Friday, October 10, 2025

మంచిమాటలు

* జైగురుదత్త*
*"మంచిమాటలు*
*జీవితాంతం మనం ఒంటరి వాళ్ళమే. అన్నీ మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళి పోతాయనే సత్యాన్ని గ్రహించినప్పుడు అది మనల్ని వేదనకు గురి చేయదు.*

*ఒంటరిగానే పుడతాం, ఒంటరిగానే మరణిస్తాం. మన జీవిత ప్రయాణం అంతా ఒంటరిగానే సాగుతుంది. అనుభవాలన్నిటిని ఒంటరిగానే పొందుతాం. ఇద్దరు వ్యక్తులు ఒకే అనుభవాన్ని పొందినా, వారికి కలిగే అనుభూతి వేర్వేరుగా ఉంటుంది.*

*మీతో మీరు గడపటం వల్ల ఆనందం దక్కుతుంది. మనిషి మరణించిన తర్వాత స్వర్గం, నరకం ఉంటాయని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి చేరతారని, ఇదంతా స్వయంగా మీరు అనుభవించవలసినదే తప్ప మరెవరూ వెంటరారని వేదాలు చెబుతున్నాయి

No comments:

Post a Comment

chit fund private 100,000 Rs 5,000 pm