Thursday, July 15, 2021

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

మనసును శుద్ధి చేసుకోవడం ఎలా...

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!

----ఆదిశంకరుల శివానందలహరి నుండి...

విశేషం_ పుణ్యాహవాచనం :

ఇది యొక శుద్ధి కర్మ.  ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై యుంచి
మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని
పొందుతారు.

తాత్పర్యము :

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి
పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను ౘుట్టి , సంతోషము అనే
 నీటితో నింపిన నామనస్సు  అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ
రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.
( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం ).

వివరణ:

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,
అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 
పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా 
ౘల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ 
ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు. అలాగే భక్తుల
హృదయాలు అరిషడ్వర్గాలతో , అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య
క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు.

శంకరులు ఇలా చెప్పారు.   ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప.
దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదింౘాలి.
 దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి. పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. ముందుగా
కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  నామనస్సనే కలశం ప్రసన్నంగా 
స్వచ్ఛంగా వుంది.  కలశానికి దారాలు ఛుట్టాలి. నేను నాభక్తి అనే దారాలు
 ఆ కలశానికి ౘుడతాను. నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను.
కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 
దొరికిన ఆ చిగుళ్ళు. అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను. ఇంక కలశంపై ఒక ఫలం ఉంౘాలి. 
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. తరువాత 
మంత్రాలు ౘదవాలి.  నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని 
ౘదువుతాను. ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ,
వాక్కూ పవిత్రమవుతాయి. 
ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం
మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపింౘాలని  ఈ శ్లోకం ద్వారా
శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.


జై శ్రీమన్నారాయణ🙏

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...