Monday, June 15, 2020

🌞 కాలచక్రం 🌞కాలచక్రం :-1. కాలగణనం2. రోజులు3. వారాలు4. పక్షాలు5. నెలలు6. ఋతువులు - కాలాలు7. సంవత్సరాలు8. తిధులు9. నక్షత్రాలు10. రాశులు11. క్యాలండర్

🌞 కాలచక్రం 🌞
కాలచక్రం :-
1. కాలగణనం
2. రోజులు
3. వారాలు
4. పక్షాలు
5. నెలలు
6. ఋతువులు - కాలాలు
7. సంవత్సరాలు
8. తిధులు
9. నక్షత్రాలు
10. రాశులు
11. క్యాలండర్
ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం :
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు)
2.5 చడి = 1 హొరా (ఒక గంట)
24 హొరా = 1 దినం
రెప్ప పాటుకాలం = 1 సెకను
60 సెకన్లు = 1 నిమిషం
60 నిమిషాలు = 1 గంట
24 గంటలు = 1 రోజు లేక దినం
7 దినములు = ఒక సప్తాహం, వారం
15 రోజులు = 1 పక్షము
4 సప్తాహాలు = 1 నెల
2 నెలలు = 1 ఋతువు
2 ఋతువులు = 1 కాలం
6 ఋతువులు = ఒక సంవత్సరం
10 సంవత్సరాలు =ఒక దశాబ్దం 
100 సంవత్సారాలు = ఒక శతాబ్దం
10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం
432 సహస్రాబ్దాలు = 1 యుగం
2 కలియుగాలు = ఒక ద్వాపరయుగం
3 కలి యుగాలు = ఒక త్రేతాయుగం
4 కలి యుగాలు = ఒక కృతయుగం లేదా సత్వయుగం
10 యుగాలు = ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు)
1000 మహాయుగాలు = ఒక కల్పం 43 కోట్ల 23 లక్షల వత్సరాలు
2.రోజులు:
సూర్యుడు ఉదయించినది మొదలు అస్తమించే వరకు గల కాలం పగలు.
సూర్యుడు అస్తమించినది మొదలు మరల ఉదయించే వరకు గల కాలం రాత్రి.
ఒక పగలు, ఒక రాత్రి కలసి ఒక రోజు.
ఏడు రోజులు ఒక వారం.
౩.వారాలు :
1. ఆదివారము, Sunday
2. సోమవారము, Monday
3. మంగళవారము, Tuesday
4. బుధవారము, Wednesday
5. గురువారము, Thursday
6. శుక్రవారము, Friday
7. శనివారము, Saturday
4.పక్షాలు :
పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని
పౌర్ణమి వెళ్లిన దగ్గరి నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.
కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.
పక్షానికి పదిహేను తిధులు:
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్ఠి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పూర్ణిమ లేక అమావాస్య
5. నెలలు:
1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము
6.ఋతువులు -- కాలాలు :
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు ---- చైత్ర,, వైశాఖ మాసాలు 
గ్రీష్మ ఋతువు ------ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు 
వర్ష ఋతువు -------- శ్రావణ, భాద్రపద మాసాలు 
శరత్ ఋతువు -------- ఆశ్వయుజ, కార్తీక మాసాలు 
హేమంత ఋతువు ------- మార్గశిర, పుష్య మాసాలు
శిశిర ఋతువు --------- మాఘం, ఫాల్గుణం మాసాలు
7. కాలములు:
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలం
వేసవి కాలం ------- చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం -------- శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం -------- మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
8 .తెలుగు సంవత్సరాలు:
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6.అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్త
53. సిద్ధార్ధి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
9.నక్షత్రాలు :
నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర
7. పునర్వసు
8. పుష్యమి
9. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ఠ
19. మూల
20. పుర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ఠ
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
10 .రాశులు:
రాశులు పన్నెండు
1.మేషం, Aries 
2.వృషభం, Taurus 
౩.మిధునం, Gemini 
4.కర్కాటకం, Cancer 
5.సింహం, Leo 
6.కన్య, Virgo 
7.తుల, Libra 
8.వృశ్చికం, Scorpio 
9.ధనస్సు, Sagattarius 
10.మకరం, Capricorn 
11.కుంభం, Aquarius 
12.మీనం, Pisces
11.క్యాలెండర్ కథ:
మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. ఆ కేలెండెర్ ఎలా సృష్టించబడిందీ, ఎవరు, ఎలా, ఏ కాలంలో రూపకల్పన చేశారూ, నేటి కేలెండెర్ రూపానికి అది చేరుకోడానికి ఎన్ని మార్పులు చెందిందీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎన్నో మార్పులూ, చేర్పులూ, ఎన్నెన్నో వింతలూ, విశేషాలతో ఏర్పడ్డ విశేషమే మనం వాడుతున్న ప్రస్తుత కేలెండెర్. ఆ రూపకల్పన పాతబడని విశేషమే కదా మనకి. కొత్త సంవత్సరం కొత్త కేలెండెర్ని ఎప్పుడుప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే మీకు అసలా కేలెండెర్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా ఉంది కదూ? ఐతే వెంటనే ఆ కేలెండెర్ కథలోకి వెళ్ళిపోదాం.
అతి ప్రాచీనకాలం నుంచీ రాత్రీ పగలూ, రాత్రీ పగలూ ఒక దాని వెనుక ఒకటి వస్తూండడం గమనిస్తూ వచ్చాడు మానవుడు. కాలగణనానికి అదొక అనువైన ప్రమాణంగా తోచింది. ఈనాటి సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకూ ఒక పగలూ, ఒక రాత్రీ కలిపి ఒక రోజుగా భావించి లెక్కలు కట్టడం ప్రారంభించాడు.
ఆ నాటి సగటు మానవ జీవితం 30 సంవత్సరాలే అనుకున్నా, రోజుల్లో లెక్కడితే 11 వేల రోజుల పైనే అనుకున్నా అయ్యేది. ఇన్ని రోజులు ఒకదాని తరువాత ఒకటి లేక్కపెట్టడంలో ఏన్నో తప్పులు వచ్చేవి. రోజు కంటే పెద్ద కాల ప్రమాణం అవసరం పెరిగింది. చందమామ అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వృద్ది చెందటం, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణిస్తూ ఉండటం గమనించిన మానవుడికి ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న కాలం మరొక ప్రమాణంగా ఏర్పడింది.ఇది సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులు. దీన్ని 'నెల ' అంటారు.మానవ జీవిత ప్రమాణం తెలియడానికి 11 వేల రోజులు లెక్కపెట్టనక్కర లేదు.360 నెలలు లెక్కిస్తే చాలు.
మానవుడు జంతువులను వేటాడుతూనో, పశువుల్ని మేవుకుంటూనో, దేశ ద్రిమ్మరిగా తిరిగే రోజుల్లో మాసానికి విశేష ప్రాముఖ్యం లేకపోయింది. అయితే వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచీ స్థిర జీవితానికి అలవాటు పడ్డాడు. వ్యవసాయం మీద ఋతువుల ప్రభావం ఎంతో ఉంది, సరైన ఋతువులో గింజలు చల్లాలి. వర్షాలు పడే రోజు చుసుకొని పంటలు వేయ్యాలి. లేకపోతే అంతా నాశనమే! ఈ కారణం చేత ఎండాకాలం ఎప్పుడొస్తుందో, తొలకరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరంగా తెలియాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఋతువు ప్రారంభంలో గింజలు చల్లితే, ఆ సంవత్సరం పంటలు బాగా పండితే, 12 నెలల తర్వాత మళ్లీ అదే ఋతువు ప్రారంభంలో మళ్ళీ గింజలు చల్లవచ్చని రైతు దైర్యంగా ఉంటాడు.
12 చంద్ర మాసాలు 354 రోజులకు సమానం.కాని, ఇవి రుతుచక్రంతో సమానంగా నడవ్వు. ఈ రోజు వసంత ఋతువు ప్రారంభమనుకోండి. 12 చంద్ర మాసాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం తిరిగి వసంత ఋతువుతో ప్రారంభమైతే ఏ ఇబ్బంది. ఉండేది కాదు. నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు. రుతు చక్రం కూడా సూర్య గమనంతో సరిగ్గా తిరుగుతుంది. చంద్ర గమనంతో కాదు. సూర్యుడు 12 నక్షత్ర రాశుల్నీ సరిగ్గా 365.25 రోజుల్లో చుట్టి వస్తాడు. దీన్ని సౌర సంవత్సరం అంటారు.
ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఈజిప్టు దేశస్థులకు చంద్ర కళల మీద కంటే, రుతుచక్రం మీదనే ఆసక్తి ఎక్కువ. ఆ దేశస్థుల జీవనాధారం నైలు నది. నైలు నది వరదలతో వారి ఎడారి భూముల సస్యశ్యామలాలయ్యాయి. ఈవరదలు 365 రోజులకొక సారి వచ్చేవి. వారు సవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకొని కేలండరు తయారు చేసుకున్నారు. దీన్ని 12 నెలలుగా విభజించారు. నెలకి 30 రోజుల చొప్పున 360 రోజులు పోగా, మిగిలిన 5 రోజులూ పండుగ రోజులూగా భావించి, ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం లెక్కకట్టేవారు. సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి.
గ్రీకు విజ్ఞాని యూడోక్సస్ క్రీ.పూ. 380 ప్రాంతంలో సంవత్సరం పొడవులోని ఈ ఆరు గంటల వ్యత్యాసాన్ని కనుగొన్నాడు. ఈజిప్టుని పాలిస్తున్న మాసిదోనియా రాజు టోలెమీ ఈ తేడాని గుర్తులో ఉంచుకొని కేలండరులో మార్పులు తేవాలని ప్రయత్నించాడు.కాని చాందస ఈజిప్షియన్ పురోహితులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
రోమన్లు సౌర, చాంద్రమాన పద్థతులను కలిపి ఒక కేలండరు ఏర్పాటు చేసుకున్నారు . మొదట్లో వారి సవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ ?(ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది). వారి సంవత్సరం మార్చిన ప్రారంభం అయ్యేది. రోమన్ రిపబ్లిక్*కి ఏడాదికొకసారి ఎన్నికలు జరిగేవి. రోమను పురోహితులు తమకు అనుకూలమైనవారు పదవిలో ఉంటే సంవత్సరానికో అధికమాసం తగిలించేవారు. వ్యతిరేకులు పదవిలో ఉంటే మానేసేవారు. ఈ విధంగా వారి కేలండరు అస్తవ్యస్తంగా తయారయ్యేద. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరం నాటికి సూర్యుడు గతికీ, వారి కేలండరుకీ 80 రోజుల దాకా వ్యత్యాసం ఏర్పడింది.
అప్పుడే ఈజిప్టునించి తిరిగి వచ్చిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజరు ఈ గందరగోళమంతా చూసి, కేలండరు సంస్కరణకి పూనుకున్నడు. సౌర సంవత్సరం పొడవు 365.25 రోజులుగా గుర్తించాడు. అప్పటి దాకా ఉన్న పది నెలలకీ జనవరి, ఫిబ్రవరి అనే మరో రెండు మాసాలను చేర్చాడు.
మార్చి 1వ తేదీ బదులు, జనవరి 1వ తేదీని సంవత్సరం ప్రారంభం కావాలన్నాడు. నెలకీ 30 రోజుల చొప్పున 12 నెలలకీ 360 రోజులు. పోగా మిగిలిన 5 రోజులూ వీటిలో 5 నెలలకు సర్దాడు.ఈ లెక్కన 5 నెలలకు 31 రోజులు, 7 నెలలకు 30 రోజులూ ఉండాలి. కాని రోమన్లకు ఫిబ్రవరి అచ్చిరాని మాసం. అందుచేత దానిలో ఒక రోజు తీసి మరో నెలకు చేర్చాడు. ఈ విధంగా ఆరు మాసాలు 31 రోజులతోటీ, 5 మాసాలు 30 రోజులతోటీ, ఒక మాసం 29 రోజులతోటీ ఏర్పడ్డాయి. జనవరి 31, ఫిబ్రవరి 29 ,మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, క్వింటిలిస్ 31, సెక్సిటిలిస్ 30, సెప్టెంబరు 30, అక్టోబరు 31, నవంబర్ 30, డిసెంబర్ 31 రోజులతో,మొత్తం 365 రోజులూ పూర్తి అయ్యాయి. అయితే, సంవత్సరానికి పావు రోజు చొప్పున 4 సంవత్సరాలలో ఒక రోజు మిగిలిపోతుంది. అందుచేత ప్రతి నాలుగో సవత్సరానికీ 365 రోజుల బదులు 366 రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును ఫిబ్రవరి మాసానికి కలిపి ఫిబ్రవరిలో 29 రోజులకి బదులు 30 రోజులు ఉండాలని నిర్ణయమైంది.
సంవత్సరానికి 365 రోజులుంటే 52 వారాల ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరి 10 వ తేదీ ఈ సంవత్సరం ఆదివారమైతే, మరుసటి సంవత్సరం అది సోమవారమూ, ఆ తరువాత సంవత్సరం మంగళవారం అవుతూ వస్తుంది. 366 రోజులుంటే 52 వారాల 2 రోజులు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారమయి, ఇది 366 రోజుల సంవత్సరమయితే పై సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారమవుతుంది. ఒక రోజు దాటేసి, గెంతేసి, లీప్ చేసి అయిందన్న మాట. అందుచేత అటువంటి సంవత్సరాన్ని 'లీప్ ఇయర్ ' అంటారు. ఈవిధంగా 4 సంవత్సరాలకు ఒక సారి 'లీప్ ఇయర్ ' వస్తుంది.
ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలంగా తన పేరు అచంద్రార్కం నిలిచిపోయేందుకు 'క్వింట్*లిస్ ' మాసాన్ని తన పేరిట జులై మాసంగా మార్చేశాడు జూలియస్ సీజర్. ఈ కేలెండరు అమలులోకి వచ్చే ముందు క్రీ.పూ. 46వ సంవత్సరానికి 445 రోజులు ఏర్పాటు చేసి, ఆ తర్వాత నుంచే కొత్త కేలెండర్ని అమలులోకి తెచ్చేడు. ఈ విధంగా దారి తప్పిపోయిన రోమను కేలండర్ని క్రమబద్ధం చేశాడు జూలియస్ సీజర్. అప్పటి నుంచి ఈ కేలండర్ని ' జూలియస్ కేలండర్ ' అని పలిస్తూ వచ్చాడు.
జూలియస్ సీజరు తరువాత సీజర్ అగస్టస్ పరిపాలనకు వచ్చాడు.' జూలియస్ సీజర్ సంవత్సరంలోని ఒక మాసానికి తన పేరు పెట్టుకోగా లేనిది నేనెందుకు పెట్టుకోకూడదు? 'అనుకున్నాడు. సెక్స్*టిలియస్ మాసానికి తన పేర ' ఆగస్టు ' అని పేరు పెట్టాడు. ' వీధుల పేర్లూ, నగరాల పేర్లూ తమకనుకూలంగా మాచ్చేసే పద్థతి ఈ నాటిదికాదు. రెండు వేల సంవత్సరాల పూర్వం నించీ ఉంది. పేరైతే మార్చాడు ఆగస్టస్ చక్రవర్తి. కాని జులై మాసానికి 31 రోజులుంటే ఆగస్టుకు 30 రోజులే వచ్చాయి. దాంతో తల కొట్టేసినట్లయ్యింది అతనికి. ఇది పని కాదని, ఫిబ్రవరి మాసంలోని 29 రోజులలో ఒక రోజు తీసివేసి ఆగస్టుకు కలిపేసి దానికి 31 రోజులు చేశాడు. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కాదవా ? ఈ విధంగా ఫిబ్రవరి నెలకు 28 రోజులే మిగిలాయి, అప్పటినుంచి లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.
నికేయా నగంలో జరిగిన క్రైస్తవ చర్చి కౌన్సిల్ జూలియన్ కేలండర్ని ఆమోదించింది. 
సౌర సంవత్సరం 365 1/4 రోజులయితే ఈ కేలండరు ఏ అవాంతరమూ లేకుండా సాగిపోయేది. కథ కంచికి వెళ్ళేది. కాని సౌర సంవత్సరం పొడవు సరీగా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు. లేదా 365,24220 సవత్సరాలు ఈ లెక్కని సౌర సంవత్సరం కంటె జూలియన్ సంవత్సరం సగటున 11 నిముషాల 14 సెకన్లు పెద్దది. ఈ తేడా స్వల్పమే అయినా కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి పెద్దదౌతుంది. 128 సంవత్సరాలలో సౌర సంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం ఒక రోజు పెద్దదవుతుంది.
సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖని దాటి ఉత్తరాభిముఖంగా కదిలే రోజును వసంత విషువత్ ( స్ప్రింగ్ ఈక్వినాక్స్ ) ఆంటారు. ఆ రోజున రాత్రింబగళ్ళు సరిగ్గా పన్నెండేసి గంటలు. క్రీ.శ. 325 లో అది మార్చి 21న వచ్చింది. 453లో మార్చి 20న, 581లో మార్చి 19కి జరిగిపోతూ వచ్చింది. ఈ వసంత విషువత్తు క్రీ.శ. 1263 నాటికి సౌరసంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం 8 రోజులు పెద్దదయింది. ఆ సవత్సరం వసంత విషువత్తు మార్చి పదమూడవ తేదీనే వచ్చింది. క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఈ వసంత విషువత్*తో ముడిపడి ఉంది. ఇది ఈ విధంగా జరిగిపోతూ ఉండటంతో ఈస్టర్ పండుగ జరిగిపోతూ వచ్చింది. రోజర్ బేకన్ ఈ సంగతులన్నీ వివరిస్తూ పోపు నాలుగవ అర్బన్*కి 1263లో ఒక ఉత్తరం రాశాడు. కాని, మరో మూడు శాతాబ్దాల దాకా క్రైస్తవ మతాధికారులు ఏ చర్యా తీసుకోలేదు. 1582 నాటికి వసంత విషువత్ మరో రెండు రోజులు ముందుకు జరిగింది. అ ఏడు మార్చి 11 నే వచ్చింది. అప్పుడు పోవు అయిన గ్రిగరీ - పదమూడు, ఇక ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగాడు.
మొట్టమొదటగా ఆ సంవత్సరం అక్టోబర్*లో 10 రోజులు తీసేశాడు. అక్టోబరు 5ని అక్టోబరు 15గా మార్చేఏడూ. దానితో జూలియన్ కేలండర్ సౌర సంవత్సరంతో సమానమయింది. 1583లో వసంత విషవత్తు మళ్ళీ మార్చి 21కి వచ్చేసింది. కాని ఇలాగే ఊరుకుంటే అది మళ్ళీ వెనక్కి జారడం ప్రారంభిస్తుంది. ఈ తేడా 128 సంవత్సరాలకు ఒక రోజు అని చెప్పుకున్నాం. అయితే 384 సంవత్సరాలలో 3 రోజులు, లేదా 4 శతాబ్ధాలకు 3 రోజులు అవుతుంది. ప్రతి నాల్గు వందల సంవత్సరాల్లోను 3 లీపు సంవత్సరాలు వదిలివేస్తే సరి. తూర్పు యూరప్ దేశాలు, రష్యాలోని ఆర్ధడాక్స్ చర్చ్ అప్పటికీ దీన్ని అంగీకరించలేదు. 1917 రష్యన్ బోల్ష్విక్ విప్లవం తర్వాత లెనిన్ గ్రెగోరియన్ కేలెండర్ని అమలుపరిచాడు. అక్టోబర్ 25ని నవంబర్ 7గా మార్చాడు. ఇదీ జూలియన్, గ్రెగోరియన్ కేలెండెర్ కథ.

కల్పము (కాలమానం):
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కల్పముల పేర్లు :
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:
శ్వేత కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.
మన్వంతరము :
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు :
స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్యసావర్ణి మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరము
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :
1. స్వాయంభువ మన్వంతరము:
మనువు - స్వాయంభువు.
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
సప్తర్షులు - మరీచి ప్రముఖులు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.
2. స్వారోచిష మన్వంతరము:
మనువు - స్వరోచికి వనదేవతయందు కల్గిన కుమారుడు.
మనువు పుత్రులు - చైతుడు,రోచిష్మదుడు,కింపురుషుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - ఊర్జుడు,స్తంభుడు,ప్రాణుడు,దత్తోళి,ఋషభుడు,నీవారుడు, అరివంతుడు
ఇంద్రుడు - విపశ్చింతుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము
౩. ఉత్తమ మన్వంతరము:
మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు - సత్యజితుడు
సురలు - సత్యదేవ శృతభద్రులు
4. తామస మన్వంతరము:
మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు - త్రిశిఖుడు
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
5. రైవత మన్వంతరము:
మనువు - తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు
6. చాక్షుష మన్వంతరము:
మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనముశివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు. చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు.
సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
సురలు - ఆప్యాదులు
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు - వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి(తేజస్వినుడు)
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మ
ఇట్లు మి 
#raghuism🌞 కాలచక్రం 🌞
కాలచక్రం :-
1. కాలగణనం
2. రోజులు
3. వారాలు
4. పక్షాలు
5. నెలలు
6. ఋతువులు - కాలాలు
7. సంవత్సరాలు
8. తిధులు
9. నక్షత్రాలు
10. రాశులు
11. క్యాలండర్
ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం :
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు)
2.5 చడి = 1 హొరా (ఒక గంట)
24 హొరా = 1 దినం
రెప్ప పాటుకాలం = 1 సెకను
60 సెకన్లు = 1 నిమిషం
60 నిమిషాలు = 1 గంట
24 గంటలు = 1 రోజు లేక దినం
7 దినములు = ఒక సప్తాహం, వారం
15 రోజులు = 1 పక్షము
4 సప్తాహాలు = 1 నెల
2 నెలలు = 1 ఋతువు
2 ఋతువులు = 1 కాలం
6 ఋతువులు = ఒక సంవత్సరం
10 సంవత్సరాలు =ఒక దశాబ్దం 
100 సంవత్సారాలు = ఒక శతాబ్దం
10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం
432 సహస్రాబ్దాలు = 1 యుగం
2 కలియుగాలు = ఒక ద్వాపరయుగం
3 కలి యుగాలు = ఒక త్రేతాయుగం
4 కలి యుగాలు = ఒక కృతయుగం లేదా సత్వయుగం
10 యుగాలు = ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు)
1000 మహాయుగాలు = ఒక కల్పం 43 కోట్ల 23 లక్షల వత్సరాలు
2.రోజులు:
సూర్యుడు ఉదయించినది మొదలు అస్తమించే వరకు గల కాలం పగలు.
సూర్యుడు అస్తమించినది మొదలు మరల ఉదయించే వరకు గల కాలం రాత్రి.
ఒక పగలు, ఒక రాత్రి కలసి ఒక రోజు.
ఏడు రోజులు ఒక వారం.
౩.వారాలు :
1. ఆదివారము, Sunday
2. సోమవారము, Monday
3. మంగళవారము, Tuesday
4. బుధవారము, Wednesday
5. గురువారము, Thursday
6. శుక్రవారము, Friday
7. శనివారము, Saturday
4.పక్షాలు :
పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని
పౌర్ణమి వెళ్లిన దగ్గరి నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.
కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.
పక్షానికి పదిహేను తిధులు:
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్ఠి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పూర్ణిమ లేక అమావాస్య
5. నెలలు:
1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము
6.ఋతువులు -- కాలాలు :
సంవత్సరానికి ఆరు ఋతువులు
వసంత ఋతువు ---- చైత్ర,, వైశాఖ మాసాలు 
గ్రీష్మ ఋతువు ------ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు 
వర్ష ఋతువు -------- శ్రావణ, భాద్రపద మాసాలు 
శరత్ ఋతువు -------- ఆశ్వయుజ, కార్తీక మాసాలు 
హేమంత ఋతువు ------- మార్గశిర, పుష్య మాసాలు
శిశిర ఋతువు --------- మాఘం, ఫాల్గుణం మాసాలు
7. కాలములు:
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలం
వేసవి కాలం ------- చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం -------- శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం -------- మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
8 .తెలుగు సంవత్సరాలు:
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6.అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్త
53. సిద్ధార్ధి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
9.నక్షత్రాలు :
నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర
7. పునర్వసు
8. పుష్యమి
9. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ఠ
19. మూల
20. పుర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ఠ
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
10 .రాశులు:
రాశులు పన్నెండు
1.మేషం, Aries 
2.వృషభం, Taurus 
౩.మిధునం, Gemini 
4.కర్కాటకం, Cancer 
5.సింహం, Leo 
6.కన్య, Virgo 
7.తుల, Libra 
8.వృశ్చికం, Scorpio 
9.ధనస్సు, Sagattarius 
10.మకరం, Capricorn 
11.కుంభం, Aquarius 
12.మీనం, Pisces
11.క్యాలెండర్ కథ:
మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. ఆ కేలెండెర్ ఎలా సృష్టించబడిందీ, ఎవరు, ఎలా, ఏ కాలంలో రూపకల్పన చేశారూ, నేటి కేలెండెర్ రూపానికి అది చేరుకోడానికి ఎన్ని మార్పులు చెందిందీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎన్నో మార్పులూ, చేర్పులూ, ఎన్నెన్నో వింతలూ, విశేషాలతో ఏర్పడ్డ విశేషమే మనం వాడుతున్న ప్రస్తుత కేలెండెర్. ఆ రూపకల్పన పాతబడని విశేషమే కదా మనకి. కొత్త సంవత్సరం కొత్త కేలెండెర్ని ఎప్పుడుప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే మీకు అసలా కేలెండెర్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా ఉంది కదూ? ఐతే వెంటనే ఆ కేలెండెర్ కథలోకి వెళ్ళిపోదాం.
అతి ప్రాచీనకాలం నుంచీ రాత్రీ పగలూ, రాత్రీ పగలూ ఒక దాని వెనుక ఒకటి వస్తూండడం గమనిస్తూ వచ్చాడు మానవుడు. కాలగణనానికి అదొక అనువైన ప్రమాణంగా తోచింది. ఈనాటి సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకూ ఒక పగలూ, ఒక రాత్రీ కలిపి ఒక రోజుగా భావించి లెక్కలు కట్టడం ప్రారంభించాడు.
ఆ నాటి సగటు మానవ జీవితం 30 సంవత్సరాలే అనుకున్నా, రోజుల్లో లెక్కడితే 11 వేల రోజుల పైనే అనుకున్నా అయ్యేది. ఇన్ని రోజులు ఒకదాని తరువాత ఒకటి లేక్కపెట్టడంలో ఏన్నో తప్పులు వచ్చేవి. రోజు కంటే పెద్ద కాల ప్రమాణం అవసరం పెరిగింది. చందమామ అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వృద్ది చెందటం, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణిస్తూ ఉండటం గమనించిన మానవుడికి ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న కాలం మరొక ప్రమాణంగా ఏర్పడింది.ఇది సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులు. దీన్ని 'నెల ' అంటారు.మానవ జీవిత ప్రమాణం తెలియడానికి 11 వేల రోజులు లెక్కపెట్టనక్కర లేదు.360 నెలలు లెక్కిస్తే చాలు.
మానవుడు జంతువులను వేటాడుతూనో, పశువుల్ని మేవుకుంటూనో, దేశ ద్రిమ్మరిగా తిరిగే రోజుల్లో మాసానికి విశేష ప్రాముఖ్యం లేకపోయింది. అయితే వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచీ స్థిర జీవితానికి అలవాటు పడ్డాడు. వ్యవసాయం మీద ఋతువుల ప్రభావం ఎంతో ఉంది, సరైన ఋతువులో గింజలు చల్లాలి. వర్షాలు పడే రోజు చుసుకొని పంటలు వేయ్యాలి. లేకపోతే అంతా నాశనమే! ఈ కారణం చేత ఎండాకాలం ఎప్పుడొస్తుందో, తొలకరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరంగా తెలియాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఋతువు ప్రారంభంలో గింజలు చల్లితే, ఆ సంవత్సరం పంటలు బాగా పండితే, 12 నెలల తర్వాత మళ్లీ అదే ఋతువు ప్రారంభంలో మళ్ళీ గింజలు చల్లవచ్చని రైతు దైర్యంగా ఉంటాడు.
12 చంద్ర మాసాలు 354 రోజులకు సమానం.కాని, ఇవి రుతుచక్రంతో సమానంగా నడవ్వు. ఈ రోజు వసంత ఋతువు ప్రారంభమనుకోండి. 12 చంద్ర మాసాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం తిరిగి వసంత ఋతువుతో ప్రారంభమైతే ఏ ఇబ్బంది. ఉండేది కాదు. నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు. రుతు చక్రం కూడా సూర్య గమనంతో సరిగ్గా తిరుగుతుంది. చంద్ర గమనంతో కాదు. సూర్యుడు 12 నక్షత్ర రాశుల్నీ సరిగ్గా 365.25 రోజుల్లో చుట్టి వస్తాడు. దీన్ని సౌర సంవత్సరం అంటారు.
ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఈజిప్టు దేశస్థులకు చంద్ర కళల మీద కంటే, రుతుచక్రం మీదనే ఆసక్తి ఎక్కువ. ఆ దేశస్థుల జీవనాధారం నైలు నది. నైలు నది వరదలతో వారి ఎడారి భూముల సస్యశ్యామలాలయ్యాయి. ఈవరదలు 365 రోజులకొక సారి వచ్చేవి. వారు సవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకొని కేలండరు తయారు చేసుకున్నారు. దీన్ని 12 నెలలుగా విభజించారు. నెలకి 30 రోజుల చొప్పున 360 రోజులు పోగా, మిగిలిన 5 రోజులూ పండుగ రోజులూగా భావించి, ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం లెక్కకట్టేవారు. సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి.
గ్రీకు విజ్ఞాని యూడోక్సస్ క్రీ.పూ. 380 ప్రాంతంలో సంవత్సరం పొడవులోని ఈ ఆరు గంటల వ్యత్యాసాన్ని కనుగొన్నాడు. ఈజిప్టుని పాలిస్తున్న మాసిదోనియా రాజు టోలెమీ ఈ తేడాని గుర్తులో ఉంచుకొని కేలండరులో మార్పులు తేవాలని ప్రయత్నించాడు.కాని చాందస ఈజిప్షియన్ పురోహితులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
రోమన్లు సౌర, చాంద్రమాన పద్థతులను కలిపి ఒక కేలండరు ఏర్పాటు చేసుకున్నారు . మొదట్లో వారి సవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ ?(ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది). వారి సంవత్సరం మార్చిన ప్రారంభం అయ్యేది. రోమన్ రిపబ్లిక్*కి ఏడాదికొకసారి ఎన్నికలు జరిగేవి. రోమను పురోహితులు తమకు అనుకూలమైనవారు పదవిలో ఉంటే సంవత్సరానికో అధికమాసం తగిలించేవారు. వ్యతిరేకులు పదవిలో ఉంటే మానేసేవారు. ఈ విధంగా వారి కేలండరు అస్తవ్యస్తంగా తయారయ్యేద. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరం నాటికి సూర్యుడు గతికీ, వారి కేలండరుకీ 80 రోజుల దాకా వ్యత్యాసం ఏర్పడింది.
అప్పుడే ఈజిప్టునించి తిరిగి వచ్చిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజరు ఈ గందరగోళమంతా చూసి, కేలండరు సంస్కరణకి పూనుకున్నడు. సౌర సంవత్సరం పొడవు 365.25 రోజులుగా గుర్తించాడు. అప్పటి దాకా ఉన్న పది నెలలకీ జనవరి, ఫిబ్రవరి అనే మరో రెండు మాసాలను చేర్చాడు.
మార్చి 1వ తేదీ బదులు, జనవరి 1వ తేదీని సంవత్సరం ప్రారంభం కావాలన్నాడు. నెలకీ 30 రోజుల చొప్పున 12 నెలలకీ 360 రోజులు. పోగా మిగిలిన 5 రోజులూ వీటిలో 5 నెలలకు సర్దాడు.ఈ లెక్కన 5 నెలలకు 31 రోజులు, 7 నెలలకు 30 రోజులూ ఉండాలి. కాని రోమన్లకు ఫిబ్రవరి అచ్చిరాని మాసం. అందుచేత దానిలో ఒక రోజు తీసి మరో నెలకు చేర్చాడు. ఈ విధంగా ఆరు మాసాలు 31 రోజులతోటీ, 5 మాసాలు 30 రోజులతోటీ, ఒక మాసం 29 రోజులతోటీ ఏర్పడ్డాయి. జనవరి 31, ఫిబ్రవరి 29 ,మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, క్వింటిలిస్ 31, సెక్సిటిలిస్ 30, సెప్టెంబరు 30, అక్టోబరు 31, నవంబర్ 30, డిసెంబర్ 31 రోజులతో,మొత్తం 365 రోజులూ పూర్తి అయ్యాయి. అయితే, సంవత్సరానికి పావు రోజు చొప్పున 4 సంవత్సరాలలో ఒక రోజు మిగిలిపోతుంది. అందుచేత ప్రతి నాలుగో సవత్సరానికీ 365 రోజుల బదులు 366 రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును ఫిబ్రవరి మాసానికి కలిపి ఫిబ్రవరిలో 29 రోజులకి బదులు 30 రోజులు ఉండాలని నిర్ణయమైంది.
సంవత్సరానికి 365 రోజులుంటే 52 వారాల ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరి 10 వ తేదీ ఈ సంవత్సరం ఆదివారమైతే, మరుసటి సంవత్సరం అది సోమవారమూ, ఆ తరువాత సంవత్సరం మంగళవారం అవుతూ వస్తుంది. 366 రోజులుంటే 52 వారాల 2 రోజులు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారమయి, ఇది 366 రోజుల సంవత్సరమయితే పై సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారమవుతుంది. ఒక రోజు దాటేసి, గెంతేసి, లీప్ చేసి అయిందన్న మాట. అందుచేత అటువంటి సంవత్సరాన్ని 'లీప్ ఇయర్ ' అంటారు. ఈవిధంగా 4 సంవత్సరాలకు ఒక సారి 'లీప్ ఇయర్ ' వస్తుంది.
ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలంగా తన పేరు అచంద్రార్కం నిలిచిపోయేందుకు 'క్వింట్*లిస్ ' మాసాన్ని తన పేరిట జులై మాసంగా మార్చేశాడు జూలియస్ సీజర్. ఈ కేలెండరు అమలులోకి వచ్చే ముందు క్రీ.పూ. 46వ సంవత్సరానికి 445 రోజులు ఏర్పాటు చేసి, ఆ తర్వాత నుంచే కొత్త కేలెండర్ని అమలులోకి తెచ్చేడు. ఈ విధంగా దారి తప్పిపోయిన రోమను కేలండర్ని క్రమబద్ధం చేశాడు జూలియస్ సీజర్. అప్పటి నుంచి ఈ కేలండర్ని ' జూలియస్ కేలండర్ ' అని పలిస్తూ వచ్చాడు.
జూలియస్ సీజరు తరువాత సీజర్ అగస్టస్ పరిపాలనకు వచ్చాడు.' జూలియస్ సీజర్ సంవత్సరంలోని ఒక మాసానికి తన పేరు పెట్టుకోగా లేనిది నేనెందుకు పెట్టుకోకూడదు? 'అనుకున్నాడు. సెక్స్*టిలియస్ మాసానికి తన పేర ' ఆగస్టు ' అని పేరు పెట్టాడు. ' వీధుల పేర్లూ, నగరాల పేర్లూ తమకనుకూలంగా మాచ్చేసే పద్థతి ఈ నాటిదికాదు. రెండు వేల సంవత్సరాల పూర్వం నించీ ఉంది. పేరైతే మార్చాడు ఆగస్టస్ చక్రవర్తి. కాని జులై మాసానికి 31 రోజులుంటే ఆగస్టుకు 30 రోజులే వచ్చాయి. దాంతో తల కొట్టేసినట్లయ్యింది అతనికి. ఇది పని కాదని, ఫిబ్రవరి మాసంలోని 29 రోజులలో ఒక రోజు తీసివేసి ఆగస్టుకు కలిపేసి దానికి 31 రోజులు చేశాడు. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కాదవా ? ఈ విధంగా ఫిబ్రవరి నెలకు 28 రోజులే మిగిలాయి, అప్పటినుంచి లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.
నికేయా నగంలో జరిగిన క్రైస్తవ చర్చి కౌన్సిల్ జూలియన్ కేలండర్ని ఆమోదించింది. 
సౌర సంవత్సరం 365 1/4 రోజులయితే ఈ కేలండరు ఏ అవాంతరమూ లేకుండా సాగిపోయేది. కథ కంచికి వెళ్ళేది. కాని సౌర సంవత్సరం పొడవు సరీగా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు. లేదా 365,24220 సవత్సరాలు ఈ లెక్కని సౌర సంవత్సరం కంటె జూలియన్ సంవత్సరం సగటున 11 నిముషాల 14 సెకన్లు పెద్దది. ఈ తేడా స్వల్పమే అయినా కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి పెద్దదౌతుంది. 128 సంవత్సరాలలో సౌర సంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం ఒక రోజు పెద్దదవుతుంది.
సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖని దాటి ఉత్తరాభిముఖంగా కదిలే రోజును వసంత విషువత్ ( స్ప్రింగ్ ఈక్వినాక్స్ ) ఆంటారు. ఆ రోజున రాత్రింబగళ్ళు సరిగ్గా పన్నెండేసి గంటలు. క్రీ.శ. 325 లో అది మార్చి 21న వచ్చింది. 453లో మార్చి 20న, 581లో మార్చి 19కి జరిగిపోతూ వచ్చింది. ఈ వసంత విషువత్తు క్రీ.శ. 1263 నాటికి సౌరసంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం 8 రోజులు పెద్దదయింది. ఆ సవత్సరం వసంత విషువత్తు మార్చి పదమూడవ తేదీనే వచ్చింది. క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఈ వసంత విషువత్*తో ముడిపడి ఉంది. ఇది ఈ విధంగా జరిగిపోతూ ఉండటంతో ఈస్టర్ పండుగ జరిగిపోతూ వచ్చింది. రోజర్ బేకన్ ఈ సంగతులన్నీ వివరిస్తూ పోపు నాలుగవ అర్బన్*కి 1263లో ఒక ఉత్తరం రాశాడు. కాని, మరో మూడు శాతాబ్దాల దాకా క్రైస్తవ మతాధికారులు ఏ చర్యా తీసుకోలేదు. 1582 నాటికి వసంత విషువత్ మరో రెండు రోజులు ముందుకు జరిగింది. అ ఏడు మార్చి 11 నే వచ్చింది. అప్పుడు పోవు అయిన గ్రిగరీ - పదమూడు, ఇక ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగాడు.
మొట్టమొదటగా ఆ సంవత్సరం అక్టోబర్*లో 10 రోజులు తీసేశాడు. అక్టోబరు 5ని అక్టోబరు 15గా మార్చేఏడూ. దానితో జూలియన్ కేలండర్ సౌర సంవత్సరంతో సమానమయింది. 1583లో వసంత విషవత్తు మళ్ళీ మార్చి 21కి వచ్చేసింది. కాని ఇలాగే ఊరుకుంటే అది మళ్ళీ వెనక్కి జారడం ప్రారంభిస్తుంది. ఈ తేడా 128 సంవత్సరాలకు ఒక రోజు అని చెప్పుకున్నాం. అయితే 384 సంవత్సరాలలో 3 రోజులు, లేదా 4 శతాబ్ధాలకు 3 రోజులు అవుతుంది. ప్రతి నాల్గు వందల సంవత్సరాల్లోను 3 లీపు సంవత్సరాలు వదిలివేస్తే సరి. తూర్పు యూరప్ దేశాలు, రష్యాలోని ఆర్ధడాక్స్ చర్చ్ అప్పటికీ దీన్ని అంగీకరించలేదు. 1917 రష్యన్ బోల్ష్విక్ విప్లవం తర్వాత లెనిన్ గ్రెగోరియన్ కేలెండర్ని అమలుపరిచాడు. అక్టోబర్ 25ని నవంబర్ 7గా మార్చాడు. ఇదీ జూలియన్, గ్రెగోరియన్ కేలెండెర్ కథ.

కల్పము (కాలమానం):
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కల్పముల పేర్లు :
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:
శ్వేత కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.
మన్వంతరము :
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు :
స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్యసావర్ణి మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరము
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :
1. స్వాయంభువ మన్వంతరము:
మనువు - స్వాయంభువు.
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
సప్తర్షులు - మరీచి ప్రముఖులు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.
2. స్వారోచిష మన్వంతరము:
మనువు - స్వరోచికి వనదేవతయందు కల్గిన కుమారుడు.
మనువు పుత్రులు - చైతుడు,రోచిష్మదుడు,కింపురుషుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - ఊర్జుడు,స్తంభుడు,ప్రాణుడు,దత్తోళి,ఋషభుడు,నీవారుడు, అరివంతుడు
ఇంద్రుడు - విపశ్చింతుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము
౩. ఉత్తమ మన్వంతరము:
మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు - సత్యజితుడు
సురలు - సత్యదేవ శృతభద్రులు
4. తామస మన్వంతరము:
మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు - త్రిశిఖుడు
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
5. రైవత మన్వంతరము:
మనువు - తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు
6. చాక్షుష మన్వంతరము:
మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనముశివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు. చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు.
సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
సురలు - ఆప్యాదులు
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు - వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి(తేజస్వినుడు)
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మ.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...