Sunday, February 16, 2020

శ్రీమద్భగవద్గీతతొమ్మిదవ అధ్యాయంరాజవిద్యారాజగుహ్యయోగంశ్రీ భగవానువాచ:ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ ||

శ్రీమద్భగవద్గీత

తొమ్మిదవ అధ్యాయం

రాజవిద్యారాజగుహ్యయోగం

శ్రీ భగవానువాచ:

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1

శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను.

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2

విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం సులభసాధ్యం.

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || 3

అర్జునా ! ఈ ధర్మంపట్ల శ్రద్ధలేని పురుషులు నన్ను పొందకుండా మరణరూపమైన సంసారపథంలో పరిభ్రమిస్తారు.

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్‌స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

ఇంద్రియాలకు కనుపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి; నేను మాత్రం వాటిలో లేను.

న చ మత్‌స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః || 5

ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలనూ సృష్టించి, పోషిస్తున్నప్పటికీ వాటిలో వుండదు.

యథా௨௨కాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్‌స్థానీత్యుపధారయ || 6

సర్వత్రా సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్లే సర్వభూతాలూ నాలో వున్నాయని తెలుసుకో.

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ || 7

కౌంతేయా ! ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ || 8

ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో వుంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు || 9

అయినప్పటికీ అర్జునా ! వాటిపై ఆసక్తిలేని తటస్థుణ్ణి కావడం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు.

మయా௨ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునా௨నేన కౌంతేయ జగద్విపరివర్తతే || 10

కౌంతేయా ! ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది.

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

సమస్త ప్రాణికోటికీ ప్రభువునైన నా పరమాత్మతత్త్వం తెలియని మూఢులు మానవరూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు.

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12

అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు.

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 13

పార్థా ! సాత్వికస్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకూ ఆదికారణమైనవాడిగా, నాశనంలేనివాడిగా నన్ను తెలుసుకుని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు.

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకే నమస్కరిస్తూ మనస్సు నామీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు.

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 15

మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో వున్న నన్ను జ్ఞానయజ్ఞంతో సేవిస్తారు. అనేక భావాలతో—నేను ఒక్కడినే అనీ, వేరే వ్యక్తిననీ, బహురూపాలు కలిగినవాడిననీ భజిస్తారు.

అహం క్రతురహం యజ్ఞః స్వధా௨హమహమౌషధమ్ |
మంత్రో௨హమహమేవా௨జ్యమహమగ్నిరహం హుతమ్ || 16

క్రతువూ, యజ్ఞమూ, పితృదేవతలకు అర్పించే అన్నమూ, ఔషధమూ, మంత్రమూ, నేయీ, నిప్పూ, హోమమూ నేనే.

పితా௨హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17

ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గవస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే.

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ || 18

ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున || 19

అర్జునా ! నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుతున్నాను; కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ నేనే. శాశ్వతమైన సత్తూ, అశాశ్వతమైన అసత్తూ నేనే.

త్రైవిద్యా మాం సోమపాః పూత పాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్యసురేంద్రలోకం
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ || 20

మూడు వేదాలు చదివినవారు యజ్ఞాలతో నన్ను పూజించి, సోమపానంచేసి, పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోరతారు. అలాంటివాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్రలోకాన్ని పొంది, దివ్యభోగాలు అనుభవిస్తుంటారు.

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే || 21

వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి, పుణ్యం క్షీణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మకాండను పాటించే భోగపరాయణులు జననమరణాలు పొందుతుంటారు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || 22

ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించేవాళ్ళ యోగక్షేమాలు నేనే చుస్తాను.

యే௨ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే௨పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ || 23

కౌంతేయా ! ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో భజించేవాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు. అయితే వాళ్ళ ఆరాధన శాస్త్రసమ్మతం కాదు.

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనా௨తశ్చ్యవంతి తే || 24

సర్వయజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు.

యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో௨పి మామ్ || 25

దేవతలను సేవించేవాళ్ళు దేవతలనూ, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృదేవతలనూ, భూతాలను అర్చించేవాళ్ళు భూతాలనూ పొందుతారు. నన్ను పూజించేవాళ్ళు నన్నే పొందుతారు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 26

పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు భక్తితో నాకు ఆకుకాని, పువ్వుకాని, పండుకాని, నీరుకాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను.

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ || 27

కౌంతేయా ! నీవు ఏంచేసినా—భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, నాకు ఆ సర్వం సమర్పించు.

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి || 28

శుభాశుభఫలాలు కలగజేసే కర్మబంధాలనుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి వుండగానే ముక్తిపొంది, మరణానంతరం నన్ను చేరుతావు.

సమో௨హం సర్వభూతేషు న మే ద్వేష్యో௨స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ || 29

సమస్తప్రాణులపట్ల సమభావం కలిగిన నాకు విరోధికాని, ఇష్టుడుకాని లేడు. నన్ను భక్తితో భజించేవాళ్ళు నాలోనూ, నేను వాళ్ళలోనూ వుంటాము.

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః || 30

ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది.

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి || 31

అలాంటివాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా ! నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు.

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే௨పి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తే௨పి యాంతి పరాం గతిమ్ || 32

పార్థా ! నన్ను ఆశ్రయించినవాళ్ళు ఎవరైనా సరే—పాపజన్ములు కాని, స్త్రీలుకాని, వైశ్యులుకాని, శూద్రులు కాని—పరమశాంతిపదం పొందుతారు.

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులగురించి వేరే చెప్పాలా? సుఖంలేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః || 34

నామీదే మనస్సూ, భక్తీ కలిగి నన్నే పూజించు. నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి, నామీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " రాజవిద్యారాజగుహ్యయోగం" అనే తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment

In 1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh

In  1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh and asked how much ...