమిదవది సఖ్యం చేయడం స్నేహం చేయడం.
* తొమ్మిదవది ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయన కోసమే అని తెలుసుకుని భగవంతునికి సమర్పించాలి.

ఏ విద్యకైనా పరమప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికే ఒకటి తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి. 

ఆంజనేయుడు "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్య భక్తినే ప్రదర్శిస్తాడు.

భగవంతునికి సమర్పించవలసినది*...మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు

*భగవంతునికి సమర్పించవలసినది*...


మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు.

 భగవంతునికి మనం పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో , సమర్పించడమన్నది మనం భగవంతుని యందు చూపించే 
కృతజ్ఞత మాత్రమే.  

 మనకు ఈ దేహాన్నిచ్చి,  సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికే, నిజానికి ఆయనకు కావలసిన దేమీ లేదు.  

 ఆయన సర్వ సంపూర్ణుడు. అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా చెప్పింది.           

" పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః "

నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమును గానీ  నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను.

 పై శ్లోకంలోని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం

💐 1.  పత్రం :  "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం. మనిషిని పడవేసేది  మనస్సు. కాబట్టి పత్రాన్ని సమర్పించాలీ అంటే మనమనస్సును
దైవాంకితం చేయాలని దాని అంతరార్థం.

💐 2.  పుష్పం:  "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి   కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని 
అంతరార్థం.

💐 3.  ఫలం  :  "విశీర్యతే ప్రహారైరితి ఫలం" ప్రహారైః   అనగా దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలము.   జ్ఞాన బోధము అనే దెబ్బలచే  పగిలేది మనస్సులోని అహంకారం. కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలని అంతరార్థం.

💐 4.  తోయం:  "తాయతే_పాయతీతి". అనగా రక్షించునది కనుక తోయము. సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంచుకొని , రక్షించేది  చిత్తము. కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం.  అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలని భావము.

మనస్సు మన పతనానికి మూలకారణము. అందుకే దాన్ని మనం ముందుగా భగవంతు నికి సమర్పించాలి. 


 శంకరులు తమ శివానందలహరి లో  "భవతు భవదర్థం మమ మనః " ..అంటారు..

అనగా ఈశ్వరా ! నా మనస్సు నీ స్వాధీనం అగు గాక " అని కోరుకున్నారు...............

🙏🙏

*శుభోదయం* మనం ఉన్నత లక్షణాలు కలిగిఉంటే సరిపోదు; వాటినినిలబెట్టుకోవడానికి తగినసామర్ధ్యం కూడా కలిగి ఉండాలి బంధాల తోటలో వేపచెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది.తియ్యగా పండే చెట్ల మధ్యచేదుగా కనిపించి నిరాదరణ పొందినా నిజానికి అవసరమైనప్పుడుదివ్యౌషధంగా పనిచేసేది అదే!

*శుభోదయం* 
    
మనం ఉన్నత లక్షణాలు కలిగి
ఉంటే సరిపోదు; వాటిని
నిలబెట్టుకోవడానికి తగిన
సామర్ధ్యం కూడా కలిగి ఉండాలి
               
బంధాల తోటలో వేపచెట్టు లాంటి 
బంధం కూడా ఉంటుంది.
తియ్యగా పండే చెట్ల మధ్య
చేదుగా కనిపించి నిరాదరణ పొందినా నిజానికి అవసరమైనప్పుడు
దివ్యౌషధంగా పనిచేసేది అదే!

*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_

_*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_

_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._

_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._

_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._

_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._

_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._

_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._

_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._

_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._

_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషం 

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు, ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభం 

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషులతో ఉత్తరప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునం 

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నెలకొన్న సబ్దత తొలగుతుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకం 

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగి లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహం 

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, అనుకోని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు అందుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య 

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులా 

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సోదరుల నుంచి సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికం 

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం సంఘంలో మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలలో అవాంతరాలు తొలగి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గౌరవం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు 

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ప్రారంభంలో స్వల్ప చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, భాగస్వాములు సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరం 

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభం 

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, బాధ్యతలు కొంత తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. ప్రజాదరణ పెరుగుతుంది. వారం మధ్యలో మానసిక చికాకులు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనం 

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సా«ధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

రామ భజన మహిమ🙏🌹♦️ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారు, గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు జరిగింది అని భయపడుతున్న వాళ్ళు, జిన్స్, గాలి,పిశాచ బాధలు ఉన్నాయి అని భయపడుతూ, ఏ పూజలు చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని మానసికంగా కృంగిపోతూ చాలా కుటుంబాలు మనో వేదన అనుభవిస్తున్నారు..అవి నిజంగా ఉన్నాయా లేక అపోహ అనేది పక్కన పెడితే అటువంటి ఆలోచనతో చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు

🌹🙏రామ భజన మహిమ🙏🌹

♦️ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారు, గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు జరిగింది అని భయపడుతున్న వాళ్ళు, జిన్స్, గాలి,పిశాచ బాధలు ఉన్నాయి అని భయపడుతూ, ఏ పూజలు చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని మానసికంగా కృంగిపోతూ చాలా కుటుంబాలు మనో వేదన అనుభవిస్తున్నారు..అవి నిజంగా ఉన్నాయా లేక అపోహ అనేది పక్కన పెడితే అటువంటి ఆలోచనతో చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు

♥️ఏ రోజు ఏమీ చేయమని tv లో భక్తి ప్రసారంలో చెప్తే అవి చేస్తున్నారు, ఏ స్వామి జి ఏది చెప్తే అది చేస్తున్నారు, మీలాంటి అమాయకుల వల్ల దొంగబాబాలు, తాయత్తులు అమ్మే వాళ్ళు, యంత్రాలు అమ్ముకునే వాళ్ళు చాలా మందే హాయిగా బతుకు తున్నారు కానీ మీ సమస్య మటుకు తీరడం లేదు..

♦️ఇంట్లో రామ భజన నిరంతరంగా అంటే ప్రతి రోజు రామ భజన ఇంట్లో చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పిలుచుకోండి, సంజీవిని తెస్తున్న హనుమంతుడు ఫోటో కానీ, రామ లక్ష్మణులను భుజాన మోస్తున్న హనుమంతుడి ఫోటో కానీ పెట్టుకోండి.. అలాగే సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి ఇది ప్రతి ఇంటా ఉండవలసిన ఫోటో, అంత పానకం. వడపప్పు నైవేద్యం పెట్టండి మంగళవారం గారెలు నైవేద్యం పెట్టండి... భక్తి పారవశ్యంతో  రామ భజన చేసి చివరిలో హనుమాన్ చాలీసా చదివి హారతి ఇవ్వండి... ఏ పిశాచాలు మీ ఇంట్లో ఉంటాయి చూద్దాము, గ్రహాలు అన్నీ హనుమకు అధీనం లో ఉంటుంది.. ఎందుకంటే ఆయన భక్తికి మరో రూపమ్ రుద్ర స్వరూపం.. శనిదోషాలు, రాహుగ్రహ దోషాలను పోగొట్టే సులభమైన మార్గం హనుమంతుడి గుడి ప్రదర్శన...ఆరాధన..

🔥ఇంట్లో గొడవలు తగ్గుతుంది, మన శాంతిగా ఉంటారు, దుష్ట గ్రహాలు అనగా మీకు చేడుచేసే వారు కూడా మీ ఇంట్లోకి రాలేరు ఇంటికి ఉన్న కనుదిష్టి పోతుంది..ఇంటి వాతావరణంలో లో మంచి మార్పు మీకే తెలుస్తుంది.. సంతోషంగా ఉంటారు.. రామ భజన గురించి మీకు ఇంతకన్నా నేను చెప్పాలా.."ఓ రామ నీ నామం ఎంతో రుచిరా" అంటూ అలవాటు పడితే అందులోని ఆనందం అనంతం , ఎంతో మందికి సుందరకాండ పారాయణం, శ్రవణం ఎంతో మేలు చేసింది..అలా పారాయణం చేయలేక పోయిన రామ భజన, ఇంట్లో పెట్టండి సంతోషంగా ఉండండి మీ వల్ల మీ పిల్లలు చిన్న తనం నుండి భక్తిని అలవాటు చేసుకుంటారు పాప బీతి ఉంటే తప్పులు చేయరు అపద్దం చెప్పరు.

🌹శివుడి స్మరించే తారక మంత్రం రామ నామం ఈ మంత్రం నిరంతరం జపించండి.

🕉️" *శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే* |
*సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే*|"🕉️

 ♥️రామ భజన♥️

రామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥

లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ 
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥

♦️మనోజవం మారుతతుల్య వేగమ్ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ॥

(ఎన్నో లక్షల రాక్షస సంహారం చేసిన రాముడు సదా మంచిని రక్షించు గాక, శ్రీ రామ నీకు జయము నీ నామము మాకు శుభము).

🌹🙏 జై శ్రీరాం🙏🌹

*🌺ఆశీర్వచనం ఎందుకు చేస్తారు🌺*

🌺🍁🌺🍁🌺🍁🌺
🍁🌺🍁🌺🍁🌺🍁



*🌺ఆశీర్వచనం ఎందుకు చేస్తారు🌺*



ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం.....


పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 

విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, 
పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు" అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ? 

తప్పకుండా ఫలిస్తాయి...

సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.

గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి...

అక్షింతల సంకేతం.....

సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. 

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం ? 

అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ? 

మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి ? 

బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 

బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 

మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.

మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.

బియ్యంలో తగినంత పసుపు,   నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.....🙏🏻

వేంకటాద్రి సమం స్థానంబ్రహ్మాండే నాస్తి కించనవేంకటేశ సమో దేవోన భూతో న భవిష్యతి.!!

వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో
న భూతో న భవిష్యతి.!!

🌺 సింహాద అనే దైత్యుడు మహాదుష్టుడు, బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెరా కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదిస్తాడు. దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దేవతల మోర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేడమని సలహా ఇస్తాడు.

🌺 తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ సింహాద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమణి తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. దేవతలతో పోరాటానికి సింహాద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది.

🌺 తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు తల తెన్చినా మరల బ్రతికి వచ్చేవాడు. ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు. స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు.

🌺 అలా సంహరించిన ఆయుధాలు మరల స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో

🌺 ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు. స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు, అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి, స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు.

🌺 వింత కోరిక. స్వామి వారు సరే అని చెప్పి, కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింపచేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు.

🌺 స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంలో వసించడం మొదలుపెడతాయి.

🌺 కపిలతీర్ధమే చక్రతీర్ధం. దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి. ఆ తీర్దాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వేంకటాచలం వస్తారు.

🌺 తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు.

🌺 కొండలలో నెలకొన్న ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు.

🌺 భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చిన వారు సింహాదను చంపెవారే ఎందుకంటె..చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కానీ వారు కాదు కాబట్టి. వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చును కానీ పిలిపించి, అడక్కుండా అనుగ్రహించి, అతనికి కీర్తిని ఇవ్వడానికే, చేసిన భక్తి శ్రద్ధలకు, కైన్కర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామి వారు ఈ లీల చేసారు.

🌺 మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు…మనం చూపించవలిసనిదల్లా ఆయన మీద భక్తిశ్రద్ధలు.

పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం తెలుసుకుందాం 🙏

పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం తెలుసుకుందాం 🙏

రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సద్దలు, రావులు, తైదులు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.

పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో
తెలియడం లేదు.వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.

అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని, పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము.

*శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం*.ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు....

*శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం*.

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు....

శ్రీకృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.

ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.

ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.

అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.

ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.

దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.

“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.

కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.

ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.

కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.

కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.

అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు.ఆడంబరాలకు ప్రాధాన్యత నిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.

ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.

మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.

ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.

ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.

కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.

ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.

కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.

కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.

కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు ? వెళ్ళిపో’

కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి.శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా.

*దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?*🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.

అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.

ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.

విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.

ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.

*ఓం నమో నారాయణాయ🙏*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*పురాణ సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*------------------------------------------------

*పురాణ సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
49 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/puranamulu-pdf

               (OR)

గరుడ పురాణం www.freegurukul.org/g/Puranamulu-1

దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-2

విష్ణు పురాణం www.freegurukul.org/g/Puranamulu-3

సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-4

శివ పురాణము www.freegurukul.org/g/Puranamulu-5

భవిష్య మహా పురాణము www.freegurukul.org/g/Puranamulu-6

దేవీ భాగవతం www.freegurukul.org/g/Puranamulu-7

సంపూర్ణ కార్తీక మహాపురాణం www.freegurukul.org/g/Puranamulu-8

శివ పురాణం www.freegurukul.org/g/Puranamulu-9

పురాణ పరిచయము www.freegurukul.org/g/Puranamulu-10

బ్రహ్మ పురాణము-1,2,3 www.freegurukul.org/g/Puranamulu-11

మార్కండేయ పురాణం www.freegurukul.org/g/Puranamulu-12

శ్రీ దత్త పురాణం www.freegurukul.org/g/Puranamulu-13

హరి వంశ పురాణం www.freegurukul.org/g/Puranamulu-14

లక్ష్మీ నరసింహ పురాణం www.freegurukul.org/g/Puranamulu-15

సంపూర్ణ దేవీ భాగవతము www.freegurukul.org/g/Puranamulu-16

కల్కి పురాణము-1,2 www.freegurukul.org/g/Puranamulu-17

బసవ పురాణం www.freegurukul.org/g/Puranamulu-18

అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Puranamulu-19

శివ పురాణము - ధర్మ సంహిత www.freegurukul.org/g/Puranamulu-20

కన్యకా పురాణం www.freegurukul.org/g/Puranamulu-21

శివ రహస్య ఖండము-1,2 www.freegurukul.org/g/Puranamulu-22

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/g/Puranamulu-23

భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు www.freegurukul.org/g/Puranamulu-24

మార్కండేయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-25

శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము www.freegurukul.org/g/Puranamulu-26

సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము www.freegurukul.org/g/Puranamulu-27

ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/g/Puranamulu-28

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/g/Puranamulu-29

స్కాందపురాణ సారామృతము www.freegurukul.org/g/Puranamulu-30

దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-31

అగ్ని పురాణం www.freegurukul.org/g/Puranamulu-32

మత్స్య మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-33

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/g/Puranamulu-34

వైశాఖ పురాణము www.freegurukul.org/g/Puranamulu-35

పురాణ వాంగ్మయం www.freegurukul.org/g/Puranamulu-36

విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1 www.freegurukul.org/g/Puranamulu-37

స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం www.freegurukul.org/g/Puranamulu-38

నారదీయ పురాణము www.freegurukul.org/g/Puranamulu-39

పద్మ పురాణము-భూమి ఖండము www.freegurukul.org/g/Puranamulu-40

మత్స్య మహా పురాణము-1 www.freegurukul.org/g/Puranamulu-41

స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం www.freegurukul.org/g/Puranamulu-42

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము www.freegurukul.org/g/Puranamulu-43

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము www.freegurukul.org/g/Puranamulu-44

సూత పురాణము www.freegurukul.org/g/Puranamulu-45

కైశిక మహత్యము www.freegurukul.org/g/Puranamulu-46

శివ తాండవము www.freegurukul.org/g/Puranamulu-47

దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం www.freegurukul.org/g/Puranamulu-48

ప్రధమాంధ్ర మహాపురాణము www.freegurukul.org/g/Puranamulu-49

సాధనకు సోపానాలు🍁🍁🍁🍁భగవంతుని పట్ల భక్తుడు చూపే నిస్వార్థమైన ప్రేమే భక్తి.ప్రేమ నిండిన హృదయంతో భగవంతుని కృపకు అర్హత సాదించగలుగుతాం.ఆధ్యాత్మిక జగతిలో వేసే ప్రతి అడుగు భగవంతుని వైపే కావడంతో ఆ సర్వాంతర్యామిని సులభంగా చేరుకునే మార్గాలు కూడా భక్తులకు,సాధకులకు భాగవతంలో నిర్దేశింపబడ్డాయి.గమ్యం ఒక్కటే:-

సాధనకు సోపానాలు

🍁🍁🍁🍁

భగవంతుని పట్ల భక్తుడు చూపే నిస్వార్థమైన ప్రేమే భక్తి.ప్రేమ నిండిన హృదయంతో భగవంతుని కృపకు అర్హత సాదించగలుగుతాం.ఆధ్యాత్మిక జగతిలో వేసే ప్రతి అడుగు భగవంతుని వైపే కావడంతో ఆ సర్వాంతర్యామిని సులభంగా చేరుకునే మార్గాలు కూడా భక్తులకు,సాధకులకు భాగవతంలో నిర్దేశింపబడ్డాయి.
గమ్యం ఒక్కటే:-

మార్గాలు వేరైనా అందరూ చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే.ఎవరి అభిరుచి మరియు ఇష్టతతో స్వీకరించిన మార్గంలో వారు ఉమ్మడి మరియు పరమ పవిత్రమైన పరమాత్ముని చేరుకొనే గమ్యం వైపుకు సాధనతో సోపానాలు ఏర్పరుచుకోవడం విశిష్టమైనది మరియు అనుసరణీయమైనది.
నవవిధాలుగా మార్గాలు:-
తొమ్మిది మార్గాలు భగవంతుని చేర్చే పెన్నిధులు గా మారాయి.ఈ మార్గాలు చేర్చే గమ్యం మాత్రం ఎప్పటికీ మార్పులేని పరమాత్మ సన్నిధి.అందుకు తగ్గ సాధన సుకృతంతో కూడిన దివ్యత్వ అనుభూతులను నిరంతరం అందిస్తుంది.

శ్రవణం:-

దైవం యొక్క లీలలు మరియు మహిమలు వినేందుకు ఎంతో ఉత్సాహం చూపడంతో పాటు తన శ్రవణ ఇంద్రియాలు(చెవులు)ద్వారా దివ్యత్వ విభూతులను వినడం గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తారు.భగవంతుని  అమృతతుల్యమైన వాక్కును శ్రవణం ద్వారా తెలుసుకుని ఆచరించి సద్గతిని పొందిన భక్తులు ఎందరో ఉన్నారు.దైవం ఇచ్చిన అవయవాలు దైవం కోసం తపించడం అంటే మనిషి మనీషిగా మార్పు చెందే దిశకు శ్రీకారం చుడుతున్నట్లు అర్ధం.

కీర్తనం:-

భగవంతుని గుణ గుణాలను కీర్తించడం మరో మార్గం.శ్రవణం ద్వారా విన్నది అనుభూతిలోనికి తెచ్చుకుని ఆ వైభవాన్ని మరికొందరు భక్తులకు చెప్పడం ద్వారా భక్తి వ్యాప్తికి దోహదం చేస్తూ జిహ్వ (నాలుక) ద్వారా వాక్కును కీర్తించడం మరో మార్గం.

స్మరణం:-

విన్నది,అన్నది నిరంతరం స్మరించడం ద్వారా మనస్సు పవిత్రమై మంచికి వేదికగా మారుతుంది.పదే పదే చింతన ద్వారా దైవాన్ని స్మరించడం సాధనలో మరో సోపానం.

పాదసేవనం:-

పరమాత్ముని పాదాలను సేవించడం ద్వారా భక్తుడు తన లో ఉన్న అహంకార,మమకారాలను త్యజించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు.పాదాలను సేవించడం పరమాత్మునికి అత్యంత దగ్గరగా జరగడం.

అర్చనం:-

నిర్మలమైన చిత్తంతో తనకు అనుకూలమైన ద్రవ్యాలతో దైవాన్ని అర్చించడం మరో మార్గం.అర్చన ద్వారా అనుభూతిని పటిష్టపరుచు కోగలుగుతాం.

వందనం:-

మనస్సు,ఇంద్రియాలు,బుద్ధిని ఏకం చేస్తూ దైవానికి సమర్పణ భావంతో చేసే నమస్కారమే వందనం.అంతా పరమాత్మే నేను అన్నది లేదు అని గుర్తెరిగేలా చేసే సంస్కార క్రియ వందనం.

దాస్యం:-

అధికుడిని అన్న భావం సాధకునికి ఏ కోశాన మనస్సులో వచ్చినా చేసిందంతా చేజారినట్టే.దాస్య బుద్ధితో భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండగలగడం కూడా భగవంతుని చేర్చే మార్గమే.

సఖ్యం:-

దైవంను స్నేహితునిగా భావించి తన కష్టాలు, సుఖాలులో భాగం పంచడం సఖ్యంగా చెప్పుకోవచ్చు.స్నేహితుని ముందు భేషజాలుకు ఏ విధంగా తావు లేదో ఈ చెలికాడి ముందు ఏదీ దాపరికం లేకుండా చెప్పుకోవడం మరో మార్గంగా సూచించబడింది.

ఆత్మనివేదనం:-

తొమ్మిదవ మార్గం ఆత్మ నివేదనం. ఆత్మయే పరమాత్మ చైతన్యమని గుర్తెరిగి సర్వస్య శరణాగతిని పొంది సంపూర్ణ సమర్పణ భావంకు ప్రతీకగా ఆత్మను నివేదనగా అర్పించడం మరో మార్గం.

ఈ రకంగా తొమ్మిది మార్గాలులో ఏదో ఒకటి సాధనకు సోపానంగా మార్చుకోగలిగితే దైవం యొక్క ఉనికిని నిరంతరాయంగా అందుకోగలం.మార్గం మరియు ప్రయాణ సాధనంలో మార్పు ఉండచ్చు గాని నిర్దేశిత గమ్యం మాత్రం ఒక్కటే.మంచిని మాట్లాడి,మంచిని విని,మంచిని కోరుతూ,మంచికోసం నిరంతరం తపిస్తూ మంచిని ఆచరిస్తూ మంచిగా జీవించడం లోనే కలియుగంలో నవవిధ భక్తిమార్గాలు ఉన్నట్లు భావనచేయవచ్చు.భగవంతుని వాక్కును అనుసరించడమే భక్తి మార్గాలకు ఇంధనాన్ని అందించడం.తొమ్మిది మార్గాలు  ఆధ్యాత్మిక సాధనా సోపానాలు. ఆచరిద్దాం ఆనందానికి చిరునామాగా మనల్ని మనం మార్చుకుందాం.... 🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸

తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ?

తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?

అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..

ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు  
॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ 
అని ఎందుకు చదువుతావు ? 

నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?

మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.

మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని  మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో  లేదా అలవాట్లులో  చొప్పించారు. 
మీ మామ్మ చూడు..
బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.
అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది
నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం  తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.
ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.

ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..
మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 

నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.

అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.

మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం.  ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.
అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.

అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట.

Monday, February 1, 2021

*గురు శిష్యుల సంబంధం*గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం అత్యంత ఉత్కృష్టమైంది. జ్ఞానవ్యాప్తికి సంబంధించినంత వరకు దానికే ప్రధాన పాత్ర.

*గురు శిష్యుల సంబంధం*

గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం అత్యంత ఉత్కృష్టమైంది. జ్ఞానవ్యాప్తికి సంబంధించినంత వరకు దానికే ప్రధాన పాత్ర.

*ఓం సహనావవతు సహనౌ భునక్తు* 
*సహవీర్యం కరవావహై తేజస్వి* 
*నావధీత మస్తు మావిద్విషావహై* 
*ఓం శాంతి శాంతి శాంతిః.*

"బ్రహ్మ మన ఇరువురినీ రక్షించుగాక, మన ఇరువురను పోషించుగాక, ఇరువురం శక్తిమంతులు అవుదుము గాక, మన ఇరువురికి తేజస్సు కలుగుగాక, పరస్పర ద్వేషం లేకుండా ఉండెదం గాక" అని గురువు శాంతి ప్రార్థన చేస్తాడు. శిష్యుడి చేత చేయిస్తాడు.

ఇక్కడ ఇరువురి మధ్య సమభావం, సమరసభావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్నాయి. గురువులో నేర్పుతున్నాననే ఆధిక్యభావం, శిష్యుడిలో నేర్చుకుంటున్నాననే కృతజ్ఞతా భావం ఉంటే సరిపోదు. 

గురుశిష్యుల మధ్య అనుబంధం, అనుసంధానం లేనట్లయితే ఒకరి మనోభావన, అవతలి వారి హృదయాన్ని స్పృశించదు. పాఠం చెప్పటమంటే దాని అర్థాన్ని, తత్పర్యాన్ని చెప్పటం కాదు. తత్వాన్ని బోధించటం. అదీ భావ ప్రధానంగా. 

శిష్యుడి సమస్థాయికి దిగివచ్చి అతనిలో మేథానుసంధానం జరిపి, ఆత్మ వికసన ధ్యేయంగా జ్ఞానం అందించాలి. అప్పుడే ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లు జ్యోతిర్మయం చేస్తుంది. 

గురువు శిష్యుడికి జ్ఞానఫలాన్ని అందిస్తే దాన్ని ప్రసాదంగా ప్రపంచానికి వితరణ చేస్తాడు శిష్యుడు.

*శుభంభూయాత్*

భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు కొన్ని *_ _సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం *"కుటుంబం"*._

*భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు
 కొన్ని *_      

_సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం *"కుటుంబం"*._

_నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు._

_తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే._

_అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు._

_అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే._

_ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం._

_భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం._

_సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం._

_ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు._

_భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం._

_ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క !_

_అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు._

_మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది *"మాంగల్య బంధం"..*_

_బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి._

_మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది._

_కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది._

_నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే._
_నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే._

_ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది._

_సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"._

_గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం._

_కలిమి లేములతో.. కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!_

_బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే._

_ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు._

_భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు._

_మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు._

_అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే._

_పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం._

_*చిరునవ్వులతో కూడిన దంపతులారా అందుకోండి నా శుభాకాంక్షలు..*_ 

🙏

*నేను ఎవరు..?*


*నేను ఎవరు..?*
.*******
అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వే
గంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాం._*

కానీ ఎలా ? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది ? ఏ భాగము వినదు. వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి

ఈ దేహం నీదే కదా !ఎందుకు మొరాయిస్తుంది ? ఈ దేహం నీదేకదా ! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు ? ఈదేహం నీదేకదా ! ఎందుకు నీమాట వినడంలేదు ?ఈదేహం నీదేకదా ! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్ ?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆపరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి. రూపానికి ముందు నువ్వున్నావు. రూపంలో నువ్వున్నావ్. రూపం వదిలేశాకా నువ్వుంటావు !

ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు...

మనసెరిగిన మాధవుడు.. గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.


మనసెరిగిన మాధవుడు.. 

         గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. 
              ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో  తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
              నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. 
             మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.

                 ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి?  దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. 

                  అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.
                   ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి  ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. 

                తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.

               కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 

                     తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి  విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.

                      భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.

                     ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.
                     ఓం మాధవాయ నమః

జపించే ప్రతి మంత్రానికీ గురూపదేశం తీసుకోవాలి. ఉపదేశం పొందకుండా ఏ మంత్రమైనా ఫలమివ్వదని శాస్త్రం చెబుతుంది

 ఆవశ్యకత*

జపించే ప్రతి మంత్రానికీ గురూపదేశం తీసుకోవాలి. ఉపదేశం పొందకుండా ఏ మంత్రమైనా ఫలమివ్వదని శాస్త్రం చెబుతుంది.

అసలు మంత్ర సిద్ధి పొందిన ఒక గురువు నుంచి ఉపదేశం తీసుకున్న ఒక్క మంత్రం చాలు జీవితం సఫలం కావడానికి. 

మంత్రాలు ఎక్కువయ్యే కొద్దీ మతి చలిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. మనస్సు పరిపరి విధాలపోతుంది. అనేక మంత్రాలు జపించడం వలన క్రమంగా డిప్రెషన్ కు గురి అయి అనారోగ్యం పాలుకూడా కావచ్చు.

ఒక దేవుణ్ణి, ఒక మంత్రాన్ని నమ్ముకొని నిత్యమూ ఏకాగ్రతతో ధ్యానించి పూజిస్తే చాలు. ధర్మాచరణలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎక్కువ కోరికలతో, ఎక్కువ మంత్రాలు చదివేసుకుంటూ కనబడిన దేవుళ్ళకల్లా మొక్కుతూ మానవ జీవిత ధ్యేయాన్ని  విస్మరించకూడదు.

సత్కర్మాచరణ, సంతృప్తి మానవుడికి శాశ్వతానందాన్నిస్తాయి.

*శుభంభూయాత్*

ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు

**************
ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు

👉అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్క డే పలుకుతాడు అనుకోడం పొరపాటు. * శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.* అదెలాగో చద్దాం.

1️⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే

2️⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*

3️⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*

4️⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా  అనే జీవ అక్షరం తీసుకున్నారు)

5️⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)

6️⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహమచర్యాని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.

*రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ*

ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు.

అలాంటి నామ పారాయణం చేయడం మరువ కండి.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*🌸దేహాలయం*🌸

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
*🌸దేహాలయం*🌸

మనిషి ఎల్లప్పుడూ మూడు ‘ద’ కారాలను దృష్టిలో పెట్టుకుని జీవించాలంటారు ప్రవచనకర్తలు.  మొదటి ‘ద’ దేహభక్తిని సూచిస్తుంది. రెండో ‘ద’ దైవభక్తికి సంకేతం. మూడో ‘ద’ దేశభక్తికి ప్రతీక. ఈ మూడింటి లోనూ మొదటిది దేహభక్తి. అంటే శరీరారోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం. ఏ ధర్మకార్యం నిర్వర్తించాలన్నా మొదట శరీరం స్వస్థతగా ఉండాలి కదా! ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసూ ఉంటుంది. జపానికైనా, తపానికైనా, ప్రాణాయామం, యోగ, వ్యాయామం, వ్రతం, ఉద్యోగం... ఏది చేయాలన్నా ముందు దేహం చురుగ్గా పరిశుద్ధంగా ఉండాలి.
అతి నిద్ర, అతి ఆహారం, అతిగా మాట్లాడటం, అవసరాన్ని మించి సంచరించడం... ఇవన్నీ శరీరారోగ్యానికి హాని చేకూర్చేవే! మనసుకే కాదు, దేహానికీ క్రమశిక్షణ అవసరం. స్వచ్ఛమైన, విశుద్ధమైన దేహం మాత్రమే దైవానికి మందిర మవుతుంది. కలుషిత శరీరంలో పరమాత్మ క్షణమైనా నిలవడు. ఆరోగ్యవంతమైన శరీరం కలవాడి మనసులోనే, మెదడులోనే పరమాత్మ నిశ్చలంగా ఉంటాడు. ఈ శరీరమే ‘నేను’ అనే వ్యామోహం దరికి రానంతవరకు- దేహం పట్ల మనిషి మంచి ఎరుక కలిగి ఉంటాడు.
శరీరంలోని ప్రతి అవయవమూ తన ధర్మాన్ని పవిత్రంగా నిర్వర్తించినంత కాలం మనిషి చిత్తం, మస్తిష్కం అధీనంలోనే ఉంటాయి. మంచిని ఆలోచించడం, మంచిని మాట్లాడటం, మంచి చేయడం... స్వస్థ శరీరుడి లక్షణాలు. మంచి మాటలనే వింటూంటే చెవులు అనారోగ్యంపాలు కావు. మంచి ప్రదేశాల్లోనే సంచరించే పాదాలు అపరిశుభ్రం కావు.
అశాశ్వతమైన దేహపోషణకు అవసరాన్ని మించి సమయాన్ని వెచ్చించడమూ వాంఛనీయం కాదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమంటే ఆడంబర సూచక వస్త్రాలను, ఆభరణాలను ధరించి కృత్రిమాలంకరణ చేసుకోవడం కాదు. శరీరానికి జలస్నానం, ఆత్మకు జపస్నానం- రెండూ ప్రధానమైనవే. సంధ్యావందనంలో చేసే ప్రతి మంత్ర పఠనానికీ ముద్రలంటూ ఉన్నాయి. ఆ ముద్రలన్నీ, ఆ భంగిమలన్నీ శరీరంలోని నాడులను స్పందింపజేసేవే. మంచి రక్తప్రసరణ కలిగించేవే. సూర్యనమస్కారాలూ సంధ్యావందనంలోని భాగం. సర్వరోగాలను నిర్మూలించి, దేహాన్ని చైతన్యవంతం చేస్తాయి బాలభానుడి లేతకిరణాలు.
శ్రవణం కన్న బోధన గొప్పది. బోధన కన్న సాధన గొప్పది. ఆ సాధనకు ఉండవలసిందే ఆరోగ్యవంతమైన శరీరం. హితంగా, మితంగా మాట్లాడటం, మౌనవ్రతం ఆచరించడం వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. అష్టాంగం, పంచాంగం, త్రయ్యంగం, ఏకాంగం అనే నాలుగు రకాలైన నమస్కారాలు కూడా మనిషి ఆరోగ్యం కోసమే నిర్దేశితమైనాయి. రుషులు, మునులు, సిద్ధులు అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు మంచి పోషక విలువలున్న కంద మూలాలే భుజించేవారు. నిర్మలంగా గలగలా పారే సెలయేళ్ల నీరు తాగేవారు. ధ్యానం శరీరానికి ఎంతో దృఢత్వం కలగజేస్తుంది. పాండవులు అరణ్యవాసంలో కందమూలాలు, సాత్విక ఆహారమే స్వీకరించి, శక్తిని పుంజుకోగలిగారు. తపస్సులన్నింటిలోనూ ‘ఏకాగ్రత’ అనేది గొప్ప తపస్సు. ఇది శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం స్వార్థం కాదు. పైగా పరోపకారం కూడా. కోరికలతో కూడిన దేహం దుఃఖాలయం, జ్ఞానాన్ని నింపుకొన్న దేహం దేవాలయం. తనది కాని దేహాన్ని తనది అనుకోవడం అహంకారం. ‘దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, సనాతనుడు’ అంటుంది అద్వైత ధర్మం!

జీవిత సత్యం 🙏🙏🍃🍂🍃🍂🍃🍂🍃

      జీవిత సత్యం 🙏🙏🍃🍂🍃🍂🍃🍂🍃

మూసిన కన్ను తెరవక పోయినా ...తెరిచిన కన్ను మూయక పోయినా
శ్వాస తీసుకుని వదలకపోయినా
వదిలిన శ్వాస తీయకపోయినా
ఈ లోకంలో, ఈ జన్మకు అదే చివరి చూపు....

మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.

విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.

అపురూపం గా  తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు.

ఈ క్షణం మాత్రమే నీది.
మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు?

ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.

ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైనా 
అవయవక్షీణం, ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. 

ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు.

ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము.
అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.

చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు ఈ భూమ్మీద
కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.

 మనం కేవలం ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ మాయ.

అశాశ్వతమైనవి శాశ్వతమనే మాయను భక్తితో ఛేధిద్దాం.

అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం భక్తిమార్గం.

అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం.

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం. 

నలుగురికి సాయం చేయాలి, నిత్యం భగవంతుడిని ఆశ్రయించి ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి.అందరూ
ఈవిషయం జాగ్రత్తగా గమనించిఆచరించగలరు

అందరూ భగవంతుని ఆశీస్సులు  పొందాలని ఆశిస్తూ...🕉️🕉️🕉️🕉️🕉️..🙏

*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_

_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._

_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._

_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._

_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._

_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._

_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._

_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._

_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._

_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_

🌹🌹*మనిషికి మనిషి భరోసా*🌹🌹🌹

🌹🌹*మనిషికి మనిషి భరోసా*🌹🌹🌹

☘️☘️☘️అనగనగా, ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి...కొంచెం దూరంలో ఎరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు... ఇంతకీ ..ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!...కాని కేవలం వాడికి వీడు..వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.☘️☘️☘️

⭐⭐⭐నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే... నేను ఉన్నాను అనే భరోసా...ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో..ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.⭐⭐⭐
****
❄️❄️❄️ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!
రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"
రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకం తో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!❄️❄️❄️
**
💦💦💦పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం...కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు..బంధువులు నీ చుట్టూ లేక పోవటం...💦💦💦

🌻🌻🌻కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.🙏👍👍👍

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!** ** **

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!
**  **  **
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.
అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూ gvర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.


Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...