Saturday, May 25, 2024

అయోధ్యవిడిచి వెడతాను : శరీరామాచందరడు

అయోధ్యవిడిచి వెడతాను :

రాముడు కైకమందిరాన్ని చేరుకొని, తండ్రికి నమస్కరించి 'పిలుపుకు
కారణమేమని ' అడిగాడు. అందుకు కైకేయి; రామా ! మీ తండ్రిగారు నిన్ను
పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చేయమనీ, భరతుడికి పట్టాభిషేకం
జరపాలని - ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ పాటిస్తే, వారికి
మనశ్శాంతి కలుగుతుంది. లేకపోతే మన వంశానికే
అపఖ్యాతి వస్తుంది” అన్నది. వెంటనే రాముడు “తండ్రి
ఆజ్జ్ఞననుసరించడమే కొడుకుల ధర్మం, కాబట్టి తండ్రి
ఆజ్ఞను శిరసావహించదలచాను. నేను ఈ రోజే
అయోధ్యను విడిచి అరణ్యానికి వెడతాను.
భరతుణ్ణి పిలిపించి పట్టాభిషేకం జరిపించండి.
అని తండ్రికి కైకేయికి నమస్కరించి, సెలవు
తీసుకున్నాడు. దశరథుడు కుమారుణ్ణి విడవళి
మారు మాట్లాడలేక ఊరుకున్నాడు.

*శ్రీ సూక్తులు*

 *శ్రీ సూక్తులు* 
 అందరూ మనవాళ్ళే అనుకోవడం తప్పుకాదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకోవడం తప్పు ఉక్కును తుప్పు నాశనం చేస్తుంది మనలోని అహం మనల్ని ధ్వంసం చేస్తుంది మనం చేసే పని ఎంతమంది చూసారన్నది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగ పడిందన్నది ముఖ్యం మంచి పని చేసేటప్పడు మనం కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనబడితే చాలు మనలోని చెడు మనకు మాత్రమే తెలియాలి మనలోని మంచి ప్రపంచమంతా వెలగాలి మనలోని లోపాలు మనలోనే దాగాలి మనలోని ప్రతిభ జగమంతా ఎగరాలి మనసు... మేఘం రెండూ ఒకటే మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో వదిలేస్తుంది మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో వదిలేస్తుంది మాట్లాడాలి అనుకునే వారికి "సమయం" దొరుకుతుంది , వద్దు అనుకునే వారికి "సాకు" దొరుకుతుంది కోరికలను జయించాలి .. లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యం అవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది మనిషి మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ధృడంగా తయారవుతారు ఇదే జీవిత సత్యం సర్వే జనా సుఖినోభవంతు 
 *శుభోదయం

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...