Friday, February 7, 2020

కుజ దోషం ఉంటే పెళ్లి కాదా..? ఏం చేయాలి?కుజ దోషం వలన వివాహం మాత్రమే సమస్య ? ఇంకా ఇతర ఇబ్బందులు ఉంటాయా ?

కుజ దోషం ఉంటే పెళ్లి కాదా..? ఏం చేయాలి?
కుజ దోషం  వలన  వివాహం మాత్రమే  సమస్య ? ఇంకా ఇతర  ఇబ్బందులు  ఉంటాయా ? 

పరిష్కార మార్గము  ఏమిటి ?

ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం, స్వభావం వంటివాటిని కుజుడు సూచిస్తాడు. బర్త్ చార్ట్ లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దూకుడు స్వభావం కలిగి ఉండటం, స్వభావంలో సమస్యలు ఎదురవుతాయి.

 ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజ దోషం ఉన్నట్లు అర్థం. ఈ స్థానాల్లో కుజుని ఆధిపత్యమే కాకుండా.. సూర్య, గురు, రాహు, కేతువులు ఆధిపత్యం వహించడం లేదా ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజ దోషం ఉందని జ్యోతిష్యులు చెబుతారు.

కుజ దోషం లగ్నంలో ఉంటే ఉద్వేగాన్ని, ద్వితీయంలో ఉంటే కుటుంబంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో ఉంటే అది సౌఖ్యస్థానం కావడం వలన సుఖాన్ని అధికంగా కోరుకుంటూ పొందలేక ఇబ్బందులు పడతారు. సప్తమంలో ఉంటే కళత్రంపై దాని ప్రభావం ఉండటం వల్ల కష్టాలకు శ్రీకారం చ్టుటినవారౌతారు. అష్టమంలో ఉంటే ఆకస్మిక నష్టాలకు గురౌతారు. 12లో ఉంటే శయ్యాసౌఖ్యాన్ని, నిద్రను కోల్పోతారు.

కుజ దోషం కారణంగా విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం వంటి పరిస్థితులు కూడా జరుగుతాయి.సంక్షోభం, కలత ఎదుర్కోవాల్సి వస్తుంది
కుజ దోషం వల్ల భాగస్వామి చనిపోయే అవకాశముందని  చెప్తుంటారు .

కుజ దోషం నుంచి బయటపడటానికి చాలా మంది రకరకాలుగా పూజలు కూడా చేస్తారు. పరిష్కారాలున్నాయని చెబుతారు.
వాటిలో  కొన్ని

1) కుజ దోషం ఉన్న వాళ్లకు ప్రధానంగా కుంభ వివాహం చేస్తారు. అంటే అరటిచెట్టుకు లేదా రావి చెట్టుకు లేదా వెండి లేదా బంగారు విష్ణువు ప్రతిమకు కుజ దోషం ఉన్న వ్యక్తితో పెళ్లి జరపడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని  సూచిస్తారు. కుజ దోషం వల్ల కలిగే అనర్థాలను ఈ పెళ్లి ద్వారా పోగొట్టుకోవచ్చని నమ్మకం.

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి కూడా కుజ దోషం ఉండటంతో.. ఆమెకు ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేశారు. తర్వాతే అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిపించారు.

2)కుజ దోషం ప్రభావం నివారించుకోవడానికి నవగ్రహ దేవతలను పూజించడం మరో పరిష్కార మార్గం. ప్రతి మంగళవారం నవగ్రహాలకు పూజ చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళ వారం హనుమాన్ ని దర్శించుకుని నెయ్యి దీపం వెలిగించినా.. ఈ దోషం తొలగిపోతుంది.

3) కుజ దోషం ఉన్న ఇద్దరూ అంటేస్త్రీ పురుషులకు పెళ్లి చేస్తే.. ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.

ఇంకా  అనేక  మార్గాలు పండితులు  చెప్తుంటారు  ఐతే  వేదమయీ సూచించు  పరిష్కార మార్గము  ఏమిటి ?

దోషం  ఉన్నవారు సుబ్రహ్మణ్య  స్వామి  కుజునికి  అధిపతి  కావున సుబ్రహ్మణ్య ఆరాధన  చేయడం వలన దోష  నివారణ  జరుగుతుంది 

సుబ్రహ్మణ్య అష్టకం  పారాయణం , కుజ శ్లోకం  పారాయణ చేస్తూ ,కుజ జపం  చేయించుకోవడం , హోమం  చేయించడం  వలన  దోషం నుండి విముక్తి  పొందవచ్చు ఆసక్తి  ఉన్నవారుకోసం 
 
కుజ దోషం ఉన్నవారు  లేక  అంతర్లీన  జాతక దోషం ఉన్నవారు  దోష నివారణకు కుక్కే  సుబ్రహ్మణ్య  స్వామి  క్షేత్రం  లో  గోత్ర ,నామ , నక్షత్రములు  తెలియచేస్తూ   వేదమయీ  సంస్థ  పండితులు ద్వారా  సంపూర్ణ  సుబ్రహ్మణ్య   ఆరాధన  చేయించడం  ద్వారా మీకు  మంచి ఫలితాలు  లభిస్తాయి  సంప్రదించండి  :  8688431063

శ్రీమద్భగవద్గీతరెండవ అధ్యాయంసాంఖ్యయోగంసంజయ ఉవాచ:తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ||

శ్రీమద్భగవద్గీత

రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం

సంజయ ఉవాచ:

తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః || 1

శ్రీ భగవానువాచ:

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3

సంజయుడు: దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీ కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు.

అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన ఈ పాడుబుద్ధి నీ కెందుకు పుట్టింది? నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు, మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు కదా! యుద్ధం ప్రారంభించు.

అర్జున ఉవాచ:

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 4

అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను?

గురూనహత్వాహి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5

మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చమెత్తుకోవడం మేలు.

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః
తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 6

యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం లేదు. మనం జయిస్తామో, వారు జయిస్తారో చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా ఉన్నారు.

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7

గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు ఏది శ్రేయోమార్గమో దాన్ని ఆదేశించు.

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8

భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా నా శోకం తగ్గుతుందనుకోను.

సంజయ ఉవాచ:

ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ || 9

సంజయుడు: అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని ఊరకున్నాడు.

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః || 10

రెండుసేనల మధ్య విషాదవశుడైవున్న అర్జునుణ్ణి చూసి శ్రీ కృష్ణపరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ:

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11

అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతునావు. చచ్చిపోయినవాళ్ళ గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12

నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా వుంటాము.

దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13

జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 14

కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల శీతోష్ణాది గుణాలూ, సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ, ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీరా ! ఆ బాధలను సహించు.

యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 15

పురుషవర్యా ! శీతోష్ణ సుఖదుఃఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు.

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16

లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి || 17

ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మవస్తువు నాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు.

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినో௨ప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || 18

నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక ఓ భారత వీరా! యుద్ధం మొదలు పెట్టు.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19

ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు.

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 21

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వతమైనదనీ తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు?ఎలా చంపిస్తాడు?

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ || 22

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23

ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.

అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24

ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.

అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25

ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం మాను.

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 27

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.

స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే || 31

నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లబంతే యుద్ధమీదృశమ్ || 32

తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు.

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 33

నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మమూ, పేరు ప్రఖ్యాతులూ పాడుచేసి పాపం కట్టుకంటావు.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే || 34

అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు ప్రతిష్ఠలున్నవాడికి అపనిందకంటే మరణమే మంచిది.

భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 35

ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు.

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36

నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలెన్నో అంటారు. అంతకుమించిన దుఃఖమేముంది?

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37

అర్జునా ! ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు.

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి || 38

సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.

ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 39

పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెబుతాను విను.

నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40

ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు; దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయం నుంచి కాపాడుతుంది.

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో௨వ్యవసాయినామ్ || 41

కురునందనా ! నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా వుంటుంది. స్థిరసంకల్పం లేనివాళ్ళ ఆలోచనలు పరిపరివిధాల పరుగులెడతాయి.

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః || 42

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి || 43

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 44

పార్థా ! అవివేకులూ, అర్థవాదాలపట్ల ఆసక్తికలవాళ్ళూ, స్వర్గసుఖాలకు మించి మరొకటి లేదని వాదించేవాళ్ళూ వేదవాక్యాలు పలుకుతుంటారు. అలాంటి వాళ్ళు తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించాక, వాళ్ళకు మళ్ళీ కర్మభూమిలో పునర్జన్మ రూపమైన కర్మఫలమే తప్ప మోక్షం లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వశులైనవారి బుద్ధి నిలకడగా వుండదు.

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45

అర్జునా ! వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46

నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో௨స్త్వకర్మణి || 47

కర్మలు చేయడం వరకే నీకు అధికారం. కర్మఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మచేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48

ఫలం దక్కినా దక్కక పోయినా కర్మలు సమభావనతో సాగించు. అర్జునా ! ఈ సమదృష్టినే యోగమంటారు.

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49

ధనంజయా ! ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామకర్మకంటే హీనం, ఫలితం ఆశించి కర్మచేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు.

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50

సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51

నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాలనుంచి తప్పించుకుని, ఉపద్రవంలేని మోక్షం పొందుతున్నారు.

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52

నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయాలూ, వినబోయే అర్థాలూ విరక్తి కలిగిస్తాయి.

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53

అర్థవాదాలు అనేకం వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా వున్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.

అర్జున ఉవాచ:

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత? కిమాసీత? వ్రజేత కిమ్? || 54

అర్జునుడు: కేశవా ! సమాధినిష్ఠ పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతని ప్రసంగమూ, ప్రవర్తనా ఎలా వుంటాయి?

శ్రీ భగవానువాచ:

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 55

శ్రీకృష్ణభగవానుడు: మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56

దుఃఖాలకు క్రుంగనివాడూ, సుఖాలకు పొంగనివాడూ, భయమూ, రాగద్వేషాలూ వదిలిపెట్టినవాడూ అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడవుతాడు.

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 57

స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడు స్థితప్రజ్ఞుడు.

యదా సంహరతే చాయం కూర్మో௨0గానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 58

తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాలనుంచి మళ్ళించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు.

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసో௨ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59

ఆహారం తీసుకోనివాడికి ఇంద్రియవిషయాలు అణగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటిపోతుంది.

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60

కుంతీనందనా ! ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి.

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61

యోగసాధకుడు ఇంద్రియాలన్నింటినీ వశపరచుకుని నామీదే మనస్సు వుంచాలి. అలాంటివాడి ప్రజ్ఞ సుస్థిరమవుతుంది.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో௨భిజాయతే || 62

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || 63

ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి వాటిమీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తివల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలగజేస్తాయి. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకంవల్ల మరపు, మరపువల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది.

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి || 64

మనసును నిగ్రహించుకుని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియాల వల్ల విషయసుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతి పొందుతాడు.

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే || 65

మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలూ సమసిపోతాయి. మనసు నిర్మలంగా వున్నవాడి ప్రజ్ఞకు చలనం లేదు.

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ || 66

మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కాని ఆత్మచింతన కాని అలవడవు. అలాంటివాడికి మనశ్శాంతి వుండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం శూన్యం.

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి || 67

సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది.

తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 68

అర్జునా ! అందువల్ల విషయసుఖాల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది; వాడే స్థితప్రజ్ఞుడు.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69

ఆత్మానుభూతిలేని అన్ని ప్రాణులకూ రాత్రిగాతోచే సమయంలో మనోనిగ్రహం కలిగిన ముని మేలుకుని వుంటాడు. విషయాలపట్ల ఆసక్తితో సర్వప్రాణులూ మెలకువగా వున్నపుడు ఆత్మనిష్ఠకలిగిన యోగికి రాత్రి అవుతుంది.

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్‌కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ || 70

నిరంతరం నిండుతున్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీజలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమై అణగిపోతాయో వాడు శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిస అయినవాడికి మోక్షం లేదు.

విహాయ కామాన్ యః సర్వాన్‌పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి || 71

కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలగేవాడు పరమశాంతి పొందుతాడు.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా௨స్యామంతకాలే௨పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || 72

అర్జునా ! ఇలా బ్రహ్మజ్ఞానం పొందినవాడి దృష్టి ప్రపంచవిషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. జీవితం చివరిఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "సాంఖ్యయోగం" అనే రెండవ అధ్యాయం సమాప్తం.

Wednesday, February 5, 2020

శ్రీమద్భగవద్గీతమొదటి అధ్యాయంఅర్జునవిషాదయోగంధృతరాష్ట్ర ఉవాచ:ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ

శ్రీమద్భగవద్గీత

మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ || 1

ధృతరాష్టృడు: సంజయా ! ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధసన్నద్ధులై నిలిచిన నా వాళ్ళూ, పాండవులూ ఏం చేశారు?

సంజయ ఉవాచ:

దృష్ఠ్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్ || 2

సంజయుడు: యుద్ధానికి సంసిద్ధులైవున్న పాండవ సైన్యాలను చూసి, దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.

పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 3

ఆచార్యా ! మీ శిష్యుడూ, ధీమంతుడూ అయిన ధృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి.

అత్ర శూరా మహేష్వాసాః, భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపద శ్చమహారథః || 4

ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః || 5

యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 6

ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులూ, అస్త్ర విద్యానిపుణులూ, శౌర్యంలో భీమార్జున సమానులూ ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే.

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || 7

బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 8

అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || 9

మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ || 10

భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.

అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి || 11

అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 12

అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.

తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ || 13

వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 14

అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.

పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 16

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః || 17

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 18

శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19

ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః || 20

హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే !

అర్జున ఉవాచ:

సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత ! 21

కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో " అచ్యుతా ! రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు" అన్నాడు.

యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామా నవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే || 22

యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః || 23

"కృష్ణా ! శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడనికి సమరరంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను" అన్నాడు అర్జునుడు.

సంజయ ఉవాచ:

ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24

భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 25

సంజయుడు: ధృతరాష్ట్రా ! అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణాదులకు ఎదురుగా రథం ఆపి, అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు.

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా || 26

శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |
తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బంధూనవస్థితాన్ || 27

కృపయా పరయా௨௨విష్టో విషీదన్నిద మబ్రవీత్.

అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా వున్న తన తండ్రులనూ, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను; పౌత్రులనూ, మిత్రులనూ, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేషకృపాంతరంగుడూ, విషాదవశుడు అయి ఇలా అన్నాడు.

అర్జున ఉవాచ:

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 28

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30

కృష్ణా ! యుద్ధాసక్తులై ఎదురుగా వున్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటుతో కంపిస్తున్నది. గాండీవం చేతిలోంచి జారిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లడిల్లుతున్నది.

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో௨నుపశ్యామి హత్వా స్వజన మాహవే || 31

కేశవా ! దుశ్శకునాలు కానవస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించడం లేదు.

న కాంక్షే విజయం కృష్ణ ! న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద ! కిం భోగై ర్జీవితేన వా? || 32

కృష్ణా ! యుద్ధవిజయం మీద, రాజ్యసుఖాలమీద నాకు ఆసక్తిలేదు. రాజ్యభోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.

యేషా మర్థే కాంక్షితం నో రాజ్యం భోగాస్సుఖాని చ |
త ఇమే௨వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || 33

ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాశ్శ్వశురాః పౌత్రాః స్యాలాస్సబంధిన స్తథా || 34

ఎవరికోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా---గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులూ---ధన ప్రాణాల మీద ఆశవదలి ఈ రణరంగంలోనే ఉన్నారు.

ఏతా న్న హంతు మిచ్చామి ఘ్నతో௨పి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 35

మధుసూదనా ! వాళ్ళు నన్ను చంపితే చంపనీ, ముల్లోకాలనూ ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్ళను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపుతానా ?

నిహత్య ధార్తరాష్ట్రా న్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన? |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః || 36

దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి? జనార్దనా ! ఈ పాపాత్ములను చంపితే మనకూ పాపమే.

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ || 37

బంధువులైన దుర్యోధనాదులను చంపడం మనకు మంచిదికాదు. మాధవా ! స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం ?

యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ || 38

రాజ్యకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేక పోతున్నారు.

కథం న జ్ఞేయ మస్మాభిః? పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్దన || 39

జనార్దనా ! వంశక్షయంవల్లవచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు ?

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో௨భిభవత్యుత || 40

వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మాలు నశించిన వంశమంతటా అధర్మం అలుముకుంటుంది.

అధర్మా௨భిభవాత్ కృష్ణ! ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41

కృష్ణా ! అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది.

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః || 42

వర్ణసంకరం వల్ల కులానికీ, కులనాశకులకూ కలిగేది నరకమే. వారి పితృదేవతలు పిండోదక కార్యాలు లేక అధోగతి పాలవుతారు.

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || 43

కులాన్ని నాశనంచేసే వాళ్ళమూలంగా కలిగే వర్ణసాంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతిధర్మాలూ, కులధర్మాలూ అడుగంటిపోతాయి.

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || 44

జనార్దనా ! కులధర్మాలు నశించిన కుటుంబాలవారు శాశ్వత నరక వాసులవుతారని వింటున్నాము.

అహో ! బత ! మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన, హంతుం స్వజన ముద్యతాః || 45

ఎంత ఆశ్చర్యం ! రాజ్యలోభంతో బంధువులను చంపడానికి పూనుకుని, ఘోరపాపాలు చేయడానికి సిద్ధపడ్డాం కదా.

యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ || 46

ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్ధంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిది.

సంజయ ఉవాచ:

ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః || 47
సంజయుడు: అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచిపెట్టి రణరంగంలో రథం మీద చతికిలబడ్డాడు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "అర్జున విషాదయోగం" అనే మొదటి అధ్యాయం సమాప్తం.

Tuesday, January 28, 2020

సిరులిచ్చే లక్ష్మీకుబేర యంత్రము

సిరులిచ్చే లక్ష్మీకుబేర యంత్రము

      ఈ భూమిపై మానవుడు ఆటంకాలను జయిస్తూ, ఆనందంగా బతకాలి. అయితే మానవుడు బతకాలంటే ధన సముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడై ఉండాలి. పూర్వం ధనం లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ ధనం కావాలి. అయితే డబ్బును సంపాదించడానికి మానవుడు పడేపాట్లు అంతాఇంత కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేసిన ఉపాయం లేదు. అందుకే మానవ జీవితంలో ధనం నిత్యవసరంగా మారింది.

ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. లక్ష్మి ధనకనకాధులు, అదృష్టం, సౌందర్యాలనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది అంతకంతే. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు.

అయితే లక్ష్మిదేవి పూజను దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజను ఒకేసారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురి నుంచి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి. 
లక్ష్మి కుబేరుల ఆరాధనను సులభంగా ఆచరించడానికి సామాన్య మంత్రాలను ఈ కింద ఇవ్వడమైంది. కుబేర, లక్ష్మీ మంత్రాలు వేరు వేరుగా దొరుకుతాయి. వాటిని పూజా గదిలో దేవుని ముందు ఎర్ర రంగులోని వస్త్రంపై ఉంచి దీప-ధూపాలతో పూజించాలి. ఓపికను బట్టి సాధ్యమైతే నిత్య నైవేద్యం కోసం ఏదైనా తీపి లేదా, తేనె, లేదా నెయ్యి చక్కెరను సమర్పించవచ్చు. శంఖం దొరికితే దాన్ని దేవుని పీఠం ముందు ఉంచి షోడ షోపచారాలతో పూజించడంవల్ల అష్టై శ్వర్యాలు సిద్ధించును.
లక్ష్మీ మంత్రం: 
ఓం శ్రీ హ్రీం క్రీం లక్ష్మీ దేవ్యై నమ:
కుబేర మంత్రం:
యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపతయే ధనధాన్య“సమృద్ధియే మేహి దాపయ స్వాహా
పై రెండు మంత్రాలనూ రోజుకు కనీసం 1008 సార్లు చొప్పున 9 నెలలు జపిస్తే సిరుల పంట పండుతుంది. 
మూల  మంత్రం :
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరదవరద సర్వజనమే వశమానాయ స్వాహాః 
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకుపై రాసి  యథా శక్తిగా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న అన్ని విఘ్నములు తొలగి విజయము ఐశ్వర్య వృద్ధి సంతతి గౌరవమును కూడా పొందగలరు.                       
నిత్యం ఆచమ్య, ప్రాణామాయ, గోత్ర దేశ కాలమాన సంకీర్తణాధికముగా త్రిన్యాస పూర్వకముగా, పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును. మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రిని కూడా జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.
ధ్యానం, మూల మంత్రం, ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యం అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములను అనుసరించి మంత్ర యంత్రములు పని సాధనలందు అనంత ఫల సాధకములగును. సాధన గురు పరంపరలో ఉండాలి......

Thursday, January 23, 2020

గాయత్రీ మంత్ర శక్తి (భ్రమరీ అవతారం)🌷


🌷గాయత్రీ మంత్ర శక్తి (భ్రమరీ అవతారం)🌷

పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.

అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.

బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి

మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.

బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి," మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు "అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము. దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.

గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.

"వరాభయ కరా శాంత కరుణామృత సాగరా !

నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా||"

అయిన జగన్మాతను చూచి

"నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి|

నమః కమల పత్రాక్షి సర్వాధారే నమో7స్తుతే||

భ్రమరై ర్వేష్టితా యస్మాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా|

తసై#్య దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః||

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.

అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి ,భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా తేశాయి. దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.

తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.

ఈ కథ చెప్పి , వ్యాసమహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివిరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినిలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు.

గాయత్రీ పరాశక్తి స్వరూపము. అమెకు ఐదు ముఖాలు, ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.

గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో

ిస్తూ ఉంటుంది.

గాయత్రీ మంత్రానికి నాలుగ పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ ఋగ్యజుస్సామ వేదాల నుండి, నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి మూడు పాదాల్లో ఐరవైనాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యస్తమయం కంటె ముదుగాను అచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈఉపాసనవల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవృక్ష సమీపంలో, నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం.

"తస్మాత్‌ సర్వే ద్విజా శ్శాక్తాః న శైవా న చ వైష్ణవాః"

ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసే వారే కనుక, వారు వైష్ణవులైనా, శైవులైనా- ముందుగా అందరూ శాక్తేయులు.

గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలూ సృష్టిలోని ఇరవై నాలుగ తత్త్వాలకు సంకేతాలు, కర్మేంద్రియాలు ఐదు. (కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు) జ్ఞానేంద్రియాలు ఐదు, (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) , పంచప్రాణాలు(ప్రాణ, %్‌పాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు), పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు(అంతఃకరమ చతుష్టయం) కలసి సృష్టిలోని ఇరవై నాలగు తత్త్వాలు.

జీవుడు ఇరవై అయిదవవాడు. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై అయిదు అక్షరాలు అవుతాయి.

ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి. ఒక్కొక్క చంధస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. ఇరవై నాలుగు, రంగులు, ఇరవై నాలుగు శక్తులు, ఇరవైనాలుగు ముద్రలూ గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి, కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.

ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే చందస్సు. పరాశక్తియే దేవత.

గాయత్రీ దేవతకు ఐదు ముఖాలు. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు పదిచేతులు. కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను , మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ అంకుశ కళాది శక్తులనూ ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి, సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి.

"ఓ జగన్మాతా!నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకూ దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను #9; ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.

హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక బావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, గరిష్ఠా, వరారోహ, నీలగంగా, సంధ్యా, భోగమోక్షదా అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు.

మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది. నీవే. త్రిలోత వాసులనూ తరింప చేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు.

ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణ నాడులూ నీవే. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి

నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే" అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు.

ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి, గాయత్రీ సహస్ర నామాలను, దీక్షావిధానాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.

జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు.

వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి, శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే, సర్వశక్తులూ స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక.

గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి, దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింప చేశాడు.

"నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే|é

వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి||

భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం|

తుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం|| "

అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి, ఆమె పరిపూర్ణనుగ్రహానికి పాత్రుడయ్యాడు.

గాయత్రీ దేవతానుగ్రహం చేత

తమ మహర్షి సమృద్ధిగా అన్నపు రాసులనూ, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యుడు.

కనుక, జనమేజయ మహారాజా! గాయత్రీ రూపాన్నీ మనసులో భావించినా, ఆమెను పూజించినా, ఆమె మంత్రాన్ని జపించినా, సర్వారిష్టాలు తొలగి, సకల సంపదలూ లభిస్తాయి.

గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరచి, లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు.

గాయత్రీ మంత్ర శక్తిని సద్వినియోగం చేసి, గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి, లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు.

కనుక మంత్ర శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని, స్వార్థంతో, అహంకారంతో, ఆ శక్తిని దుర్వినియోదం చేయరాదు.

ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు.

🌷శ్రీ మాత్రే నమః🌷

Wednesday, January 22, 2020

ధర్మాత్ములు ఎవరంటే. ధర్మోరక్షతి రక్షితః ..ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

ధర్మాత్ములు ఎవరంటే..


ధర్మోరక్షతి రక్షితః ..ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనిషి ధర్మాన్ని ఆధారం చేసుకొని నడిచి తీరవల్సిందే! ధర్మాన్ని పాటించని వారు అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ‘వ్యక్తి తన బాధ్యతగా నిర్వర్తించవలసిన కర్మలను పద్ధతిగా ఆచరించడమే ధర్మం’ అని శాస్త్ర వచనం. కన్న పిల్లల్ని పద్ధతిగా పెంచడం మాతృధర్మం అయితే, ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ పాటించేటట్టు చూడడం పితృధర్మంగా చెబుతారు. మైనపు ముద్దలైన బాలబాలికలను విద్యతో తీర్చిదిద్ది సమాజంలోకి పంపడం గురుధర్మం. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను పాటించినప్పుడే సమాజమైనా, దేశమైనా పచ్చగా ఉండి నాలుగు కాలాల పాటు మనగలుగుతాయి.
 
జహాఁదయా తహాఁధర్మ్‌ హై, జహాఁలోభ్‌ వహాఁపాప్‌
జహాఁక్రోధ్‌ తహాఁకాల్‌ హై, జహాఁక్షమా వహాఁఆప్‌
 
..ధర్మం, దాని ముఖ్య లక్షణాలైన దయ, క్షమ వంటివాటిని ఆధారంగా చేసుకుని మహాత్మా కబీరు చెప్పిన పద్యమిది. ఎక్కడ దయకు స్థానం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ క్షమ ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది. లోభం ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. కోపం ఎక్కడ ఉంటుందో అక్కడికి మృత్యువు పిలువని పేరంటంగా వచ్చి సర్వనాశనం చేస్తుంది. మనిషి ధర్మాన్ని పాటించినప్పుడే సుఖసంతోషాలతో సంతృప్తిగా జీవించగలడని దీని అర్థం. అందుకే మన పురాణేతిహాసాలు ధర్మానికి పెద్దపీట వేశాయి. రామాయణంలో ధర్మానికి అద్దం పట్టే ఎన్నో ఘట్టాలున్నాయి. ఉదాహరణకు.. శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రుషులు, మునులు వచ్చి తాము రాక్షసుల వల్ల పడే బాధల గురించి చెప్పుకుంటే.. రాముడు వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసి వారందరిని సంహరిస్తుంటాడు. దీన్ని గమనించిన సీతమ్మ తల్లి ఒకరోజు.. ‘మనం వచ్చింది మీ నాన్నగారి మాట పాటించడానికి అనేది మరిచి రాక్షసులను చంపుతున్నారు. ఇది ఎంతవరకు సరియైునదో నాకు అర్థం కావట్లేదు’ అంటుంది. ఆమె మాటలు విన్న రాముడు.. ‘నేను క్షత్రియుణ్ని. అయోధ్యయినా అరణ్యమైనా నాకు ఒక్కటే. కాబట్టి, నేను రాజధర్మాన్ని పాటిస్తూ చెడును సంహరించి మంచిని కాపాడుతున్నాను’ అని సమాధానమిచ్చాడు.
  
ధర్మానికి పది లక్షణాలున్నాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి. అవేంటంటే.. ధృతి (ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండడం), దమం (మనసును అదుపులో పెట్టకోవడం), క్షమ (సహనం కలిగి ఉండడం), శౌచం (శారీరక, మానసిక శుభ్రత పాటించడం), అస్తేయం (మరొకరికి సొత్తుకు ఆశపడకుండడం.. దొంగతనాలు చేయకుండా ఉండడం), ధీ (బుద్ధి కలిగి ఉండడం), విద్య (మంచి చెడులు విశ్లేషించి ప్రవర్తించడం), సత్యం (నీతి నిజాయితీతో జీవించడం), అక్రోధం (భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని వ్యవహరించడం) ఇంద్రియ నిగ్రహం (కోరికలకు కళ్లెం వేయడం). ఈ పది లక్షణాలనూ కలిగి ఉన్నవారు ధర్మాత్ములు.

Monday, January 6, 2020

How To recover deleted messages from WHATTSAPP?

WhatsApp is now owned by Facebook.  It is a popular messaging app and is being utilized by all smartphone users. it. WHATSAPP messaging application now globally has over 1.5 billion active Users. 


WhatsApp is a good feature-packed application. New features are being added to the app regularly. One of its basic features is its ability to clear all messages, whether it is private messages or group messages can be cleaned at once. 


It is easy to clear all the messages at once, without having to select messages one by one. However, it happens sometimes that you might have accidentally deleted some important messages and now want to recover them back.

There are two ways to get back deleted messages in WHATTSAPP. 


How to recover deleted WhatsApp messages


Recover via local storage


This method however is applicable only for Android users and does not work on iOS. 


Open the file browser on your device.

Go to WhatsApp > Database. The database contains all the WhatsApp backup files that are stored locally.

Select the ‘msgstore.db.crypt12’ file and long press it and click on edit name. Now, rename it to ‘msgstore_backup.db.crypt12’. We have renamed the file to prevent it from being overwritten.

Now, select the most recent backup file and rename it to ‘msgstore.db.crypt12’.

Now, open Google Drive on your phone and tap on the three vertical lines menu at the top right corner.

Tap on ‘Backups’ and delete your WhatsApp backup.

Now, uninstall WhatsApp and re-install it. While installing, you will be asked to restore WhatsApp from a local backup as you don’t have a cloud backup anymore.

Select the ‘msgstore.db.crypt12’ file and tap the ‘Restore’ button.

Your messages have been restored from your most recent backup. 


Recover via cloud backup


You can also recover your WhatsApp messages from Google Drive or iCloud. 


Uninstall WhatsApp from your Android phone or iPhone.

Reinstall WhatsApp and login using the same phone number.

Now, you can restore your messages from Google Drive or iCloud. Tap on ‘Restore’ to begin the process.

Your messages will be restored.

It must be noted that if the message was deleted after the cloud backup, you cannot restore it. 


_A Landmark Supreme Court Judgment Every Lift User Should Know._* 30th July 2026

*_A Landmark Supreme Court Judgment Every Lift User Should Know._* Millions of Indians use elevators every day—in apartment complexes, offic...