Thursday, January 29, 2026

*పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపటానికి, పరమాత్మతో కృతజ్ఞతాభావం తో మెలగటానికి పది ప్రధాన కారణాలు:*

*పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపటానికి, పరమాత్మతో కృతజ్ఞతాభావం తో మెలగటానికి పది ప్రధాన కారణాలు:*
1. వాహనాలు వాడేకొద్దీ వాటి చక్రాలు అరిగిపోతూ ఉంటాయి, కానీ జీవితకాలం అనేక సంవత్సరాలు నడుస్తున్నా మన పాదాలు అరగకుండా అలాగే ఉంటున్నందుకు.
2. మానవ శరీరంలో 75% జలము ఉంటుంది, చర్మంలో కోట్లాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా పొల్లు పోనందుకు.
3. ఆధారం లేకుండా ఏ వస్తువు నిలబడదు, కానీ మానవ శరీరం సహజంగానే పడకుండా ఉంటున్నందుకు.
4. ఏ బ్యాటరీ కి అయినా రీచార్జింగ్ అవసరం, కానీ గుండె మాత్రం అలాంటి అవసరం లేకుండా అవిచ్ఛన్నంగా పుట్టినప్పటి నుండి మరణించే వరకూ పని చేస్తూ ఉంటున్నందుకు.
5. ఏ పంపు అయినా ఎల్లకాలం పనిచేయదు, మన రక్తనాళాలలో రక్తం పూర్తి జీవితకాలం అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉంటున్నందుకు.
6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. కానీ మన నేత్రాలు ప్రతీ దృశ్యాన్ని అతి ఖచ్చితంగా వేల మెగా పిక్సెల్స్ కంటే రమణీయంగా మనకు అందిస్తున్నందుకు.
7. ఏ ప్రయోగశాల అయినా అన్ని రుచులను పరీక్ష చేయడం కుదరదు, కానీ మన జిహ్వ ఎటువంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తున్నందుకు.
8. ఎంతటి ఉన్నత సున్నిత సెన్సార్లకు అయినా అనేక పరిమితులు ఉండగా, మన చర్మం అతి సున్నిత, అల్ప స్పర్శను కూడా ఖచ్చితంగా గుర్తిస్తున్నందుకు.
9. ఏ యంత్రం అయినా అన్ని శబ్దాలను సృష్టించలేదు, కానీ మానవ గళం వేలాది పౌనఃపున్యాలతో శబ్దాలను శ్రావ్యంగా సృష్టించగలిగినందుకు.
10. ఏ పరికరం అయినా అన్ని శబ్దాలను గుర్తించి తెలుసుకోలేదు, కానీ మన చెవులు ప్రతి శబ్దాన్ని గుర్తించి అర్థాన్ని గ్రహించగలిగినందుకు.

పరమాత్మ పై విధంగా అనేక విలువ కట్టలేని కానుకలను మనకు అనుగ్రహించినందుకు మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతగా ఉండాలి, ఎటువంటి పిర్యాదులు చేసే హక్కు లేదు అని గమనించాలి.

పరమాత్మ అనుగ్రహించిన శరీరాన్ని, ప్రకృతిని దుర్వినియోగం చేస్తే రక్షించే వారు ఎవరూ ఉండరు.

 ప్రకృతి అంటే గాలి, నీరు, నదులు, భూమి, వృక్షాలు, తోటి జీవులు అన్నింటినీ సంరక్షించుకొంటే స్వర్గం తో పనిలేదు మానవులకు.

సర్వే జీవా సుఖినోభవంతు.
🙏🙏🙏🕉️🙏🙏🙏

No comments:

Post a Comment

In 1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh

In  1991, India's economy was bankrupt. Prime Minister P.V. Narasimha Rao called Finance Minister Dr. Manmohan Singh and asked how much ...