Thursday, April 23, 2020

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు;

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు;

జాతకం ఉన్నవారు పుట్టినతేది వివరాలు లేనివాళ్లు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.

ప్రతి పౌర్ణిమ తిధి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది,

ప్రతి మంగళ వారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.

41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.

21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.

41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. అన్ని నియమాలు పాటించాలి.

90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.

శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ మంగళవారం రాహు కాలంలో చేయాలి.

18 మంగళవారాలు లేదా శుక్రవారలందు దుర్గా ఆలయం లో రాహు కాలం దీపం వెలిగించాలి.

41 రోజుల పాటు గణపతిని గరిక తో అర్చించాలి.

11 శ్రావణ నక్షత్రమ్ రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.

5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికీ సహస్ర నామార్చన జరిపించాలి.

శ్రీలక్ష్మి సహస్రనావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో ఒక సం|రమ్ పాటు

కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.

ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్ధిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.

గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజులలో చవితి తిధి రోజున ఉపవాసం ఉంది గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.

11 సప్తాహాలు శ్రీ గురుచరిత్ర అన్ని నియమాలతో పారాయణం చేసి అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలలోతీరిపోగలవు

5 లేదా 11 లేదా 15 లేదా 21 లేదా 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన ఉద్యోగ సమస్యలైన తీరిపోగలవు

గురుముఖంగా లక్ష్మి, లలిత. దత్త విష్ణు శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండ జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి

సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యా వందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించిన ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం తో సకల అరిష్టాలు తొలగిపోగలవు.

చండీ సప్తశతి పారాయణం ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.

7 సప్తాహాలు షిర్డి సాయి చరిత్ర పారాయణం చేసి శిరిడీ ని దర్శించి ధుని లో కొబ్బరికాయను సమర్పించి 11 మంది పేదవారికి అన్నదానం చేస్తే ఆర్ధిక ఆరోగ్య సమస్యలు తీరిపోగలవు.

వాల్మీకి రామాయణం లోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.

పైన ఉదహరింపబడిన పరిహారాలు ఎవ్వరైన పాటించవచ్చు. పై వాటిలో ఎవరికి అనుకూలమైన పరిహారం వారు చేయవచ్చు. అన్ని పాటించనవసరం లేదు.
( ॐ

No comments:

Post a Comment

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ 1980ల మధ్యకాలంలో పాకిస్తాన్ రహస్యంగా అణుకేంద్రం నిర్మిస్తు...