Friday, February 5, 2021

నవవిధ భక్తి మార్గం అంటే.. ? "భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు.

#నవవిధ భక్తి మార్గం అంటే.. ? 
"భక్తిశ్చే నవలక్షణా" అంటూ ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. "శ్రవణం కీర్తనం  విష్ణోః స్మరణం పాద సేవనమ్, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్" వీటినే నవవిధ భక్తి మార్గాలంటారు. 

* మొదటిది శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. భగవంతుని గుణములను, నామాలను, కథలను ఎప్పుడూ వింటూ ఉండాలి. 
* రెండోది కీర్తనం. ఆయన లీలలను నామాలను గానం, ప్రవచనం చేస్తూ ఉండాలి.
* మూడోది స్మరణం. ఇందులో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి.
* నాలుగోది  పాదసేవనం. నిరంతరం ఆయన పాదాలను దర్శిస్తూ ఉండాలి.
* అయిదవది అర్చనం అంటే పూజించడం. 
* ఆరోది వందనమంటే నమస్కారం.
* ఏడోది దాస్యం. స్వామికి దాసునిగా, భృత్యునిగా ఉండాలి.
* ఎనిమిదవది సఖ్యం చేయడం స్నేహం చేయడం.
* తొమ్మిదవది ఆత్మనివేదనం. తాను తనది అంతా ఉన్నది ఆయన కోసమే అని తెలుసుకుని భగవంతునికి సమర్పించాలి.

ఏ విద్యకైనా పరమప్రయోజనం ఇదే అంటాడు ప్రహ్లాదుడు. కలియుగంలో అర్చామూర్తికే ఒకటి తర్వాత ఒకటిగా ఈ నవవిధ సేవలు అర్పించి, తరించాలి. 

ఆంజనేయుడు "దాసోహం కోసలేంద్రస్య" అంటూ అధికంగా దాస్య భక్తినే ప్రదర్శిస్తాడు.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...