Tuesday, July 28, 2020

*జీవిత* *సత్యం* : - 🙏

*జీవిత* *సత్యం* : - 🙏

చాలామంది అనుకుంటారు...
ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత...
స్నానం చేసి పూజ చేయొచ్చు అని.‌..
ఇంట్లో పని అంతా అయిపోయి...
అలసిపోయి , అప్పుడు స్నానం చేసి...
ఏకాగ్రత లేని మనసుతో పూజను చేస్తారు...
కానీ అది చాలా పొరపాటు...
కనీసం ఉదయం ఆరుగంటల లోపు లేచి...
ముందుగా కాలకృత్యాలు తీర్చుకోవాలి...
ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు...
మనలో ఉన్న చెడు పదార్థాలన్నీ...
నూనె రూపంలో బయటకు వస్తాయి...
నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం వలన...
ఈ చెడు పదార్థాలు అన్నీ బయటకుపోయి శరీరం శుభ్రం అవుతుంది...
ఆ తరువాత ముందుగా దీపారాధన చేయాలి...
ఆ తర్వాతే స్తోత్రాలూ...
నైవేద్యాలూ అన్నీ సమర్పించాలి...
అన్నిటికన్నా దీపారాధన ముఖ్యం...
ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం...
భగవంతుడు జ్యోతి స్వరూపుడు...
మనలో ఉన్న ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే...
అందుకని మనం ఏమి సమర్పించినా కూడా...
ఆయన ఈ దీపారాధన ద్వారానే స్వీకరిస్తాడు...
అంతే కాకుండా...
ఈ దీపారాధన వల్ల పరిసరాలు పరిశుభ్రమై...
ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది...
రోజూ ఆవునేతితో దీపం వెలిగించడం...
ఎంతో శ్రేయస్కరం...
ఆరోగ్యదాయకం...
చాలామంది దీపాలకే కదా అని నాసిరకం నూనె వాడేస్తుంటారు...
కానీ దానివల్ల ఇంకా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది...
మనం పదార్థాలను తింటే వచ్చే శక్తి కన్నా...
వాయు రూపంలో పీల్చడం వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది...
అందువల్ల దీపానికి వాడే నూనె పట్ల శ్రద్ధ వహించాలి...
మంచి విషయం అయితే తొందరగా తెలియదు గాని...
చెడు విషయాన్ని ఉదాహరణగా తీసుకుందాం...
ఒక విష పదార్థాన్ని తినేకన్నా...
విషవాయువులు పిలిస్తేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది...
అదేవిధంగా ఇది కూడా...
అందరూ సూర్యోదయానికి ముందే...
ఈ దీపారాధన చేసే విధానం వల్ల...
మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది...

 *సర్వేజనా* *సుఖినోభవంతుః* 🙏

 *జై* *శ్రీ* *కృష్ణా* ...💐🙏
                                  *సుధ*

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...