Monday, February 17, 2020

కుట్రలు, కుత్రంత్రాలతో విజయాన్ని సాధించామానుకున్నవారంతా మన కళ్ళముందే పతనావస్థకు చేరుకుంటున్నారు. వారి ప్రక్కన దైవం లేకపోవడమే, వారి యొక్క పతనానికి అసలు కారణం. అందుకే మన పెద్దలు చెప్పిన నీతినియమాలను పాటిస్తూ, ఆ సర్వేశ్వరుని అండతో ముందుకు సాగండి. మీ గమనానికి అడ్డు ఉండదు.మీకు జయమగుగాక!

మీకు జయమగుగాక!

సాటివారు నిన్ను సాధింపగాలేరు
దైవమెపుడు నీకు దప్పకున్న
భారతంబులోని పరమార్థమిదె కదా
విశ్వదాభిరామ వినురవేమ!

“దైవం నీపక్షాన ఉన్నప్పుడు నిన్నెవరూ జయించలేరు. భారతంలోని పరమార్థం ఇదే!” అని వేమన చెబుతున్నాడు. అవును, పరంధాముడు పాండవుల పక్షాన ఉన్నందుకే, వారిని జయలక్ష్మి వరించింది. అయితే స్వామి కౌరవులను వదలి పాండవుల పక్షమే ఎందుకు నిలిచాడని అడిగితే, ఆయన ధర్మపక్షపాతి కనుక, న్యాయం ఎటువైపు ఉంటుందో, అటు వైపే దైవం ఉంటుందన్నది సమాధానం.

ఈ విషయాన్నే అద్యతన భారతంలో మనం చూస్తున్నాం. కుట్రలు, కుత్రంత్రాలతో విజయాన్ని సాధించామానుకున్నవారంతా మన కళ్ళముందే పతనావస్థకు చేరుకుంటున్నారు. వారి ప్రక్కన దైవం లేకపోవడమే, వారి యొక్క పతనానికి అసలు కారణం.  అందుకే మన పెద్దలు చెప్పిన నీతినియమాలను పాటిస్తూ, ఆ సర్వేశ్వరుని అండతో ముందుకు సాగండి. మీ గమనానికి అడ్డు ఉండదు.

మీకు జయమగుగాక!

No comments:

Post a Comment

India's first "Algae Tree" has been installed in Bhopal.🌳 What is an "Algae Tree"?

India's first "Algae Tree" has been installed in Bhopal. 🌳 What is an "Algae Tree"? An "Algae Tree" is no...